Namrata: నమ్రతా శిరోద్కర్ బాలీవుడ్ ఇండస్ట్రీలో నటిగా ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించి ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి ఈమె తెలుగులో మహేష్ బాబు సరసన వంశి అనే సినిమాలో నటించారు. 2000వసంవత్సరంలో ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి ఈ సినిమా సమయంలోనే నమ్రత మహేష్ ఇద్దరు ప్రేమలో పడ్డారు.
ఇలా ప్రేమలో మునిగి తేలుతున్నటువంటి ఈ జంట సుమారు ఐదు సంవత్సరాలు పాటు ప్రేమలో విహరిస్తూ అనంతరం 2005వ సంవత్సరంలో వీరిద్దరూ ఎంతో ఘనంగా వివాహం చేసుకున్నారు.వివాహం ముందు వరకు నమ్రత సినిమాలలో నటించారు కానీ వివాహం తర్వాత ఈమె సినిమాలకు స్వస్తి పలుకుతూ ఇంటికే పరిమితమయ్యారు. మహేష్ బాబు సినిమాలలో బిజీగా ఉండగా ఈమె మాత్రం ఇంటి బాధ్యతలను చూసుకున్నారు.
ఇలా ఇంటి బాధ్యతలను పిల్లల బాధ్యతలను నిర్వర్తిస్తూనే మరోవైపు వ్యాపార రంగంలో కూడా రాణిస్తున్నారు. అయితే తాజాగా నమ్రత ఒక జువెలరీ షాప్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా నమ్రత మాట్లాడుతూ తన కోసం మహేష్ బాబు మొదటిసారి ఇచ్చిన గిఫ్ట్ గురించి ఈమె తెలియజేశారు.
మహేష్ బాబు తనకోసం మొదటిసారి వెడ్డింగ్ రింగ్ గిఫ్ట్ గా ఇచ్చారని ఈ సందర్భంగా నమ్రత మహేష్ ఇచ్చిన మొదటి గిఫ్ట్ గురించి చెబుతూ చేసినటువంటి ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.తనకు నగలు అంటే పెద్దగా ఇష్టం ఉండదు తనకు ఎప్పుడూ కూడా చాలా సింపుల్ గా ఉండటానికి ఇష్టపడతానని తెలియజేశారు. అందుకే తాను షాపింగ్స్ కూడా పెద్దగా చేయనని ఈ సందర్భంగా నమ్రత చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
తెలంగాణలో క్రికెట్కు మరింత ప్రోత్సాహం అందించే లక్ష్యంతో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న టీజీ20 లీగ్ ప్రారంభానికి సర్వం…
తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్గా, నటిగా సుపరిచితమైన విష్ణుప్రియ భీమినేని మరోసారి వార్తల్లో నిలిచారు. టెలివిజన్ షోలు, రియాలిటీ కార్యక్రమాలు,…
వ్యవసాయం అనేది దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక. రైతు సంతోషంగా ఉంటేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. అయితే…
అమెరికా మాజీ అధ్యక్షుడు, ప్రస్తుతం దేశ రాజకీయాల్లో అత్యంత ప్రభావశీల నాయకుడిగా కొనసాగుతున్న డొనాల్డ్ ట్రంప్ మరోసారి వలసల అంశంపై…
ఈ రోజుల్లో మనం దుస్తులు కొనేటప్పుడు ఎక్కువ సమయం రంగు, డిజైన్ లేదా ధర గురించి ఆలోచిస్తాం. కానీ వాటన్నింటికంటే…
రాజకీయ నాయకుడిగా, సినీ నటుడిగా కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్…