General News

కరోనా వేళ.. ఎయిర్టెల్ సూపర్ ఆఫర్.. ?

ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ఏర్పడిన ఈ సంక్షోభ సమయంలో ఎంతో మంది తమవంతు సహాయంగా ప్రజలను ఆదుకుంటున్నారు. ఈ క్లిష్ట పరిస్థితులలో ప్రముఖ టెలికాం సంస్థ భారతీయ ఎయిర్టెల్ కూడా ఒక కీలక నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా కరోనా కేసులు అధికమవుతున్న తరుణంలో ఎయిర్టెల్ ఈ విధమైన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

ఈ క్రమంలోనే తమ నెట్వర్క్ ఉపయోగిస్తున్న low income గ్రూప్‌కు చెందిన 5.5 కోట్ల కస్టమర్లకు లబ్ది చేకూర్చేలా ఎయిర్టెల్ సంస్థ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. లో ఇన్కమ్ గ్రూప్ కి చెందిన కస్టమర్లకోసం రూ. 49 రీచార్జ్ ప్యాక్‌ను ఒకసారి ఉచితంగా అందించనున్నట్టు ఆదివారం ఎయిర్టెల్ కీలక నిర్ణయం తీసుకుంది.

ప్రస్తుతం ఉన్న ఈ దుర్భరమైన పరిస్థితులలో ప్రజల మధ్య అవసరమైన సమాచార మార్పిడి జరగడానికి వీలుగా ఎయిర్టెల్ ఈ విధమైనటువంటి నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఎయిర్టెల్ అందిస్తున్న 49 రూపాయలు ప్యాక్ తో రూ. 38 టాక్‌టైమ్, 100 ఎంబీ ఉచిత డైటా 28 రోజుల కాల పరిమితితో అందిస్తున్నారు.

ఎయిర్టెల్ ఈ విధమైన నిర్ణయం తీసుకోవడం వల్ల గ్రామీణ ప్రాంతాలలో ఉన్న వారికి ఎంతో లబ్ధి చేకూరుతుందని ఎయిర్టెల్ భావించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే రూ. 79తో రీచార్జ్ చేస్తే రెట్టింపు ప్రయోజనాలు పొందవచ్చని ఎయిర్‌టెల్ తెలిపింది. ఎయిర్ టెల్ టెలికామ్ తీసుకున్న ఈ నిర్ణయం విలువ రూ. 270 కోట్లు ఈ సందర్భంగా ఎయిర్టెల్ సంస్థ పేర్కొంది.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

రూ.250 కోట్లు డిమాండ్.. విజయ్-సంగీత విడాకుల కేసు హాట్ టాపిక్

తమిళ సినీ పరిశ్రమలో అగ్ర హీరోగా గుర్తింపు పొందిన విజయ్ వ్యక్తిగత జీవితం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఆయన భార్య…

1 hour ago

వేసవిలో అమృతం లాంటి పానీయం.. ఈ నేచురల్ డ్రింక్ మీకు కూలింగ్ ఇస్తుంది!

వేసవి కాలంలో శరీరాన్ని చల్లగా ఉంచే సహజ పానీయాలపై ప్రజల్లో ఆసక్తి పెరుగుతోంది. ఈ క్రమంలో సంప్రదాయంగా ఉపయోగించే “బాదం…

2 hours ago

కూతురు పెళ్లిపై కమల్ ఫోకస్.. శృతి హాసన్ మ్యారేజ్ టాక్ వైరల్

సౌత్ సినీ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించిన హీరోయిన్ శృతి హాసన్ మరోసారి వ్యక్తిగత జీవితంతో వార్తల్లో నిలిచింది.…

2 hours ago

తిరుమలలో తమన్నా దర్శనం.. శ్రీవారి ఆశీస్సులు పొందిన స్టార్ హీరోయిన్!

ప్రసిద్ధ సినీ నటి తమన్నాభాటియా తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లి భక్తిశ్రద్ధలు చాటుకున్నారు. తిరుమల దేవాలయంలోఉదయం వేళలోనే ఆమె స్వామివారిని…

3 hours ago

సబ్‌స్క్రిప్షన్ వివాదంపై అనన్య నాగళ్ల క్లారిటీ.. “అది నా ఉద్దేశ్యం కాదు!”

టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న హీరోయిన్ అనన్య నాగళ్ల ఇటీవల సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమె…

3 hours ago

శ్రీశైలంలో భక్తుడి అరుదైన కానుక.. వెండి నాగాభరణం సమర్పణ!

తెలంగాణకు చెందిన ఓ భక్తుడు తన భక్తిశ్రద్ధలను ప్రత్యేకంగా చాటుకున్నారు. హైదరాబాద్కు చెందిన ఈ భక్తుడు, ప్రసిద్ధ శైవక్షేత్రం శ్రీశైలం…

3 hours ago