Naga Babu:తెలుగు సినిమా పరిశ్రమలో మెగా కుటుంబానికి ఎలాంటి క్రేజ్ ఉందో మనకు తెలిసిందే. ఇక మెగా కుటుంబంలో చిరంజీవి పవన్ కళ్యాణ్ హీరోలుగా కొనసాగుతున్నప్పటికీ నాగబాబు మాత్రం హీరోగా సక్సెస్ కాలేకపోయారు. ఈ క్రమంలోనే నాగబాబు అంజన ప్రొడక్షన్స్ స్థాపించి నిర్మాతగా మారారు. ఇలా ఈయన పలు సినిమాలను నిర్మించడమే కాకుండా బుల్లితెర కార్యక్రమాల ద్వారా కూడా పెద్ద ఎత్తున ప్రేక్షకులను సందడి చేస్తున్నారు.
ఇకపోతే నాగబాబుకు ఒక కుమారుడు కూతురు అనే విషయం మనకు తెలిసిందే వరుణ్ తేజ్ ప్రస్తుతం ఇండస్ట్రీలో హీరోగా వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉండగా నిహారిక మాత్రం 2020 డిసెంబర్లో జొన్నలగడ్డ వెంకట చైతన్య అనే వ్యక్తిని వివాహం చేసుకొని ప్రస్తుతం వెబ్ సిరీస్లను నిర్మిస్తూ బిజీగా ఉన్నారు. ఇకపోతే నిహారిక పెళ్లి జరిగి దాదాపు రెండు సంవత్సరాలు పూర్తి కావస్తున్న నేపథ్యంలో మెగా బ్రదర్ నాగబాబు తన అల్లుడికి ఇచ్చిన కట్టకానులకు సంబంధించిన వార్తల ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
నాగబాబు తన కూతురి వివాహాన్ని రాజస్థాన్ లోని పురాతనమైన కోటలో ఎంతో ఘనంగా నిర్వహించిన విషయం మనకు తెలిసిందే. కేవలం కుటుంబ సభ్యుల సమక్షంలో ఈ వివాహం ఎంతో ఘనంగా జరిగింది.ఈ పెళ్లి కోసమే నాగబాబు కొన్ని కోట్ల రూపాయలు ఖర్చుపెట్టినట్లు సమాచారం. ఇది కాకుండా తన అల్లుడికి 15 కోట్ల రూపాయల కట్నం ఇచ్చారని దీనితో పాటు ఒక ఖరీదైన కారు ఇల్లు కూడా కట్నంగా ఇచ్చారని వార్తలు వస్తున్నాయి.
ఇక పెళ్లి కోసం నిహారికకు నాగబాబు ఏకంగా నాలుగు కోట్ల రూపాయల విలువచేసే ఆభరణాలను కొనుగోలు చేశారు. ఇలా నిహారిక పెళ్లి కోసం అన్ని ఖర్చులు కలుపుకుంటే నాగబాబు దగ్గర దగ్గరగా 40 కోట్లకు పైగా ఖర్చు చేశారని వార్తలు వస్తున్నాయి. ఏది ఏమైనా పెళ్లి విషయంలో కట్న కానుకల విషయంలో నాగబాబు మెగా రేంజ్ కి ఏమాత్రం తగ్గలేదని తెలుస్తుంది.ఇక పెళ్లి తర్వాత వైవాహిక జీవితంలో ఎంతో సంతోషంగా ఉన్నటువంటి నిహారిక ప్రసాదం వెబ్ సిరీస్ లకు నిర్మాతగా మారి ఎంతో మంచి పేరు సంపాదించుకున్నారు.
Cheating Wife : వివాహ బంధం పవిత్రమని భావించే సమాజంలో అక్రమ సంబంధాల కారణంగా జరుగుతున్న ఘటనలు తరచూ సంచలనం…
హైదరాబాద్లోని అత్తాపూర్ ప్రాంతంలో ప్రముఖ స్వీట్ షాప్పై ఆహార భద్రతకు సంబంధించిన ఆరోపణలు సంచలనం రేపాయి. పేరుగాంచిన బ్రాండ్గా గుర్తింపు…
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ను కలవాలంటే 42 నిబంధనలు పాటించాల్సి ఉంటుందంటూ ఇటీవల చేసిన వ్యాఖ్యలతో నెట్టింట వైరల్ అయిన…
తెలుగు సినీ ప్రపంచాన్ని ఒకప్పుడు కుదిపేసిన హీరోయిన్ ప్రత్యూష మృతి కేసులో ఎట్టకేలకు సుప్రీంకోర్టు తుది తీర్పు వెలువరించింది. దాదాపు…
ఆంధ్రప్రదేశ్లో డ్వాక్రా మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం మరోసారి ఊరట కలిగించే నిర్ణయం తీసుకుంది. స్వయం సహాయక సంఘాల సభ్యులైన మహిళలకు…
అమెరికాకు చెందిన ప్రముఖ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంస్థ అంథ్రోపిక్ (Anthropic) భారత్లోకి అధికారికంగా ప్రవేశిస్తోంది. సోమవారం సంస్థ విడుదల చేసిన…