బిగ్ బాస్ రెండవ వారానికి చేరుకోవడంతో బిగ్ బాస్ వేదికపైకి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్, మాస్ట్రో టీమ్ బిగ్ బాస్ వేదికపై సందడి చేశారు.ఈ క్రమంలోనే హౌస్ సభ్యులతో మాట్లాడి నాగార్జున హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ బిహేవియర్ ఏమాత్రం బాగలేదని, కొన్నిసార్లు కొందరు కంటెస్టెంట్ లు పరిధులు దాటి అన్ పార్లమెంటరీ వర్డ్స్ వాడటం వల్ల హౌ సభ్యులపై నాగార్జున తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ గట్టిగా వార్నింగ్ ఇచ్చారు.
ఈవారం హౌస్ లో ఉన్నటువంటి కంటెస్టెంట్ లు చేసినటువంటి పొరపాట్లను వివరిస్తూ ఒక్కొక్కరిని నాగార్జున కడిగిపారేశారు. హౌస్ లో ఉన్నటువంటి కొంతమంది సభ్యులు బిహేవియర్ ఏ మాత్రం బాగా లేదని ఈ షో కొన్ని కోట్ల మంది ప్రేక్షకులు చూస్తున్నారు అంటూ హౌస్ సభ్యులకు వార్నింగ్ ఇచ్చాడు. ఈ క్రమంలోనే ఉమాదేవి హౌస్లో బూతులు ఉపయోగిస్తుందని, ఈ విషయంలో కంట్రోల్ లో ఉండాలంటూ నాగార్జున హెచ్చరించడంమే కాకుండా ఆమెతో గుంజీళ్లు తీయించారు
అలాగే శ్వేత చేసిన తప్పులను చెబుతూ.. శ్వేతా వర్మ చేత క్షమాపణలు చెప్పించి తనకుతానే శిక్ష వేసుకునీ చెంపదెబ్బలు కొట్టుకుంది. ఇక లోబో కూడా మానస్ ను అన్న మాటలకు క్షమాపణలు చెప్పారు. అదేవిధంగా గత వారం కెప్టెన్సీ టాస్క్ లో భాగంగా సిరి తన షర్టు లోపలకి చెయ్యి పెట్టాడు అంటూ ఆరోపించడం తీవ్ర దుమారాన్ని రేపింది.
ఈ విషయంపై సన్నీ అలా వ్యవహరించలేదని నెటిజన్లు కూడా పెద్ద ఎత్తున కామెంట్లు పెట్టారు.ఈ క్రమంలోనే ఈ వీడియోను నాగార్జున మరొకసారి ప్లే చేసి చూపించగా అందులో సన్నీ తప్పు ఏమాత్రం లేదని తెలియడంతో ఆమె అసలు నిజ స్వరూపాన్ని బయట పెట్టి ఆమెచేత క్షమాపణలు చెప్పించి ఇంకొకసారి ఇలా రిపీట్ కాకూడదంటూ గట్టిగా వార్నింగ్ ఇచ్చారు.అలాగే బిగ్ బాస్ నిర్వహించే టాస్క్ చాలా అద్భుతంగా ఆడుతున్నారని వారి పై ప్రశంసలు కురిపించారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…