అలనాటి సీనియర్ నటి, రాధిక శరత్ కుమార్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.వెండితెరపై ఎన్నో విభిన్నమైన పాత్రల్లో నటించి ఎంతో మంచి ప్రేక్షకాదరణ సంపాదించుకున్న ఈ నటి బుల్లితెరపై తన సత్తా ఏంటో చూపించారు.బుల్లితెరపై పలు సీరియల్స్ లో నటించి మంచి గుర్తింపును సంపాదించుకున్న రాధిక సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటారు. సోషల్ మీడియా ద్వారా తనకు సంబంధించిన విషయాలను అభిమానులతో పంచుకుంటారు.
ప్రస్తుతం బుల్లితెరపై రాధిక తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల కారణంగా కొంత కాలం పాటు బుల్లితెరకి విరామం చెబుతూ.. కమలహాసన్ తరపున ఎన్నికల బరిలోకి దిగిన విషయం మనకు తెలిసినదే. దీంతో రాధిక నటిస్తున్న పిన్ని సీరియల్ నుంచి ఈమె తప్పుకున్నారు. ఈమెకు సంబంధించి సోషల్ మీడియా వేదికగా చెక్ బౌన్స్ కేసులో రాధిక, శరత్ ఇద్దరికి జైలు శిక్ష పడినట్లు వార్తలు వచ్చాయి.
ఈ విషయంపై స్పందించిన రాధిక తమ గురించి వచ్చే తప్పుడు వార్తలపై హైకోర్టుకు వెళ్తామని, తమపై వచ్చే అవాస్తవాలను నమ్మకండి అంటూ స్పందించారు. తాజాగా హీరోయిన్ తన లుక్ మొత్తం మార్చుకొని సోషల్ మీడియాలో దర్శనమిచ్చారు.రాధిక తన జుట్టు మొత్తం కత్తిరించుకొని ఉన్నటువంటి ఫోటోను సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ అందరికీ నా కొత్త లుక్ నచ్చుతుందని ఆశిస్తున్నాను అంటూ షేర్ చేశారు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారి నెటిజన్లను ఆకట్టుకుంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…