Nagarjuna: కింగ్ నాగార్జున ప్రస్తుతం సినిమాలకు కాస్త దూరంగా ఉన్నారు గత ఏడాది ఈయన నటించిన ఘోస్ట్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా తర్వాత నాగార్జున ఎలాంటి కొత్త సినిమాలను ప్రకటించలేదు. అయితే నాగార్జున ఇలా సినిమాలకు దూరంగా ఉంటూ కేవలం బిగ్ బాస్ కార్యక్రమం ద్వారా మాత్రమే ప్రేక్షకులను సందడి చేస్తున్నారు.
ఇలా గత ఏడాది బిగ్ బాస్ సీజన్ 6 ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి నాగార్జున త్వరలోనే బిగ్ బాస్ 7 ద్వారా ప్రేక్షకుల ముందు రావడానికి సిద్ధమవుతున్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన వరుస అప్డేట్స్ విడుదల చేస్తూ సినిమాపై భారీ అంచనాలను పెంచేలా చేస్తున్నారు. ఇకపోతే ఈ కార్యక్రమానికి సంబంధించిన ఎన్నో విషయాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
ఈ కార్యక్రమంలో పాల్గొనబోయే కంటెస్టెంట్ల గురించి రోజుకు ఒక వార్త వైరల్ అవుతుంది అయితే తాజాగా నాగార్జునకు సంబంధించి ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ కార్యక్రమానికి నాగార్జున వ్యాఖ్యతగా వ్యవహరించడం కోసం భారీగానే రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. నాగార్జున మూడవ సీజన్ నుంచి ఇప్పటివరకు ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు.
ఈ క్రమంలోనే ఈ కార్యక్రమం కోసం ఈయన భారీగానే రెమ్యూనరేషన్ అందుకోబోతున్నట్టు సమాచారం. ఈ రియాలిటీ షో కోసం నాగార్జున ఏకంగా 200 కోట్ల రూపాయల వరకు రెమ్యూనరేషన్ అందుకుంటున్నట్లు తెలుస్తోంది.నాగార్జున ఈ స్థాయిలో రెమ్యూనరేషన్ అందుకుంటున్నారు అంటే మరో రెండు సంవత్సరాల పాటు ఎలాంటి సినిమాలు చేయకపోయినా పర్వాలేదని ఈ రెమ్యూనరేషన్ నాలుగు సినిమాల కోసం తీసుకునే రెమ్యూనరేషన్ తో సమానం అంటూ నాగార్జున బిగ్ బాస్ రెమ్యూనరేషన్ పై కామెంట్స్ చేస్తున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…