బుల్లితెరపై పలు సీరియల్స్ లో నటీనటులుగా కొనసాగుతూ ఎంతో మంచి పేరు సంపాదించుకున్న కీర్తి ధనుష్ గురించి మనకు తెలిసిందే. కీర్తి, ధనుష్ ఎన్నో సీరియల్స్ లో నటించే విశేష ప్రేక్షకాదరణ సంపాదించుకున్నారు. సీరియల్స్ ద్వారా వీరి మధ్య పరిచయం ఏర్పడి, ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారి నిజజీవితంలో ఒక్కటయ్యారు. సీరియల్స్ ద్వారా ఎంతోమంది గుర్తింపు సంపాదించుకున్న కీర్తి హిట్లర్ సీరియల్ ద్వారా ప్రేక్షకులను సందడి చేస్తున్నారు.ఈ మధ్యకాలంలో సీరియల్స్ కు బ్రేక్ ఇచ్చిందని చెప్పవచ్చు. అందుకు కారణం ఈమె తల్లి కావటమే.
కీర్తి గత కొద్ది రోజుల క్రితం తన బేబీ బంప్ ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ తన తల్లి కాబోతున్న విషయాన్ని తెలిపారు. ఈ క్రమంలోనే గత కొద్ది రోజుల క్రితం కీర్తి పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారు.ఇదే విషయమై సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న కీర్తి సురేష్ తాజాగా తన కొడుకు నామకరణ కార్యక్రమాన్ని జరిపించారు. ఈ క్రమంలోనే నామకరణ మహోత్సవానికి సంబంధించిన ఫోటోలను షేర్ చేస్తూ తన కొడుకు పేరును వెల్లడించారు.
కీర్తి, ధనుష్ వారి కొడుకు రుద్వేద్ అని నామకరణం చేశారు. వీరి బాబు ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తున్నప్పటికీ, బాబు ఫేస్ ను మాత్రం చూపించలేదు. అయితే రీసెంట్ గా జరుపుకున్న నామకరణ మహోత్సవానికి సంబంధించిన ఫోటోలను కీర్తి ధనుష్ షేర్ చేశారు. ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ కార్యక్రమానికి సంబంధించిన ఫోటోలను ఇక్కడ చూడవచ్చు. ఈ ఫోటోలు చూసిన నెటిజన్లు మీ కొడుకు ఫోటో ఇప్పటికైనా చూపించండి, మీ కొడుకు ఫోటో చూడకుండా వుండలేకపోతున్నాము అంటూ కామెంట్లు చేస్తున్నారు.
నటి కీర్తి బుల్లితెర నటి మంజుల చెల్లెలు అనే సంగతి మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ నామకరణ మహోత్సవంలో భాగంగా మంజుల, పరిటాల నిరుపమ్ దంపతులు హాజరయ్యారు. ప్రస్తుతం ఈ నామకరణ కార్యక్రమానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
అద్భుత మంత్ర శక్తులతో, మంత్ర రహస్యాలతో, మంత్ర విశేషాలతో మరీ ముఖ్యంగా మహా బలాలకే మహా బలాన్నిచ్చే పరమాద్భుత నృసింహ…
భారత రూపాయి చరిత్రలో ఎన్నడూ లేని స్థాయిలో పతనమవుతోంది. డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ రోజురోజుకు దిగజారుతూ ఆల్టైం…
చలికాలం వచ్చిందంటే చాలు.. చాలా మందికి ఒక విచిత్రమైన అనుభవం ఎదురవుతుంటుంది. కారు డోర్ తీస్తున్నా, కుర్చీలో కూర్చుంటున్నా, కనీసం…
నేటి ఉరుకుల పరుగుల జీవితంలో మానసిక ప్రశాంతతకు, శారీరక దృఢత్వానికి చాలామంది యోగాను ఆశ్రయిస్తున్నారు. అయితే, యోగా చేసేవారిని తరచుగా…
చేపలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయనడంలో సందేహం లేదు. అయితే, చేపలను ఏ ఆహారాలతో కలిపి తింటున్నాం అన్నదే అసలు…
కేంద్రంలోని మోదీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయానికి సిద్ధమవుతోంది. ఇప్పటివరకు అమలులో ఉన్న **మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ…