Jonna Vitthula Ramalingeswara Rao: మోహన్ బాబు ధన మదంతో అలా చేస్తే నాపై కేసు వేశారు: జొన్నవిత్తుల
Jonna Vitthula Ramalingeswara Rao: టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతో మంచి పేరు సంపాదించుకున్న జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు గురించి అందరికీ తెలిసిందే. ఈయన ఎన్నో సినిమాలకు అద్భుతమైన పాటలను అందించి ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపును సంపాదించుకున్నారు.ఇదిలా ఉండగా తాజాగా జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు ఒక ఇంటర్వ్యూలో పాల్గొని మోహన్ బాబు గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు.
మోహన్ బాబు కుమారుడు మంచు విష్ణు నటించిన దేనికైనా రెడీ సినిమా సమయంలో తనపై అనవసరంగా కేసులు వేశారని ఈ సందర్భంగా ఆయన వెల్లడించారు.దేనికైనా రెడీ సినిమా విడుదల సమయంలో ఎంతో మంది బ్రాహ్మణులు రోడ్డుపైకి వచ్చి పెద్ద ఎత్తున ఆ సినిమా గురించి నినాదాలు చేస్తూ ఆ సినిమాని బ్యాన్ చేయాలని బ్రాహ్మణులకు బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.
ఈ క్రమంలోనే ఈయన అప్పటి వరకు ఆ సినిమా చూడలేదని ఇలా బ్రాహ్మణులు గొడవ చేయడానికి కారణం ఏంటి అని ఆ సినిమా చూడటానికి వెళ్లానని ఆ సినిమాలో బ్రాహ్మణులను కించపరుస్తూ మాట్లాడిన మాటలు పట్ల తనకు కూడా కోపం వచ్చిందని తెలిపారు.ఒక చండీయాగం చేయడానికి బ్రాహ్మణుడు రాకపోతే డబ్బు పడేస్తే తోక ఊపుతూ వస్తారని ఆ సినిమాలో అనడం నిజంగా బాధాకరమని, మరొక బ్రాహ్మణుడి భార్య పరాయి వ్యక్తిని చూసి మీరు అచ్చం మా ఆయన ఉన్నారు అంటూ చెప్పిన డైలాగులు నిజంగానే బ్రాహ్మణుడిని కించపరిచినట్లు ఉందని ఆయన బహిరంగంగా తెలిపారు.
ఈ విధంగా జొన్నవిత్తుల న్యూస్ డెబిట్ లలో ఈ విషయం గురించి మాట్లాడుతూ ఇది తప్పు అని చెప్పారు. అయితే ఇలా చెప్పినందుకు ఓ రెండు నెలల తర్వాత తనపై కేసు వేశారనీ ఈ సందర్భంగా దేనికైనా రెడీ సినిమా గురించి తెలిపారు.అయితే ఇప్పటివరకు ఈ విషయం గురించి తాను మోహన్ బాబును కలిసి డైరెక్ట్ గా మాట్లాడలేదని అయినా వారు డబ్బు మదంతో ఇలాంటి సినిమాలు చేసి అది తప్పు అని చెప్పినందుకు నాపై కేసులు వేశారని ఈ సందర్భంగా తెలియజేశారు.
ఆంధ్రప్రదేశ్లో నైరుతి రుతుపవనాలు క్రమంగా బలపడుతున్నాయి. రాష్ట్రంలోని మరిన్ని ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించడంతో వాతావరణ పరిస్థితుల్లో స్పష్టమైన మార్పులు కనిపిస్తున్నాయి.…
తమిళ సినీ పరిశ్రమలో స్టార్ హీరోగా, ప్రస్తుతం రాజకీయ నాయకుడిగా కొనసాగుతున్న విజయ్ పేరు మరోసారి వార్తల్లో నిలిచింది. అయితే…
భారత క్రికెట్లో కొత్త తరానికి చెందిన యువ ప్రతిభలు వరుసగా వెలుగులోకి వస్తున్నాయి. అందులో ముఖ్యంగా సూర్యవంశీ కుటుంబం పేరు…
నల్లగొండ జిల్లాలో స్నేహం అనే బంధాన్ని ప్రశ్నార్థకంగా మార్చే ఘటన వెలుగులోకి వచ్చింది. కొంతకాలంగా స్నేహితులుగా కలిసి తిరుగుతున్న ఇద్దరు…
ప్రపంచంలో అత్యంత ధనవంతుల జాబితా గురించి చర్చ వచ్చినప్పుడల్లా ముందుగా వినిపించే పేరు ఎలాన్ మస్క్. సాంకేతిక రంగం, అంతరిక్ష…
హైదరాబాద్లో చెరువుల పరిరక్షణ, ప్రభుత్వ భూముల సంరక్షణ, అక్రమ నిర్మాణాల తొలగింపు వంటి చర్యలతో తరచూ వార్తల్లో నిలిచే హైడ్రా…