చిత్ర, విచిత్రాలకు కేంద్రబిందువు సినీ పరిశ్రమ. నటీనటుల విషయానికి వస్తే వారి కలయిక కూడా విచిత్రంగా జరుగుతుంది. హిట్, సూపర్ హిట్, బ్లాక్ బస్టర్, ఇండస్ట్రీ హిట్ సినిమాలను గమనిస్తే.. ఇందులో నటించిన కొన్ని కాంబినేషన్స్ సినిమా మొదలైనప్పటి నుంచే ప్రేక్షకుల్లో విపరీతమైన క్రేజ్ పెరుగుతుంది. మరి కొన్ని కాంబినేషన్స్ కలిసిన మొదటి చిత్రం తోనే బాక్స్ ఆఫీస్ కు షాక్ ఇస్తుంది. హీరో లేదా హీరోయిన్ ఒక సినిమాలో లో గెస్ట్ అప్పియరెన్స్ లేదా సినిమా మొత్తం కనిపించిన ఆ సినిమా విజయవంతమైన సందర్భాలు ఉన్నాయి.
హీరో నాగార్జున తన కెరీర్ బిగినింగ్ నుంచి ఎన్నో హిట్స్, సూపర్ హిట్స్ ఇచ్చారు. కొత్త దర్శకులను వెండితెరకు పరిచయం చేస్తూ ఎన్నో విజయాలను అందుకున్నారు. అలా 1990 దశకంలో యాక్టివ్ గా ఉన్న హీరోయిన్స్ రమ్యకృష్ణ, మీనా, దివ్యభారతి, నగ్మా, సౌందర్య, ఆమని లాంటి హీరోయిన్స్ తో నటించి నాగార్జున తెలుగు సినీ పరిశ్రమలో దూసుకు వెళ్లారు.. ఈ హీరోయిన్లకు సమకాలీనురాలైన రోజా చిత్తూరు లో పుట్టి పెరిగి నాగార్జున యూనివర్సిటీ నుంచి రాజనీతి శాస్త్రంలో పట్టభద్రులయ్యారు. ఆ తర్వాత కూచిపూడి నృత్యం నేర్చుకున్నారు. సినిమాల్లోకి వెళ్లే ఆలోచనతో ఉన్నప్పుడు.. ఆమెది గద్గద స్వరం కావడంతో శ్రేయోభిలాషులు సినీ పరిశ్రమ ప్రవేశానికి నిరాకరించారు.
డాక్టర్ శివప్రసాద్ సహకారంతో రోజా మొదటగా ఛాయాగ్రాహకుడు, దర్శకుడు అయిన ఆర్.కె.సెల్వమణి దర్శకత్వంలో ‘చంభారతి’ చిత్రంలో ప్రశాంత్ సరసన హీరోయిన్ గా నటించింది. ఆ తర్వాత తెలుగులో 1991 శ్రీ సాయి మాధవీ ప్రొడక్షన్స్ ఎన్.శివప్రసాద్ దర్శకత్వంలో వచ్చిన “ప్రేమ తపస్సు” చిత్రంలో రాజేంద్రప్రసాద్, రోజా హీరో హీరోయిన్లుగా నటించారు. ఆ తర్వాత అనతికాలంలోనే చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్ లాంటి హీరోలతో విజయవంతమైన చిత్రాలు నటించినప్పటికీ.. నాగార్జునతో నటించిన చిత్రాలు బాక్సాఫీసు వద్ద వెనుతిరిగాయి.
1993 అన్నపూర్ణ స్టూడియోస్, అక్కినేని వెంకట్ నిర్మాణం, ఉప్పలపాటి నారాయణరావు దర్శకత్వంలో ‘రక్షణ’ చిత్రం విడుదలైంది. ఈ సినిమాలో నాగార్జున, శోభన హీరో హీరోయిన్లుగా నటించారు. రోజా ఈ చిత్రంలో స్పెషల్ అప్పియరెన్స్ గా కనిపించారు. బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం పరాజయాన్ని పొందింది. ఆ తర్వాత 1995, లక్ష్మీ పద్మజ ఎంటర్ప్రైజెస్, గౌతమ్ కుమార్ నిర్మాణం, ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో “వజ్రం” చిత్రం విడుదల అయ్యింది. ఈ సినిమాలో నాగార్జున, రోజా హీరో,హీరోయిన్లుగా నటించారు. ఎస్.వి.కృష్ణారెడ్డి కొబ్బరి బొండం,మాయలోడు, రాజేంద్రుడు-గజేంద్రుడు, నెంబర్ వన్, యమలీల వంటి సూపర్ హిట్ చిత్రాలతో మంచి జోష్ లో ఉన్నారు. ఆ క్రమంలో ఎస్వీ. కృష్ణారెడ్డి.. 1995లో నాగార్జున, రోజా హీరో, హీరోయిన్లుగా రూపొందించిన ‘వజ్రం’ చిత్రం బాక్సాఫీస్ వద్ద తీవ్ర పరాజయాన్ని మూటగట్టుకుంది.
తెలంగాణలో ఎండల తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. ముఖ్యంగా హైదరాబాద్ సహా పలు జిల్లాలకు భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్…
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న ప్రతిష్ఠాత్మక చిత్రం ఫౌజీ చుట్టూ ఆసక్తికరమైన విషయం బయటకు వచ్చింది. ఈ సినిమాలో…
మహారాష్ట్రలో సంచలనం రేపిన లైంగిక వేధింపుల కేసులో ప్రభుత్వం కఠిన చర్యలు ప్రారంభించింది. పరాత్వడ పట్టణానికి చెందిన మహమ్మద్ అయాజ్…
టాలీవుడ్లో అభిమానులను ఆందోళనకు గురిచేసిన వార్తపై స్పష్టత వచ్చింది. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ గాయపడిన ఘటనపై ఆయన సోదరి…
తెలంగాణలో సంచలనం సృష్టించిన భారీ బ్యాంకు మోసం వెలుగులోకి వచ్చింది. నల్లగొండ జిల్లా దేవరకొండలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా…
తమిళనాడులో ఎన్నికల వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. డీఎంకే నేత, మంత్రి ఉదయనిధి స్టాలిన్ సమర్పించిన ఎన్నికల అఫిడవిట్లోని ఆస్తుల…