Featured

Mohan Babu : మోహన్ బాబుకు గడ్డుకాలం.. ఆ 3 సంవత్సరాలు వరుసగా 6 చిత్రాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి.!!

విలక్షణ నటుడు మోహన్ బాబు 1975లో “స్వర్గం నరకం” చిత్రంతో సినీ పరిశ్రమలోకి అడుగు పెట్టారు. ఆయన సుదీర్ఘ సినీ ప్రయాణంలో దాదాపు 500 పైగా సినిమాలలో నటించారు. 70కి పైగా చిత్రాలను నిర్మించి, అనేక విజయాలను అందుకున్నారు. మోహన్ బాబు సినీ ప్రయాణంలో విజయాలతో పాటు 1992, 1993, 1994 సంవత్సరలలో కొంత గడ్డు పరిస్థితిని ఎదుర్కొన్నారని చెప్పవచ్చు. ఆ సంవత్సరాలలో మోహన్ బాబు హీరోగా నటించిన చిత్రాలు పరాజయాన్ని పొందాయి.

సీనియర్ వంశీ దాదాపు పాతిక చిత్రాలను నిర్మించిన గుర్తుండిపోయే చిత్రాలను నిర్మించారు. అలా విచిత్రంగా మోహన్ బాబుతో “డిటెక్టివ్ నారద” చిత్రాన్ని రూపొందించారు. 1992 సమీర్ ఎంటర్ప్రైజెస్, సీనియర్ వంశీ దర్శకత్వంలో “డిటెక్టివ్ నారద” చిత్రం విడుదలయ్యింది. ఈ సినిమాలో మోహన్ బాబు, మోహిని హీరో, హీరోయిన్లుగా నటించారు. డిటెక్టివ్ పాత్రలో మోహన్ బాబు కనిపించి ప్రేక్షకులను ఆశ్చర్యానికి గురిచేశారు. అయినప్పటికీ ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద తీవ్ర నిరాశను మిగిల్చింది. అసెంబ్లీ రౌడీ చిత్రం తర్వాత దివ్యభారతితో రెండోసారి మోహన్ బాబు జతకట్టారు.

1992 శ్రీధర్ రెడ్డి నిర్మాణం, ఏ.కోదండరామిరెడ్డి దర్శకత్వంలో “చిట్టెమ్మ మొగుడు” చిత్రం విడుదలయ్యింది. ఈ సినిమాలో మోహన్ బాబు దివ్యభారతి హీరో, హీరోయిన్లుగా నటించారు. అప్పటి వరకు దివ్యభారతిని గ్లామర్ పాత్రల్లో చూసిన ప్రేక్షకులు ఒక్కసారి ఫ్యామిలీ పాత్రలో ఊహించుకోలేకపోయారు. ఏ.కోదండరామిరెడ్డి దర్శకత్వంలో విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించి విజయాలను మోహన్ బాబు అందుకున్నప్పటికీ ఆయన దర్శకత్వంలో హీరోగా నటించిన “చిట్టెమ్మ మొగుడు” చిత్రం పరాజయం పొందింది.

1992 గోపి ఆర్ట్ పిక్చర్స్, చలసాని గోపి నిర్మాణం, కె.ఎస్.ప్రకాష్ దర్శకత్వంలో “దొంగా పోలీస్” చిత్రం విడుదలైంది. ఈ సినిమాలో మోహన్ బాబు, మమతాకులకర్ణి హీరో, హీరోయిన్లుగా నటించారు. మోహన్ బాబు ఈ సంవత్సరంలో నటించిన మిగతా చిత్రాలతో పోలిస్తే ఈచిత్రం పర్వాలేదనిపించింది. 1993 స్రవంతి మూవీస్, స్రవంతి రవికిషోర్ నిర్మాణం, ఏ మోహన్ గాంధీ దర్శకత్వంలో “రౌడీ మొగుడు” చిత్రం విడుదలయ్యింది. ఈ సినిమాలో మోహన్ బాబు, విజయశాంతి హీరో, హీరోయిన్లుగా నటించారు. మోహన్ గాంధీ, స్రవంతి రవి కిషోర్, మోహన్ బాబు ఈ అరుదైన కాంబినేషన్ లో వచ్చిన సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది.

1993 లక్ష్మీప్రసన్న పిక్చర్స్,దాసరి నారాయణరావు దర్శకత్వంలో “కుంతీపుత్రుడు” చిత్రం విడుదలయ్యింది. ఈ సినిమాలో మోహన్ బాబు, విజయశాంతి హీరో, హీరోయిన్లుగా నటించారు. దాసరి నారాయణరావు దర్శకత్వంలో ఎన్నో చిత్రాల్లో నటించినప్పటికీ ‘కుంతీ పుత్రుడు’ చిత్రం బాక్సాఫీస్ వద్ద పరాజయం పొందింది.

1994 రమణమూర్తి నిర్మాణం, రవిరాజా పినిశెట్టి దర్శకత్వంలో “యమధర్మరాజు ఎమ్.ఎ”చిత్రం విడుదలైంది. ఈ సినిమాలో మోహన్ బాబు, రంభ, సురభి హీరో, హీరోయిన్లుగా నటించారు. అలనాటి నటి సుజాత మరో ప్రధాన పాత్రలో కనిపించారు. రాజ్ కోటి స్వరపరిచిన గీతాలు ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాయి. మోహన్ బాబు ఈ చిత్రంలో ద్విపాత్రాభినయంలో కనిపించారు. పోలీసుగా రాజకీయ నాయకుడిగా రెండు పాత్రల్లో కనిపించిన ఆయన సినిమా విజయాన్ని గట్టెక్కించలేకపోయారు. ఇలా మోహన్ బాబు మూడు సంవత్సరాలు పరాజయాలతో చతికిల పడ్డారు.

Lavanya Suresh

Lavanya Suresh is Senior News Reporter in Telugudesk.net. Lavanya Suresh covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

మరిన్ని ప్రాంతాలకు నైరుతి రుతుపవనాలు..మూడు రోజుల పాటు వర్షాల హెచ్చరిక.!

ఆంధ్రప్రదేశ్‌లో నైరుతి రుతుపవనాలు క్రమంగా బలపడుతున్నాయి. రాష్ట్రంలోని మరిన్ని ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించడంతో వాతావరణ పరిస్థితుల్లో స్పష్టమైన మార్పులు కనిపిస్తున్నాయి.…

12 hours ago

విజయ్-సంగీత కలిసి ఉంటున్నారా? కోలీవుడ్‌లో కొత్త చర్చ..

తమిళ సినీ పరిశ్రమలో స్టార్ హీరోగా, ప్రస్తుతం రాజకీయ నాయకుడిగా కొనసాగుతున్న విజయ్ పేరు మరోసారి వార్తల్లో నిలిచింది. అయితే…

12 hours ago

ఒకడే కాదు.. తమ్ముడు కూడా టాప్ క్లాస్! సూర్యవంశీ కుటుంబంలో మరో క్రికెట్ స్టార్..

భారత క్రికెట్‌లో కొత్త తరానికి చెందిన యువ ప్రతిభలు వరుసగా వెలుగులోకి వస్తున్నాయి. అందులో ముఖ్యంగా సూర్యవంశీ కుటుంబం పేరు…

12 hours ago

రూ.30 వేల అప్పు కోసం దారుణం.. స్నేహితుడినే హత్య చేసిన ఇద్దరు యువకులు..

నల్లగొండ జిల్లాలో స్నేహం అనే బంధాన్ని ప్రశ్నార్థకంగా మార్చే ఘటన వెలుగులోకి వచ్చింది. కొంతకాలంగా స్నేహితులుగా కలిసి తిరుగుతున్న ఇద్దరు…

14 hours ago

ఎలాన్ మస్క్ సంపద ఎంత తెలుసా?.. ప్రపంచ జనాభాకు పంచితే ఒక్కొక్కరికి ఎంత వస్తుంది?ఆశ్చర్యపరిచే లెక్కలు ఇవే!

ప్రపంచంలో అత్యంత ధనవంతుల జాబితా గురించి చర్చ వచ్చినప్పుడల్లా ముందుగా వినిపించే పేరు ఎలాన్ మస్క్. సాంకేతిక రంగం, అంతరిక్ష…

14 hours ago

హైడ్రా కమిషనర్ రంగనాథ్‌కు హైకోర్టు షాక్..జరిమానా విధించిన న్యాయస్థానం..

హైదరాబాద్‌లో చెరువుల పరిరక్షణ, ప్రభుత్వ భూముల సంరక్షణ, అక్రమ నిర్మాణాల తొలగింపు వంటి చర్యలతో తరచూ వార్తల్లో నిలిచే హైడ్రా…

14 hours ago