Navadeep: తెలుగు సినిమా ఇండస్ట్రీలో హీరోగా విలన్ గా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పలు సినిమాలలో నటించి ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న నవదీప్ గురించి పరిచయం అవసరం లేదు. అయితే తాజాగా ఈయన న్యూసెన్స్ అనే వెబ్ సిరీస్ ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ వెబ్ సిరీస్ మే 12వ తేదీ విడుదల కానున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.
ఈ వెబ్ సిరీస్ ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో నవదీప్ గతంలో తన గురించి వచ్చినటువంటి వార్తలు అన్నింటికీ క్లారిటీ ఇచ్చారు. 2005వ సంవత్సరంలో హీరో నవదీప్ కారణంగా ఓ హీరోయిన్ చనిపోయింది అంటూ పత్రికలలో వార్తలు వచ్చాయి అయితే ఈ వార్తలపై తాజాగా నవదీప్ స్పందించారు.
తన వల్ల ఏ హీరోయిన్ చనిపోలేదని అవన్నీ కేవలం అవాస్తవాలని కొట్టి పారేశారు. అలాగే నేను గే అనీ కూడా వార్తలు రాశారు. ఈ విషయాన్ని కూడా నవదీప్ ఖండించారు. ఇక తాను రేవ్ పార్టీలో భాగంగా అధికారులకు దొరికిపోయాను అంటూ కూడా వార్తలు వచ్చాయి. నిజానికి నేను ఆ రోజు ఫ్యామిలీతో కలిసి ఫ్యామిలీ గెస్ట్ హౌస్ లో ఉన్నామని తెలియజేశారు.
ఇలా నా గురించి అన్ని తప్పుడు వార్తలు మాత్రమే వచ్చాయని, ఆరోజు నేను నా ఫ్యామిలీతో ఉండటం వల్ల నా ఫ్యామిలీ నాపై మరింత నమ్మకాన్ని పెంచుకున్నారని నవదీప్ తెలిపారు. ఇక మీడియా తన గురించి ఇలాంటి వార్తలు రాసిన నేపథ్యంలో తాను కక్ష సాధింపు చర్యగా ఈ వెబ్ సిరీస్ లో నటించలేదని తెలియజేశారు. ఇక ఈ సిరీస్ లో నవదీప్ జోడిగా బిందు మాధవి నటించిన సంగతి తెలిసిందే.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…