ఉరుకులు.. పరుగులు జీవితానికి కంటి నిండా నిద్ర కూడా పోని పరిస్థితి. అయితే నిద్ర లేకపోవడంతో ఎంతో మంది తీవ్ర అనారోగ్యానికి గురవుతున్నారు. సమయం.. సందర్భం లేని ఉద్యోగాలు. వెరసి నిద్రలేమితో బాధపడుతున్నారు చాలామంది. దీని ప్రభావంతో ఆరోగ్యంపై పడుతోంది. అయితే పురాణాల్లో నిద్రించే సమయాల్లో.. కొన్ని నియమాలు పాటించాలని సూచిస్తున్నాయి.
అవేంటంటే.. ఎవరూ లేని ప్రదేశంలో ఒంటరిగా పడుకోకూడదు. దేవాలయాల్లో, శ్మశాన వాటికలో కూడా నిద్రపోకూడదని మనుస్మృతిలో పేర్కొన్నారు. విష్ణుస్మృతి ప్రకారం నిద్రపోయే వారిని అకస్మాత్తుగా లేపకూడదు. చాణక్య నీతి సూత్రం ప్రకారం ఉద్యోగి, విద్యార్థి అధిక సమయం నిద్రపోతుంటే వారిని లేపొచ్చు. పద్మ పురాణం ప్రకారం బ్రహ్మా ముహూర్తంలో నిద్ర లేవాలని సూచిస్తుంది.
పూర్తిగా చీకటి గదిలో కూడా నిద్రించకూడదు. అత్రి స్మృతి ప్రకారం.. తడి పాదాలతో అస్సలు నిద్రించవద్దు. అన్నం తిన్న తర్వాత ఎంగిలి మొహంతో పడుకోవడం మహాభారతం ప్రకారం మంచిది కాదు. నగ్నంగా పడుకోకూడదని ధర్మ సూత్రం సూచిస్తుంది. పగటిపూట సూర్యోదయం, సూర్యాస్తమయం వరకు పడుకొనే వారు రోగి , దరిద్రులు అవుతారని బ్రహ్మా వైవర్తపురాణం పేర్కొంది. ఎడమవైపు పడుకోవడం వలన స్వస్థత లభిస్తుంది.
గుండెపై చేయి వేసుకొని అస్సలు నిద్రించవద్దు. మంచంపై తాగడం, తినడం అస్సలు చేయకూడదు. పడుకొని పుస్తకం తీసి అస్సలు చదవకూడదు. నుదుటన బొట్టు లేదా తిలకం ధరించి నిద్రించడం అశుభం కావున పడుకొనే ముందు తీసేయాలి. ఇలా పైన చెప్పిన విధంగా నిద్ర ఎలా పోవాలనే నియమాలు పాటిస్తే.. ఆరోగ్యవంతుడు, దీర్ఘాయుష్మంతుడని చెబుతుంటారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…