Nagarjuna: టాలీవుడ్ హీరో అక్కినేని నాగార్జున ఒకవైపు సినిమాలలో నటిస్తూనే మరోవైపు పలు వ్యాపారాలను కూడా నిర్వహిస్తున్న విషయం మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే ఈయన గోవాలో కమర్షియల్ వినియోగం కోసం కొన్ని నిర్మాణాలను చేపడుతున్నారు. అయితే ఈ నిర్మాణాలను తక్షణమే ఆపాలంటూ నాగార్జునకు గోవా అధికారులు నోటీసులు జారీ చేశారు.
గోవాలోని మాండ్రేమ్ పంచాయితీ సర్పంచ్ పేరుతో అక్కినేని నాగార్జునకు నోటీసులు జారీ చేశారు. మాండ్రేమ్ పంచాయితీ సర్వే నెంబర్ 211/2బి ప్రాంతంలో ముందుగా ఎలాంటి అనుమతులు తీసుకోకుండా నిర్మాణాలను చేపడుతున్నారని అందుకే ఈ అక్రమ నిర్మాణాలను ఆపాలి అంటూ సర్పంచ్ అమిత్ సావంత్ నాగార్జునకు జారీ చేసిన నోటీసులో పేర్కొన్నారు.
ఈ అక్రమ నిర్మాణాలను వెంటనే ఆపకపోతే పంచాయతీరాజ్ చట్టం 1994 ప్రకారం చర్యలు తీసుకోబడతాయని కూడా మాండ్రేమ్ సర్జంచ్ అమిత్ సావంత్ నాగార్జునకు నోటీసుల ద్వారా హెచ్చరికలు జారీ చేశారు. దీంతో నాగార్జునకు గోవాలోని నిర్మాణాలకు భారీగా షాక్ తగిలిందని చెప్పాలి.
ఇకపోతే నాగార్జున ఈ విధమైనటువంటి అక్రమనిర్మాణాలకు సంబంధించిన ఇబ్బందులను ఎదుర్కోవడం ఇది మొదటిసారి కాదు. గతంలో కూడా ఈయన తెలంగాణలో ప్రభుత్వం నుంచి ఏ విధమైనటువంటి అనుమతులు లేకుండా కొన్ని నిర్మాణాలు చేపట్టడంతో అప్పుడు కూడా అక్రమ నిర్మాణాలకు సంబంధించిన ఇబ్బందులను ఎదుర్కొన్న విషయం మనకు తెలిసిందే. తాజాగా ఇప్పుడు గోవాలో కూడా ఈ విధమైనటువంటి ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…