Muthyala Subbaiah: టాలీవుడ్ ఇండస్ట్రీలో సీనియర్ దర్శకుడిగా ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు దర్శకుడు ముత్యాల సుబ్బయ్య. మామగారు, కలికాలం, ఎర్రమందారం, హిట్లర్, పవిత్ర బంధం గోకులంలో సీతవంటి ఎన్నో అద్భుతమైన సినిమాలను ప్రేక్షకులకు పరిచయం చేస్తున్న ఘనత ముత్యాల సుబ్బయ్య ఉందని చెప్పాలి. అయితే కొత్త దర్శకులు ఇండస్ట్రీకి పరిచయం అవుతున్న సమయంలో ఈయన హవా పూర్తిగా తగ్గిపోయింది.
ఈ క్రమంలోనే ఈయన సినిమా అవకాశాలు లేకపోవడంతో పూర్తిగా ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్నారు. అయితే తాజాగా ఒక టీవీ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ముత్యాల సుబ్బయ్య సినీ కెరియర్లు ఎదుర్కొన్నటువంటి ఇబ్బందులను గురించి తెలియజేశారు. ప్రకాశం జిల్లాకు చెందిన ఈయనకు నాటకాలలో మంచి అనుభవం ఉండడంతో సినిమాలు చేయడానికి సిద్ధపడ్డారు.
ఇలా సినిమా ఇండస్ట్రీలోకి వచ్చిన ఈయన అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తూ నెలకు 150 రూపాయలు జీతం అందుకునేవారు.ఇలా 150 రూపాయలు జీతం రావడంతో ఇలాంటి సమయంలో పెళ్లి చేసుకుంటే కుటుంబాన్ని పోషించడం భారమవుతుందని పెళ్లి విషయాన్ని మర్చిపోయాను.ఇలా అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేస్తున్న తనకు ఏకంగా ముగ్గురు నిర్మాతలు సినిమా అవకాశాలు కల్పించారు.
ఇలా తనకు మూడు సినిమా అవకాశాలు రావడంతో తన కెరీర్ కు ఒక భరోసా వచ్చిందని అందుకే తాను పెళ్లి చేసుకున్నానని తెలిపారు. అయితే పెళ్లి చేసుకున్న తర్వాత ఆ ముగ్గురు నిర్మాతలు హ్యాండ్ ఇచ్చారు. ఇలా అనుకున్న సినిమాలు చేజారిపోవడంతో కుటుంబ పోషణ భారమైంది. అవకాశాలు లేక ఇండస్ట్రీలో ఏడు సంవత్సరాల పాటు నరకం అనుభవించానని ఈ సందర్భంగా తన కెరియర్ మొదట్లో ఎదుర్కొన్న ఇబ్బందులను తెలియజేశారు. ఇలా అవకాశాలు లేక ఇబ్బందులు పడుతున్న సమయంలో తనకు టి. కృష్ణ దగ్గర దర్శకుడిగా అవకాశం వచ్చింది. ఇక ఆయన దగ్గర ఆరు సినిమా అవకాశాలు రావడంతో అప్పటినుంచి వెనక్కి తిరిగి చూసుకో లేదని ఈ సందర్భంగా ముత్యాల సుబ్బయ్య తన సినీ కెరియర్ గురించి తెలియజేశారు.
తెలంగాణలో ఎండల తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. ముఖ్యంగా హైదరాబాద్ సహా పలు జిల్లాలకు భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్…
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న ప్రతిష్ఠాత్మక చిత్రం ఫౌజీ చుట్టూ ఆసక్తికరమైన విషయం బయటకు వచ్చింది. ఈ సినిమాలో…
మహారాష్ట్రలో సంచలనం రేపిన లైంగిక వేధింపుల కేసులో ప్రభుత్వం కఠిన చర్యలు ప్రారంభించింది. పరాత్వడ పట్టణానికి చెందిన మహమ్మద్ అయాజ్…
టాలీవుడ్లో అభిమానులను ఆందోళనకు గురిచేసిన వార్తపై స్పష్టత వచ్చింది. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ గాయపడిన ఘటనపై ఆయన సోదరి…
తెలంగాణలో సంచలనం సృష్టించిన భారీ బ్యాంకు మోసం వెలుగులోకి వచ్చింది. నల్లగొండ జిల్లా దేవరకొండలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా…
తమిళనాడులో ఎన్నికల వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. డీఎంకే నేత, మంత్రి ఉదయనిధి స్టాలిన్ సమర్పించిన ఎన్నికల అఫిడవిట్లోని ఆస్తుల…