Nagababu: నాగబాబు గత కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో సంచలన వ్యాఖ్యలు చేస్తూ అలాగే సంచలనమైనటువంటి పోస్టులు చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. ఇకపోతే ఏపీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిసిన అనంతరం ఈయన సోషల్ మీడియా వేదికగా చేసినటువంటి పోస్ట్ సంచలనగా మారింది.
మే 13వ తేదీ ఏపీలో జరిగినటువంటి ఎన్నికలలో భాగంగా మెగా ఫ్యామిలీ మొత్తం పవన్ కళ్యాణ్ కు మద్దతుగా ప్రచార కార్యక్రమాలను నిర్వహించిన సంగతి తెలిసిందే అలాగే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సైతం పవన్ కళ్యాణ్ కు మద్దతు తెలుపుతూనే మరోవైపు వైసీపీ అభ్యర్థికి ప్రచార కార్యక్రమాలు చేశారు.
ఈ విషయంపై మెగా అభిమానులు అలాగే బన్నీ అభిమానుల మధ్య కోల్డ్ వార్ నడుస్తోంది. కానీ బన్నీ మాత్రం ఈ ట్రోల్స్ పై స్పందిస్తూ నాకు పార్టీలతో సంబంధం లేదు స్నేహం కోసం ఎక్కడికైనా వెళ్తా అంటూ క్లారిటీ ఇచ్చారు కానీ తాజాగా నాగబాబు సోషల్ మీడియా వేదికగా చేసిన పోస్ట్ మాత్రం పరోక్షంగా బన్నీని ఉద్దేశించి చేశారు అంటూ సోషల్ మీడియాలో బన్నీ ఫాన్స్ ఫైర్ అవుతున్నారు.
అల్లు అర్జున్ గురించేనా..
ట్విట్టర్ వేదికగా నాగబాబు స్పందిస్తూ.. మాతో ఉంటూ ప్రత్యర్థులకు పని చేసేవాడు మావాడు అయినా సరే పరాయి వాడే… మాతో నిలబడే వాడు పరాయివాడైన మా వాడే అంటూ ఈయన చేసిన వ్యాఖ్యలు సంచలనగా మారాయి నాగబాబు అల్లు అర్జున్ ఉద్దేశించే ఈ పోస్ట్ చేశారా అంటూ కొందరు కామెంట్లు చేస్తూ నాగబాబు పై విమర్శలు చేయగా మరికొందరు వర్మని ఉద్దేశించి చేశారు అంటూ కామెంట్లు పెడుతున్నారు.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…