K.A Paul: ప్రజాశాంతి పార్టీ అధినేత కె ఏ పాల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈయన 2019 సార్వత్రిక ఎన్నికలలో భాగంగా ప్రజాశాంతి పార్టీ స్థాపించి పెద్దఎత్తున వార్తల్లో నిలిచారు. అప్పటి నుంచి ఈయన ఏదో ఒక వివాదాస్పద వ్యాఖ్యల ద్వారా వార్తల్లో నిలుస్తూ ఉన్నారు. ఇక కరోనా సమయంలో ఈయన తన ఇష్ట దైవం గురించి చేసిన వ్యాఖ్యలు మనకు తెలిసిందే.
తాజాగా కేఏ పాల్ ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే కార్యక్రమంలో పాల్గొని గతంలో కే ఏ పాల్ చేసిన వ్యాఖ్యల గురించి ప్రశ్నించారు. కరోనా సమయంలో తన భార్య కరోనా సోకీ చనిపోయి తన భార్యను బ్రతికించుకున్నానని ఈయన చేసిన వ్యాఖ్యల పై స్పందించి అసలు విషయం వెల్లడించారు.
తన భార్య కరోనా సోకిన 2 నెలల పాటు ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్న సమయంలో నేను నా మిగతా పనులన్నింటినీ పక్కనపెట్టి కేవలం తన భార్య కోసమే దేవుడిని ప్రార్థించానని తన ప్రార్థనతో తన భార్యను బ్రతికించుకున్నానని ఈ సందర్భంగా పాల్ తెలియజేశారు. తన భార్యను బ్రతికించమని దేవుడికి కండిషన్ పెట్టి నిరంతరం రెండు నెలలపాటు దేవుడి ప్రార్థనలో ఉన్నానని పాల్ వెల్లడించారు.
అదేవిధంగా మీ ఇంటర్వ్యూ సందర్భంగా తనకు వచ్చిన భారతరత్న, నోబెల్ అవార్డులు అన్నింటిని తానే రిజెక్ట్ చేశానని పాల్ వెల్లడించారు. అదేవిధంగా రెండు తెలుగు రాష్ట్రాల రాజకీయాల గురించి మాట్లాడారు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం డ్రగ్స్ కూబిలో ఇరుక్కుపోయిందని రెండు తెలుగు రాష్ట్రాలు ఇలాగే ఉన్నాయని ఆయన రాష్ట్ర రాజకీయాల గురించి మాట్లాడారు.
మధుమేహం (డయాబెటిస్) వల్ల వచ్చే సమస్యలు రోజురోజుకీ పెరుగుతున్నాయి. ముఖ్యంగా దీర్ఘకాలంగా షుగర్ నియంత్రణలో లేకపోతే నరాలపై ప్రభావం పడే…
నేటి వేగవంతమైన జీవనశైలిలో నడుము నొప్పి ఒక సాధారణ సమస్యగా మారుతోంది. ముఖ్యంగా రోజంతా కంప్యూటర్ ముందు కూర్చుని పనిచేసే…
నేటి పట్టణ జీవనశైలిలో డెంగీ ప్రమాదం కొత్త రూపం దాల్చుతోంది. ఒకప్పుడు మురుగు నీరు, చెత్త ప్రదేశాలు ప్రధాన కారణాలుగా…
సీనియర్ నటుడు రాజశేఖర్ తన సినీ ప్రయాణం, వ్యక్తిగత జీవితానికి సంబంధించిన అనేక ఆసక్తికర విషయాలను తాజాగా ఓ ఇంటర్వ్యూలో…
ఇంటి వంటల్లో రుచితో పాటు ఆరోగ్యం కూడా కలగాలంటే సీజనల్ కూరగాయలతో తయారయ్యే వంటకాలకు ప్రాధాన్యం ఇవ్వాలని పోషకాహార నిపుణులు…
ఇంద్రకీలాద్రిపై వెలసిన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి ఆలయంలో జగద్గురు ఆదిశంకరుల జయంతి ఉత్సవాలు మంగళవారం వైభవంగా నిర్వహించబడ్డాయి. వైశాఖ…