Modi: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రతి నెల చివరి ఆదివారం మన్ కీ బాత్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న సంగతి మనకు తెలిసిందే. అయితే తాజాగా ఈ కార్యక్రమం 117వ ఎపిసోడ్లో ఆయన పలు కీలక విషయాలు పంచుకున్నారు. ఈసారి టాలీవుడ్ స్టార్ నటుడు అక్కినేని నాగేశ్వరరావు గారి గురించి ప్రస్తావనకు తీసుకువచ్చారు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో అక్కినేని నాగేశ్వరరావు గారి పాత్ర ఆయన తెలుగు సినిమాను మరో స్థాయికి తీసుకువెళ్లారు అంటూ కొనియాడారు.
అక్కినేని నాగేశ్వరరావు నటించే సినిమాలలో భారతీయ సంప్రదాయాలు, విలువలను చాలా బాగా చూపించేవారని పేర్కొన్నారు. ఇలా టాలీవుడ్ నటుడు అక్కినేని నాగేశ్వరరావు గురించి అదే విధంగా పలువురు బాలీవుడ్ నటీనటుడు దర్శకుల గురించి కూడా ఈ కార్యక్రమంలో మోడీ ప్రస్తావిస్తూ వారిపట్ల ప్రశంసలు కురిపించారు.
ఈ కార్యక్రమంలో నరేంద్ర మోడీ ఏఎన్ఆర్ పేరును ప్రస్తావిస్తూ ఎన్టీఆర్ పేరును మర్చిపోయారు దీంతో ఎన్టీఆర్ అభిమానులు మోడీ పట్ల విమర్శలు కురిపిస్తున్నారు. మన తెలుగు సినిమా ఇండస్ట్రీని జాతీయ స్థాయికి తీసుకు వెళ్లినటువంటి వారిలో ఎన్టీఆర్ ఏఎన్నార్ కీలక పాత్రలు పోషించారు. తెలుగు సినిమా ఇండస్ట్రీకి వీరిద్దరూ రెండు కళ్ళు లాంటివారని చెబుతూ ఉంటారు.
ఇండస్ట్రీకి రెండు కళ్ళు..
ఈ క్రమంలోనే నరేంద్ర మోడీ నిర్వహించే మన్ కీ బాత్ కార్యక్రమంలో ఏఎన్నార్ గురించి ఎంతో గొప్పగా మాట్లాడుతూ కనీసం ఎన్టీఆర్ పేరును కూడా ప్రస్తావించకపోవడం పట్ల అభిమానులు విమర్శలు కురిపిస్తున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…