బిగ్ బాస్ రెండవ వారానికి చేరుకోవడంతో బిగ్ బాస్ వేదికపైకి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్, మాస్ట్రో టీమ్ బిగ్ బాస్ వేదికపై సందడి చేశారు.ఈ క్రమంలోనే హౌస్ సభ్యులతో మాట్లాడి నాగార్జున హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ బిహేవియర్ ఏమాత్రం బాగలేదని, కొన్నిసార్లు కొందరు కంటెస్టెంట్ లు పరిధులు దాటి అన్ పార్లమెంటరీ వర్డ్స్ వాడటం వల్ల హౌ సభ్యులపై నాగార్జున తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ గట్టిగా వార్నింగ్ ఇచ్చారు.
ఈవారం హౌస్ లో ఉన్నటువంటి కంటెస్టెంట్ లు చేసినటువంటి పొరపాట్లను వివరిస్తూ ఒక్కొక్కరిని నాగార్జున కడిగిపారేశారు. హౌస్ లో ఉన్నటువంటి కొంతమంది సభ్యులు బిహేవియర్ ఏ మాత్రం బాగా లేదని ఈ షో కొన్ని కోట్ల మంది ప్రేక్షకులు చూస్తున్నారు అంటూ హౌస్ సభ్యులకు వార్నింగ్ ఇచ్చాడు. ఈ క్రమంలోనే ఉమాదేవి హౌస్లో బూతులు ఉపయోగిస్తుందని, ఈ విషయంలో కంట్రోల్ లో ఉండాలంటూ నాగార్జున హెచ్చరించడంమే కాకుండా ఆమెతో గుంజీళ్లు తీయించారు
అలాగే శ్వేత చేసిన తప్పులను చెబుతూ.. శ్వేతా వర్మ చేత క్షమాపణలు చెప్పించి తనకుతానే శిక్ష వేసుకునీ చెంపదెబ్బలు కొట్టుకుంది. ఇక లోబో కూడా మానస్ ను అన్న మాటలకు క్షమాపణలు చెప్పారు. అదేవిధంగా గత వారం కెప్టెన్సీ టాస్క్ లో భాగంగా సిరి తన షర్టు లోపలకి చెయ్యి పెట్టాడు అంటూ ఆరోపించడం తీవ్ర దుమారాన్ని రేపింది.
ఈ విషయంపై సన్నీ అలా వ్యవహరించలేదని నెటిజన్లు కూడా పెద్ద ఎత్తున కామెంట్లు పెట్టారు.ఈ క్రమంలోనే ఈ వీడియోను నాగార్జున మరొకసారి ప్లే చేసి చూపించగా అందులో సన్నీ తప్పు ఏమాత్రం లేదని తెలియడంతో ఆమె అసలు నిజ స్వరూపాన్ని బయట పెట్టి ఆమెచేత క్షమాపణలు చెప్పించి ఇంకొకసారి ఇలా రిపీట్ కాకూడదంటూ గట్టిగా వార్నింగ్ ఇచ్చారు.అలాగే బిగ్ బాస్ నిర్వహించే టాస్క్ చాలా అద్భుతంగా ఆడుతున్నారని వారి పై ప్రశంసలు కురిపించారు.
ఇటీవల కాలంలో జుట్టు రాలిపోవడం చాలా మందికి పెద్ద సమస్యగా మారింది. వాతావరణ మార్పులు, ఒత్తిడి, పోషకాహారం లోపం వంటి…
ఆంధ్రప్రదేశ్లోని ఆధ్యాత్మిక కేంద్రాలలో ఒకటైన అపరాజితా దేవి ఆలయం ఇటీవల భక్తుల దృష్టిని ఆకర్షిస్తోంది. విజయవాడలో ఉన్న ఈ ఆలయం…
భక్తి సంగీతానికి పునాది వేసిన మహానుభావులలో పురందరదాసు పేరు ప్రత్యేకంగా నిలుస్తుంది. కర్ణాటక సంగీతానికి “పితామహుడు”గా గుర్తింపు పొందిన ఆయన,…
మన వంటింట్లో సులభంగా దొరికే ధనియాలు కేవలం వంట రుచిని పెంచడానికే కాదు, ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో కూడా కీలక పాత్ర…
హిందూ సంప్రదాయాల్లో ప్రత్యేక స్థానం కలిగిన సీతా నవమి పండుగను దేశవ్యాప్తంగా భక్తులు భక్తిశ్రద్ధలతో జరుపుకుంటారు. ఈ రోజు సీతాదేవి…
వేసవి కాలంలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో శరీరం త్వరగా అలసటకు గురవుతుంది. ఈ సమయంలో కేవలం చల్లని పానీయాలు తాగడం సరిపోదు.…