పెళ్లయి భర్త పిల్లలతో ఎంతో సంతోషంగా గడుపుతున్న ఆ కుటుంబంలోకి పెను తుఫానులా ఓ వ్యక్తి వచ్చాడు. ఆ వ్యక్తి రాకతో ఆ కుటుంబం చిన్నాభిన్నమైంది. వచ్చిన వ్యక్తితో సదరు మహిళ వివాహేతర సంబంధం పెట్టుకొని కట్టుకున్న భర్తను వదిలిపెట్టి, కన్నబిడ్డను కానరాని లోకాలకు పంపించిన ఘటన రాజస్తాన్లో జైపూర్ జిల్లాలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు..
జైపూర్ జిల్లాలోని ఓ గ్రామానికి చెందిన సుమిత్ అహీర్, టీనా దంపతులకు నాలుగు సంవత్సరాల కూతురు ఉంది. టీనా అనుకోకుండా ఫోన్ ద్వారా ప్రహ్లాద్(45) అనే వ్యక్తికి పరిచయమైంది. ఈ పరిచయం కాస్త ప్రేమగా మారడంతో అతనితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఈ క్రమంలోనే టీనా తన భర్తను వదిలి తన కూతుర్ని తీసుకుని ప్రియుడితో వెళ్లి పోయింది.
టీనా తన ప్రియుడితో కలిసి జైపూర్ రూరల్ పరిధిలోని ఉదవల గ్రామంలో నివసిస్తుంది. ఈ క్రమంలోనే టీనా భర్త తన భార్య పిల్లలు కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు కొనసాగించారు . ఈ క్రమంలోనే పోలీసులు టీనా ఆచూకీని గుర్తించారు. కానీ తన కూతురి ఆచూకీ మాత్రం తెలియడం లేదు.
తన కూతురు గురించి టీనాని ప్రశ్నించగా బంధువుల ఇంట్లో ఉందని చెప్పింది.ఇదే విషయం గురించి పోలీసులు ఆరా తీయగా పాప అక్కడ లేదని తెలియడంతో ఆమెను గట్టిగా మందలించడంతో అసలు విషయం బయట పెట్టింది. తన కూతురు ఆరోగ్యం బాగా లేకపోతే తనకు వైద్యం చేయించడానికి తన ప్రియుడు డబ్బులు ఇవ్వక పోవడంతో అతనితో కలిసి తన నాలుగు సంవత్సరాల కూతురిని గొంతు నులిమి చంపినట్లు తెలిపింది. ఈ క్రమంలోనే పోలీసులు టీనా ఆమె ప్రియుడు పై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు.
ప్రకృతిలో జరిగే కొన్ని ఖగోళ అద్భుతాలు మన కళ్లకు నేరుగా కనిపించకపోయినా వాటి ప్రభావాన్ని మాత్రం మనం స్పష్టంగా అనుభవిస్తాం.…
చిన్న వయసులో ఆరోగ్యం గురించి పెద్దగా ఆలోచించని వారు చాలా మంది ఉంటారు. "ఇప్పుడేం కాదు.. తర్వాత చూసుకుందాం", "ఇంకా…
ఈ రోజుల్లో డబ్బు లేకుండా ఏ పని జరగని పరిస్థితి. ఉదయం ఇంటి నుంచి బయటకు అడుగు పెట్టిన దగ్గర…
మన తెలుగు వంటింట్లో కరివేపాకుకు ప్రత్యేక స్థానం ఉంది. పప్పు నుంచి పులుసు వరకు, చట్నీ నుంచి ఫ్రై వరకు…
హైదరాబాద్, జూన్ 20: నిర్మొహమాటంగా నికార్సుగా చెప్పాల్సి వస్తే తెలుగు రాష్ట్రాల్లో నిస్వార్ధ సేవకు నిలువెత్తు అక్షరంగా ప్రతిభతో, ప్రజ్ఞతో,…
వంట చేయడం ఒక కళ. అందులో రుచి రావాలంటే ఉప్పు, కారం, మసాలాలు అన్నీ సరైన మోతాదులో ఉండాలి. అయితే…