General News

పట్టపగలు కదులుతున్న ట్రక్కును దోచేసిన దొంగలు.. ఎక్కడంటే?

సాధారణంగా దొంగతనం చేయాలంటే దొంగలు రాత్రి సమయాలలో ప్లాన్ చేస్తారు. మరి పట్టపగలు దొంగతనం చేస్తే ఎలా ఉంటుంది.ఈ విధంగా పట్టపగలు దొంగతనం చేసి దొరకకపోతే ఆ కిక్కే వేరు ఉంటుంది.కాని దొరికిపోతే ఆ ధారునమైన పరిస్థితి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇదివరకు “ధూమ్”, “ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్”వంటి సినిమాలలో కదులుతున్న వాహనాలలో ఉన్న అధిక మొత్తం నగదును దొంగలించే సీన్లను మనం చూసే ఉంటాం.

అచ్చం ఈ సినిమాల్లో మాదిరిగానే కదులుతున్న వాహనం నుంచి దొంగతనం జరిగిన ఘటన తాజాగా ఒకటి చోటు చేసుకుంది. అయితే ఈ దొంగతనం సినిమా అంత రేంజ్ లో కాక పోయినా, ఈ దొంగలు చేసిన దొంగతనం చూస్తే ఎంతో సరదాగా అనిపిస్తుంది. ఇంతకీ ఆ దొంగతనం ఏంటి? సరదాగా అనిపించడం ఏంటని ఆలోచిస్తున్నారా..

ఒక ట్రక్కు మామిడి పండ్లను తీసుకొని రోడ్డుపై వెళుతోంది. అయితే అందులో మామిడి పండ్లు ఉన్నాయని గమనించిన కోతులు ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా ప్రయాణిస్తున్న ఆ ట్రక్ పైకి ఎగ బడ్డాయి. కొన్ని కోతులు గుంపులు గుంపులుగా వచ్చి కదులుతున్న ఆ ట్రక్ లో ఉన్న మామిడి పండ్లను తీసుకొని వెళ్లాయి.

ఇది చూసిన మరి కొన్ని కోతులు కూడా మామిడి పండ్ల కోసం అదే పని చేశాయి. ఈ మామిడి పండ్ల కోసం కోతులు చేసిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారి ఎంతోమంది నెటిజన్లను ఆకట్టుకుంది. మరి ఇంకెందుకు ఆలస్యం ఈ స్మార్ట్ దొంగతనం చూసి మీరు కూడా ఆనందించండి.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

3 weeks ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

3 weeks ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

4 weeks ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

4 weeks ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

4 weeks ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

4 weeks ago