Nagarjuna: కింగ్ నాగార్జున ప్రస్తుతం సినిమాలకు కాస్త దూరంగా ఉన్నారు గత ఏడాది ఈయన నటించిన ఘోస్ట్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా తర్వాత నాగార్జున ఎలాంటి కొత్త సినిమాలను ప్రకటించలేదు. అయితే నాగార్జున ఇలా సినిమాలకు దూరంగా ఉంటూ కేవలం బిగ్ బాస్ కార్యక్రమం ద్వారా మాత్రమే ప్రేక్షకులను సందడి చేస్తున్నారు.
ఇలా గత ఏడాది బిగ్ బాస్ సీజన్ 6 ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి నాగార్జున త్వరలోనే బిగ్ బాస్ 7 ద్వారా ప్రేక్షకుల ముందు రావడానికి సిద్ధమవుతున్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన వరుస అప్డేట్స్ విడుదల చేస్తూ సినిమాపై భారీ అంచనాలను పెంచేలా చేస్తున్నారు. ఇకపోతే ఈ కార్యక్రమానికి సంబంధించిన ఎన్నో విషయాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
ఈ కార్యక్రమంలో పాల్గొనబోయే కంటెస్టెంట్ల గురించి రోజుకు ఒక వార్త వైరల్ అవుతుంది అయితే తాజాగా నాగార్జునకు సంబంధించి ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ కార్యక్రమానికి నాగార్జున వ్యాఖ్యతగా వ్యవహరించడం కోసం భారీగానే రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. నాగార్జున మూడవ సీజన్ నుంచి ఇప్పటివరకు ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు.
ఈ క్రమంలోనే ఈ కార్యక్రమం కోసం ఈయన భారీగానే రెమ్యూనరేషన్ అందుకోబోతున్నట్టు సమాచారం. ఈ రియాలిటీ షో కోసం నాగార్జున ఏకంగా 200 కోట్ల రూపాయల వరకు రెమ్యూనరేషన్ అందుకుంటున్నట్లు తెలుస్తోంది.నాగార్జున ఈ స్థాయిలో రెమ్యూనరేషన్ అందుకుంటున్నారు అంటే మరో రెండు సంవత్సరాల పాటు ఎలాంటి సినిమాలు చేయకపోయినా పర్వాలేదని ఈ రెమ్యూనరేషన్ నాలుగు సినిమాల కోసం తీసుకునే రెమ్యూనరేషన్ తో సమానం అంటూ నాగార్జున బిగ్ బాస్ రెమ్యూనరేషన్ పై కామెంట్స్ చేస్తున్నారు.
వేసవి తీవ్రత రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో శరీరాన్ని చల్లగా ఉంచుకోవడం, నీరసం తగ్గించుకోవడం ప్రతి ఒక్కరికీ అవసరంగా మారింది. ఈ…
మన జీవితంలో చిన్న చిన్న అలవాట్లు పెద్ద మార్పులకు దారి తీస్తాయి. అలాంటి వాటిలో ఉదయం వేళ లేవడం ఒక…
ముఖం ఎప్పుడూ ఫ్రెష్గా, కాంతివంతంగా కనిపించడం ప్రతి ఒక్కరికీ ఇష్టం. అయితే కొన్నిసార్లు కారణం తెలియకుండానే ముఖం ఉబ్బినట్లు, ఎర్రబడినట్లు…
భారతీయ వంటింట్లో చింతపండు లేకుండా చాలా వంటలు పూర్తవవు. పులుపు రుచిని ఇచ్చే ఈ సహజ పదార్థం కేవలం రుచికే…
భారతీయ కరెన్సీ నోట్లపై కనిపించే చిత్రాలు కేవలం అలంకరణ కోసం మాత్రమే కాకుండా, దేశ చరిత్ర, సంస్కృతి, వారసత్వాన్ని ప్రతిబింబించేలా…
హైదరాబాద్లో చోటుచేసుకున్న ఒక అరుదైన వైద్య ఘటన ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. కేవలం కొన్ని రసగుల్లాలు తిన్న తర్వాత 35…