Nagababu: సినిమా ఇండస్ట్రీలో నటుడిగా నిర్మాతగా కొనసాగుతున్న మెగా బ్రదర్ నాగబాబు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.చిరంజీవి తమ్ముడిగా ఇండస్ట్రీకి పరిచయమైన నాగబాబు పలు సినిమాలలో చిన్న చిన్న పాత్రలలో నటించారు. హీరోగా ఈయన నటించినప్పటికీ సక్సెస్ కాకపోవడంతో నిర్మాతగా మారారు. ఇక ఈయన నిర్మాణంలో వచ్చిన సినిమాలు పెద్దగా సక్సెస్ సాధించకపోవడంతో నిర్మాణ రంగానికి కాస్త దూరంగా ఉన్నారు.
ఇలా నిర్మాతగా నాగబాబు దూరమైనప్పటికీ సినిమాలలో అవకాశాలు వస్తే తప్పకుండా నటిస్తున్నారు. ఈయన ఎక్కువగా హీరో హీరోయిన్లకు తండ్రి పాత్రలలో నటిస్తూ ప్రేక్షకులను సందడి చేస్తున్నారు.ఇక నాగబాబు ఒకరోజు లొకేషన్ లో షూటింగ్లో పాల్గొంటే 5 లక్షల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటారని సమాచారం. ఇలా పలు సినిమాలలో నటిస్తూనే మరోవైపు బుల్లితెర రియాలిటీ షోలకు న్యాయ నిర్ణేతగా వ్యవహరిస్తున్నారు.
ఈ విధంగా నాగబాబు టీవీ కార్యక్రమాల ద్వారా బాగా ఆస్తులను సంపాదించారని తెలుస్తోంది. భారీ స్థాయిలో రెమ్యూనరేషన్ తీసుకుని నాగబాబు సుమారు 100 కోట్లకు పైగా ఆస్తులను కూడా పెట్టినట్టు సమాచారం. నాకు బాబు కుమారుడు వరుణ్ తేజ్ సైతం సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు. ఈయన కూడా ఒక్కో సినిమాకు సుమారు 10 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు.
ఇలా ఇండస్ట్రీలో నిర్మాతగా నటుడిగా కొనసాగుతూనే నాగబాబు భారీగానే ఆస్తులు కూడా పెట్టారు. ఇక ఈయన తన తమ్ముడు స్థాపించిన జనసేన పార్టీలో కూడా కీలకంగా వ్యవహరిస్తున్న విషయం మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే నాగబాబు సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్ గా ఉంటూ మెగా హీరోల గురించి మెగా ఫ్యామిలీ గురించి ఎవరైనా విమర్శలు చేస్తే పెద్ద ఎత్తున ఆ విమర్శలను తిప్పికొడుతూ మెగా ఫ్యామిలీకి అండగా ఉంటున్నారు.
తెలంగాణలోని నల్గొండ జిల్లాకు చెందిన ఏడాది వయసున్న చిన్నారి ఆర్యాన్ష్ ప్రస్తుతం అరుదైన జన్యుపరమైన వ్యాధితో పోరాడుతున్నాడు. చిన్న వయసులోనే…
బెంగళూరులో మూడు నెలల క్రితం చోటుచేసుకున్న ఆరేళ్ల చిన్నారి వెన్నెల మృతి కేసు తాజాగా సంచలన మలుపు తిరిగింది. మొదట…
ఇటీవలి కాలంలో ఆహార భద్రతపై ప్రజల్లో అవగాహన పెరుగుతోంది. ముఖ్యంగా కూరగాయలు, పండ్లలో రసాయనాల వినియోగంపై తరచూ వార్తలు వెలువడుతుండటంతో…
హైదరాబాద్ నగరంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. నారాయణగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో నివసిస్తున్న ఇద్దరు అక్కాచెల్లెళ్లు అనారోగ్యానికి గురై చికిత్స…
ప్రపంచ వాతావరణ పరిస్థితులపై మరోసారి ఆందోళన వ్యక్తమవుతోంది. ఇప్పటికే పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, వాతావరణ మార్పులు, ప్రకృతి వైపరీత్యాలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న…
తెలుగు బుల్లితెరపై ప్రసారమైన ప్రముఖ డ్యాన్స్ రియాలిటీ షో ‘ఢీ’ ద్వారా ప్రేక్షకులకు పరిచయమైన పండు మాస్టర్, తన డ్యాన్స్…