General News

కరోనా వేళ.. ఎయిర్టెల్ సూపర్ ఆఫర్.. ?

ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ఏర్పడిన ఈ సంక్షోభ సమయంలో ఎంతో మంది తమవంతు సహాయంగా ప్రజలను ఆదుకుంటున్నారు. ఈ క్లిష్ట పరిస్థితులలో ప్రముఖ టెలికాం సంస్థ భారతీయ ఎయిర్టెల్ కూడా ఒక కీలక నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా కరోనా కేసులు అధికమవుతున్న తరుణంలో ఎయిర్టెల్ ఈ విధమైన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

ఈ క్రమంలోనే తమ నెట్వర్క్ ఉపయోగిస్తున్న low income గ్రూప్‌కు చెందిన 5.5 కోట్ల కస్టమర్లకు లబ్ది చేకూర్చేలా ఎయిర్టెల్ సంస్థ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. లో ఇన్కమ్ గ్రూప్ కి చెందిన కస్టమర్లకోసం రూ. 49 రీచార్జ్ ప్యాక్‌ను ఒకసారి ఉచితంగా అందించనున్నట్టు ఆదివారం ఎయిర్టెల్ కీలక నిర్ణయం తీసుకుంది.

ప్రస్తుతం ఉన్న ఈ దుర్భరమైన పరిస్థితులలో ప్రజల మధ్య అవసరమైన సమాచార మార్పిడి జరగడానికి వీలుగా ఎయిర్టెల్ ఈ విధమైనటువంటి నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఎయిర్టెల్ అందిస్తున్న 49 రూపాయలు ప్యాక్ తో రూ. 38 టాక్‌టైమ్, 100 ఎంబీ ఉచిత డైటా 28 రోజుల కాల పరిమితితో అందిస్తున్నారు.

ఎయిర్టెల్ ఈ విధమైన నిర్ణయం తీసుకోవడం వల్ల గ్రామీణ ప్రాంతాలలో ఉన్న వారికి ఎంతో లబ్ధి చేకూరుతుందని ఎయిర్టెల్ భావించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే రూ. 79తో రీచార్జ్ చేస్తే రెట్టింపు ప్రయోజనాలు పొందవచ్చని ఎయిర్‌టెల్ తెలిపింది. ఎయిర్ టెల్ టెలికామ్ తీసుకున్న ఈ నిర్ణయం విలువ రూ. 270 కోట్లు ఈ సందర్భంగా ఎయిర్టెల్ సంస్థ పేర్కొంది.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago