Nagachaitanya: అక్కినేని నాగచైతన్య ప్రస్తుతం కస్టడీ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో బిజీగా ఉన్నారు. వెంకట్ ప్రభు దర్శకత్వంలో నాగచైతన్య, కృతి శెట్టి జంటగా నటించిన ఈ సినిమా మే 12వ తేదీ విడుదల కానున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ సినిమా ప్రకాశం కార్యక్రమాలలో భాగంగా ఈయన వరుస ఇంటర్వ్యూలకు హాజరవుతున్నారు.
ఇకపోతే ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి నాగచైతన్య తన గత సినిమా థాంక్యూ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. థాంక్యూ సినిమా పోతుందనే విషయం తమకు ముందుగానే తెలుసు అంటూ ఈయన చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.విక్రమ్ గారు దిల్ రాజు గారు తాను ముగ్గురు విన్నప్పుడు కథ చాలా బాగుంది ముగ్గురికి ఓకే అయిన తర్వాతనే ఈ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చామని తెలిపారు.
ఇక షూటింగ్ జరుగుతున్న సమయంలో కొన్ని సన్నివేశాలు చేసేటప్పుడు కాస్త తేడా కొట్టిందని నాగచైతన్య తెలిపారు.ఎడిటింగ్ టేబుల్ దగ్గరకు వెళ్ళగానే ఈ సినిమాపై బాగా డౌట్ వచ్చేసిందని ఈ సినిమా తప్పకుండా పోతుందని ఆ క్షణమే అర్ధమైందని నాగచైతన్య తెలిపారు.ఇక సినిమా పోతుందని తెలిసి కూడా ప్రమోషన్ కార్యక్రమాలు చేయడం చాలా కష్టంగా ఉంటుందని తెలిపారు.
కోట్ల రూపాయలు ఖర్చు చేసి సినిమా తీసి సినిమా పోతుందని తెలిసి చేతులు దులుపుకోలేము కదా అందుకే అందరం కలిసి సినిమాని ముందుకు నడిపించడం కోసం ప్రయత్నాలు చేసామని నాగచైతన్య ఈ సందర్భంగా థాంక్యూ సినిమా గురించి చేసినటువంటి ఈ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక ఈ సినిమా ఫెయిల్యూర్ తర్వాత ఎన్నో అంచనాల నడుమ కస్టడీ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. మరి ఈ సినిమా నాగచైతన్యకు ఎలాంటి సక్సెస్ అందిస్తుందో తెలియాల్సి ఉంది.
తెలంగాణలోని నల్గొండ జిల్లాకు చెందిన ఏడాది వయసున్న చిన్నారి ఆర్యాన్ష్ ప్రస్తుతం అరుదైన జన్యుపరమైన వ్యాధితో పోరాడుతున్నాడు. చిన్న వయసులోనే…
బెంగళూరులో మూడు నెలల క్రితం చోటుచేసుకున్న ఆరేళ్ల చిన్నారి వెన్నెల మృతి కేసు తాజాగా సంచలన మలుపు తిరిగింది. మొదట…
ఇటీవలి కాలంలో ఆహార భద్రతపై ప్రజల్లో అవగాహన పెరుగుతోంది. ముఖ్యంగా కూరగాయలు, పండ్లలో రసాయనాల వినియోగంపై తరచూ వార్తలు వెలువడుతుండటంతో…
హైదరాబాద్ నగరంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. నారాయణగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో నివసిస్తున్న ఇద్దరు అక్కాచెల్లెళ్లు అనారోగ్యానికి గురై చికిత్స…
ప్రపంచ వాతావరణ పరిస్థితులపై మరోసారి ఆందోళన వ్యక్తమవుతోంది. ఇప్పటికే పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, వాతావరణ మార్పులు, ప్రకృతి వైపరీత్యాలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న…
తెలుగు బుల్లితెరపై ప్రసారమైన ప్రముఖ డ్యాన్స్ రియాలిటీ షో ‘ఢీ’ ద్వారా ప్రేక్షకులకు పరిచయమైన పండు మాస్టర్, తన డ్యాన్స్…