Mokshagna: నందమూరి కుటుంబం నుండి ఇప్పటికే ఎంతోమంది హీరోలు ఇండస్ట్రీలో హీరోలుగా ఎంట్రీ ఇచ్చారు. ఈ క్రమంలో నటసింహం నందమూరి బాలయ్య తనయుడు ఎంట్రీ కోసం బాలయ్య అభిమానులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్నారు. అయితే మోక్షజ్ఞకు యాక్టింగ్పై ఇంట్రస్ట్ లేదని వార్తలు రావడంతో అభిమానులు నిరాశ చెందారు. ఆ తర్వాత అవి రూమర్స్ మాత్రమే అని క్లారిటీ వచ్చింది.
ఈ క్రమంలోనే మోక్షజ్ఞ ఎంట్రీ కోసం అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. మొత్తానికి ఆ శుభ తరుణం రానే వచ్చింది. త్వరలోనే మోక్షజ్ఞ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వనున్నట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.
ఈ విషయం గురించి అఫీషియల్ గా అనౌన్స్ చేయకపోయినా కూడా ఈ వార్తలలో నిజం ఉందని ఇండస్ట్రీ వర్గాల నుండి సమాచారం.
సింహ, లెజెండ్, అఖండ వంటి సినిమాలతో బాలయ్యకు హ్యాట్రిక్ హిట్స్ ఇచ్చిన బోయపాటి శ్రీను మోక్షజ్ఞను ఇండస్ట్రీలో లాంచ్ చేసే బాధ్యత తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఇందుకు సంబంధించి కథా చర్చలు కూడా జరుగుతున్నట్లు సమాచారం. బోయపాటి ప్రస్తుతం రామ్ పోతినేని సినిమాతో బిజీగా ఉన్నారు.
ఆ సినిమా పూర్తయిన తర్వాత బాలయ్యతో సినిమా చేయనున్నట్లు తెలుస్తోంది. ఆ సినిమాలోని తండ్రి కొడుకులిద్దరూ ఒకే స్క్రీన్ పై కనిపించనున్నట్లు సమాచారం.
సినిమాలో ఫ్లాష్బ్యాక్ ఎపిసోడ్లో మోక్షజ్ఞ కనిపిస్తారట. ఆ సినిమాలో మోక్షజ్ఞ గెస్ట్ రోల్లో కనిపించినప్పటికీ.. అది సినిమాకే హైలైట్గా నిలవనుందట. అయితే మోక్షజ్ఞ ఇండస్ట్రీ ఎంట్రీ గురించి వార్తలు వినిపించడంతో నందమూరి అభిమానులు సంబరాలు జరుపుకుంటున్నారు. ఎప్పుడెప్పుడు మోక్షజ్ఞని హీరోగా వెండితెరపై చూస్తామా అని ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. పైగా ఒకే స్క్రీన్ మీద బాలయ్య, మోక్షజ్ఞని కలిసి చూసే తరుణం ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…