Modi: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రతి నెల చివరి ఆదివారం మన్ కీ బాత్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న సంగతి మనకు తెలిసిందే. అయితే తాజాగా ఈ కార్యక్రమం 117వ ఎపిసోడ్లో ఆయన పలు కీలక విషయాలు పంచుకున్నారు. ఈసారి టాలీవుడ్ స్టార్ నటుడు అక్కినేని నాగేశ్వరరావు గారి గురించి ప్రస్తావనకు తీసుకువచ్చారు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో అక్కినేని నాగేశ్వరరావు గారి పాత్ర ఆయన తెలుగు సినిమాను మరో స్థాయికి తీసుకువెళ్లారు అంటూ కొనియాడారు.
అక్కినేని నాగేశ్వరరావు నటించే సినిమాలలో భారతీయ సంప్రదాయాలు, విలువలను చాలా బాగా చూపించేవారని పేర్కొన్నారు. ఇలా టాలీవుడ్ నటుడు అక్కినేని నాగేశ్వరరావు గురించి అదే విధంగా పలువురు బాలీవుడ్ నటీనటుడు దర్శకుల గురించి కూడా ఈ కార్యక్రమంలో మోడీ ప్రస్తావిస్తూ వారిపట్ల ప్రశంసలు కురిపించారు.
ఈ కార్యక్రమంలో నరేంద్ర మోడీ ఏఎన్ఆర్ పేరును ప్రస్తావిస్తూ ఎన్టీఆర్ పేరును మర్చిపోయారు దీంతో ఎన్టీఆర్ అభిమానులు మోడీ పట్ల విమర్శలు కురిపిస్తున్నారు. మన తెలుగు సినిమా ఇండస్ట్రీని జాతీయ స్థాయికి తీసుకు వెళ్లినటువంటి వారిలో ఎన్టీఆర్ ఏఎన్నార్ కీలక పాత్రలు పోషించారు. తెలుగు సినిమా ఇండస్ట్రీకి వీరిద్దరూ రెండు కళ్ళు లాంటివారని చెబుతూ ఉంటారు.
ఇండస్ట్రీకి రెండు కళ్ళు..
ఈ క్రమంలోనే నరేంద్ర మోడీ నిర్వహించే మన్ కీ బాత్ కార్యక్రమంలో ఏఎన్నార్ గురించి ఎంతో గొప్పగా మాట్లాడుతూ కనీసం ఎన్టీఆర్ పేరును కూడా ప్రస్తావించకపోవడం పట్ల అభిమానులు విమర్శలు కురిపిస్తున్నారు.
మెగాస్టార్ చిరంజీవి కెరీర్లో ఎన్నో బ్లాక్బస్టర్ చిత్రాలు వచ్చినా, ప్రేక్షకుల మదిలో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న సినిమాల్లో ‘పసివాడి ప్రాణం’…
చూపు లేకపోయినా సంగీతంతో కోట్ల హృదయాలను గెలుచుకున్న గాయని వైకమ్ విజయలక్ష్మి జీవితం నిజంగా ఎంతో మందికి స్ఫూర్తిదాయకం. చిన్నప్పటి…
మహాభారతం భారతీయ ఇతిహాసాల్లో అత్యంత ప్రాముఖ్యత కలిగిన మహాగ్రంథంగా గుర్తింపు పొందింది. ధర్మం, అధర్మం మధ్య జరిగిన కురుక్షేత్ర యుద్ధం…
భారతీయ సంప్రదాయంలో రత్నాలకు ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. అందులోనూ ముత్యాలు ఎప్పటినుంచో పవిత్రత, ప్రశాంతత, శుభానికి ప్రతీకగా భావించబడుతున్నాయి. తెల్లని…
వివాహం అనేది ఇద్దరి మనుషుల మధ్య బంధమే కాదు, వారి ఆలోచనలు, స్వభావాలు, జీవన విధానాల కలయిక కూడా. వేద…
హిందూ సాంప్రదాయంలో కొన్ని మొక్కలకు ప్రత్యేకమైన ఆధ్యాత్మిక ప్రాధాన్యం ఉంటుంది. వాటిలో పారిజాతం మొక్కకు ఎంతో విశిష్ట స్థానం ఉంది.…