Jonna Vitthula Ramalingeswara Rao: మోహన్ బాబు ధన మదంతో అలా చేస్తే నాపై కేసు వేశారు: జొన్నవిత్తుల
Jonna Vitthula Ramalingeswara Rao: టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతో మంచి పేరు సంపాదించుకున్న జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు గురించి అందరికీ తెలిసిందే. ఈయన ఎన్నో సినిమాలకు అద్భుతమైన పాటలను అందించి ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపును సంపాదించుకున్నారు.ఇదిలా ఉండగా తాజాగా జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు ఒక ఇంటర్వ్యూలో పాల్గొని మోహన్ బాబు గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు.
మోహన్ బాబు కుమారుడు మంచు విష్ణు నటించిన దేనికైనా రెడీ సినిమా సమయంలో తనపై అనవసరంగా కేసులు వేశారని ఈ సందర్భంగా ఆయన వెల్లడించారు.దేనికైనా రెడీ సినిమా విడుదల సమయంలో ఎంతో మంది బ్రాహ్మణులు రోడ్డుపైకి వచ్చి పెద్ద ఎత్తున ఆ సినిమా గురించి నినాదాలు చేస్తూ ఆ సినిమాని బ్యాన్ చేయాలని బ్రాహ్మణులకు బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.
ఈ క్రమంలోనే ఈయన అప్పటి వరకు ఆ సినిమా చూడలేదని ఇలా బ్రాహ్మణులు గొడవ చేయడానికి కారణం ఏంటి అని ఆ సినిమా చూడటానికి వెళ్లానని ఆ సినిమాలో బ్రాహ్మణులను కించపరుస్తూ మాట్లాడిన మాటలు పట్ల తనకు కూడా కోపం వచ్చిందని తెలిపారు.ఒక చండీయాగం చేయడానికి బ్రాహ్మణుడు రాకపోతే డబ్బు పడేస్తే తోక ఊపుతూ వస్తారని ఆ సినిమాలో అనడం నిజంగా బాధాకరమని, మరొక బ్రాహ్మణుడి భార్య పరాయి వ్యక్తిని చూసి మీరు అచ్చం మా ఆయన ఉన్నారు అంటూ చెప్పిన డైలాగులు నిజంగానే బ్రాహ్మణుడిని కించపరిచినట్లు ఉందని ఆయన బహిరంగంగా తెలిపారు.
ఈ విధంగా జొన్నవిత్తుల న్యూస్ డెబిట్ లలో ఈ విషయం గురించి మాట్లాడుతూ ఇది తప్పు అని చెప్పారు. అయితే ఇలా చెప్పినందుకు ఓ రెండు నెలల తర్వాత తనపై కేసు వేశారనీ ఈ సందర్భంగా దేనికైనా రెడీ సినిమా గురించి తెలిపారు.అయితే ఇప్పటివరకు ఈ విషయం గురించి తాను మోహన్ బాబును కలిసి డైరెక్ట్ గా మాట్లాడలేదని అయినా వారు డబ్బు మదంతో ఇలాంటి సినిమాలు చేసి అది తప్పు అని చెప్పినందుకు నాపై కేసులు వేశారని ఈ సందర్భంగా తెలియజేశారు.
తెలంగాణకు చెందిన ఓ భక్తుడు తన భక్తిశ్రద్ధలను ప్రత్యేకంగా చాటుకున్నారు. హైదరాబాద్కు చెందిన ఈ భక్తుడు, ప్రసిద్ధ శైవక్షేత్రం శ్రీశైలం…
ఆంధ్రప్రదేశ్లోని ప్రముఖ వైష్ణవక్షేత్రాలలో ఒకటైన సింహాచలం దేవాలయంలో జరగబోయే చందనోత్సవానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ప్రతి ఏడాది విశేషంగా నిర్వహించే…
తమిళ సినీ నటుడు, తమిళక వెట్రి కళగం (TVK) పార్టీ అధినేత విజయ్ తాజాగా రాజకీయ కార్యక్రమాల్లో భాగంగా ఆధ్యాత్మిక…
ఉత్తరాఖండ్లో ప్రతి ఏడాది భక్తుల ఆధ్యాత్మిక ఆశలను నెరవేర్చే చార్ధామ్ యాత్ర ఈసారి కూడా ఘనంగా ప్రారంభమైంది. అక్షయ తృతీయ…
సినీ నటుడు ప్రకాశ్ రాజ్ ఇటీవల తన వ్యాఖ్యలపై చెలరేగిన వివాదానికి స్పందిస్తూ కీలక వివరణ ఇచ్చారు. రామాయణం, హిందూ…
ఇటీవలి కాలంలో బరువు తగ్గడం, షుగర్ నియంత్రణ కోసం వాడుతున్న GLP-1 తరహా మందులపై చర్చ పెరుగుతోంది. వైద్యుల సలహాతో…