General News

పట్టపగలు కదులుతున్న ట్రక్కును దోచేసిన దొంగలు.. ఎక్కడంటే?

సాధారణంగా దొంగతనం చేయాలంటే దొంగలు రాత్రి సమయాలలో ప్లాన్ చేస్తారు. మరి పట్టపగలు దొంగతనం చేస్తే ఎలా ఉంటుంది.ఈ విధంగా పట్టపగలు దొంగతనం చేసి దొరకకపోతే ఆ కిక్కే వేరు ఉంటుంది.కాని దొరికిపోతే ఆ ధారునమైన పరిస్థితి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇదివరకు “ధూమ్”, “ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్”వంటి సినిమాలలో కదులుతున్న వాహనాలలో ఉన్న అధిక మొత్తం నగదును దొంగలించే సీన్లను మనం చూసే ఉంటాం.

అచ్చం ఈ సినిమాల్లో మాదిరిగానే కదులుతున్న వాహనం నుంచి దొంగతనం జరిగిన ఘటన తాజాగా ఒకటి చోటు చేసుకుంది. అయితే ఈ దొంగతనం సినిమా అంత రేంజ్ లో కాక పోయినా, ఈ దొంగలు చేసిన దొంగతనం చూస్తే ఎంతో సరదాగా అనిపిస్తుంది. ఇంతకీ ఆ దొంగతనం ఏంటి? సరదాగా అనిపించడం ఏంటని ఆలోచిస్తున్నారా..

ఒక ట్రక్కు మామిడి పండ్లను తీసుకొని రోడ్డుపై వెళుతోంది. అయితే అందులో మామిడి పండ్లు ఉన్నాయని గమనించిన కోతులు ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా ప్రయాణిస్తున్న ఆ ట్రక్ పైకి ఎగ బడ్డాయి. కొన్ని కోతులు గుంపులు గుంపులుగా వచ్చి కదులుతున్న ఆ ట్రక్ లో ఉన్న మామిడి పండ్లను తీసుకొని వెళ్లాయి.

ఇది చూసిన మరి కొన్ని కోతులు కూడా మామిడి పండ్ల కోసం అదే పని చేశాయి. ఈ మామిడి పండ్ల కోసం కోతులు చేసిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారి ఎంతోమంది నెటిజన్లను ఆకట్టుకుంది. మరి ఇంకెందుకు ఆలస్యం ఈ స్మార్ట్ దొంగతనం చూసి మీరు కూడా ఆనందించండి.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

నైటీ వేసుకుందన్న కోపం.. భార్యపై నిప్పంటించిన భర్త

కర్ణాటక రాష్ట్రంలోని బెళగావి జిల్లాలో చోటుచేసుకున్న ఒక దారుణ ఘటన కుటుంబాల్లో పెరుగుతున్న అసహనం ఎంత ప్రమాదకరంగా మారుతుందో మరోసారి…

2 hours ago

సైన్స్ vs నమ్మకాలు.. పూరి జగన్నాథ్ ఆసక్తికర వ్యాఖ్యలు

సినీ దర్శకుడు పూరి జగన్నాథ్ తన కొత్త పాడ్‌కాస్ట్‌లో మరోసారి తనదైన స్టైల్‌లో ఆలోచింపజేసే విషయాలను ప్రస్తావించారు. ‘సైన్స్ అండ్…

2 hours ago

మెగాస్టార్ ఇంటి పక్కనే అల్లు అర్జున్ కలల గృహం.. రూ.80 కోట్ల మేన్షన్ నిర్మాణం

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన కెరీర్‌లోనే కాకుండా వ్యక్తిగత జీవితంలోనూ లగ్జరీకి ప్రాధాన్యత ఇస్తున్నట్లు మరోసారి రుజువైంది. ఇప్పటికే…

2 hours ago

నాదెండ్ల భాస్కర్ రావు ఇకలేరు.. విభిన్న రాజకీయ ప్రయాణం ముగిసింది

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర్ రావు కన్నుమూశారు. 90 ఏళ్ల వయసులో ఆయన బుధవారం ఉదయం తుదిశ్వాస…

2 hours ago

స్టార్ హీరోలు కూతుళ్లను సినిమాల్లోకి ఎందుకు పంపరంటే.. జేడీ షాకింగ్ కామెంట్స్

తెలుగు సినీ పరిశ్రమపై ఎప్పుడూ ముక్కుసూటిగా మాట్లాడే నటుడు జేడీ చక్రవర్తి తాజాగా మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు.…

2 hours ago

పెళ్లి ముందు రాత్రే షూటింగ్..రమ్యకృష్ణ డెడికేషన్‌కు ఫిదా

సినిమా రంగంలో నటీనటుల కష్టాలు, అంకితభావం గురించి తరచూ వినిపిస్తుంటుంది. అయితే కొంతమంది స్టార్ హీరోయిన్లు తమ పనిపై చూపించే…

2 hours ago