Featured

Nandamuri Balakrishna : నందమూరి బాలయ్య కెరీర్ లో ఆయనకు నచ్చిన హీరోయిన్స్ వీళ్ళే… వారితో నటించడం అంటే ఇష్టమట..!

Nandamuri Balakrishna : నందమూరి నట వారసుడిగా తెలుగు సినిమాలలో ప్రస్థానం మొదలు పెట్టినప్పటి నుండి ఇప్పటి వరకు టాప్ హీరోలలో ఒకరిగానే కొనసాగుతున్నారు. ఇప్పటికీ కుర్ర హీరోలతో పోటీ పడుతూ ఇండస్ట్రీ రికార్డులను తిరగ రాస్తున్నాడు. సినిమాలతో పాటు ఒకవైపు రాజకీయాలు, మరోవైపు బసవతారకం హాస్పిటల్ ఇలా అన్నింటినీ సమర్థవంతంగా ముందుకి తీసుకెళ్తున్నారు. ప్రస్తుతం బాలకృష్ణ హీరోగా ఆయన 107వ చిత్రం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రాబోతోంది. అయితే ఇప్పటివరకు 106 చిత్రాలలో చాలా మంది నటీ నటులతోను హీరోయిన్లతోను నటించినా ఆయనకు ఇద్దరు హీరోయిన్లు అంటేనూ.. వారితో నటించడం అంటేనూ ఇష్టమట.

బాలయ్య మెచ్చిన హీరోయిన్లు…

ఇప్పటికి బాలకృష్ణ కు జోడిగా చాలా మంది హీరోన్లు తెర మీద కనిపించారు. అయితే బాలకృష్ణ తో కలసి నటించిన హీరోయిన్లలో తనకు బాగా కంఫర్ట్ గా అనిపించి, వారితో ఇంకో సినిమాలో కూడా చేయాలి అనుకునే ఇద్దరు హీరోయిన్లు ఉన్నారని బాలయ్య ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. ఆ ఇద్దరు హీరోయిన్లు ఎవరో కాదు… ఒకరు సిమ్రాన్ ఇంకొకరు నయనతార. వీళ్లిద్దరితో సినిమాలు చేయడం కంఫర్టబుల్ గా అనిపిస్తుందట.

బాలకృష్ణ సిమ్రాన్ జోడిల గురించి చెప్పక్కర్లేదు. వీరిద్దరి జోడితో బొమ్మ పడితే అది బ్లాక్ బస్టర్ హిట్లుగా నిలిచేవి. ఆన్ స్క్రీన్ మీద వీళ్ళ మధ్య కెమిస్ట్రీ బాగా కుదిరేది. సిమ్రాన్ తరువాత అంతలా బాలకృష్ణ సరైన జోడిగా అనిపించింది నయనతార. సింహ సినిమాలో వీరిద్దరి నటన, వీరి మధ్య సన్నివేశాలు ప్రేక్షకుల మదిలో అలా నిలిచిపోయాయి. తరువాత ఏ హీరోయిన్స్ తోను బాలయ్య జంట అంతగా సెట్ అవ్వలేదనే చెప్పాలి.

Bhargavi

Recent Posts

“హేమక్కా సారీ”.. వీడియోతో షాక్ ఇచ్చిన తమన్నా సింహాద్రి!

తెలుగు బుల్లితెరలో గుర్తింపు పొందిన బిగ్‌బాస్ ఫేమ్ తమన్నా సింహాద్రి మరోసారి వార్తల్లో నిలిచారు. గతంలో నటి హేమపై వచ్చిన…

1 hour ago

చిన్న నిర్లక్ష్యమే ప్రాణాంతకం.. వేణు మాధవ్ మరణం వెనుక నిజం ఇదే!

తెలుగు సినిమా ప్రపంచంలో తన ప్రత్యేక హాస్యంతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన నటుడు వేణు మాధవ్ మరణం ఇప్పటికీ అభిమానులను…

1 hour ago

‘తొలిప్రేమ’ డైరెక్టర్ కరుణాకరన్ కమ్‌బ్యాక్.. గణేష్ హీరోగా కొత్త సినిమా..!

తెలుగు సినీ పరిశ్రమలో మరో ఆసక్తికర కాంబినేషన్ తెరపైకి రానుంది. యువ నటుడు బెల్లంకొండ గణేష్ హీరోగా తెరకెక్కుతున్న కొత్త…

1 hour ago

కేవలం 14 రోజులు ఈ పండు తింటే.. ముఖం మెరుస్తుందట!

వేసవి కాలం వచ్చేసరికి చర్మ సమస్యలు, నీరసం, డీహైడ్రేషన్ వంటి ఇబ్బందులు ఎక్కువవుతాయి. కాలుష్యం, ఒత్తిడి కలిసివచ్చే ఈ రోజుల్లో…

2 hours ago

టీ తర్వాత వెంటనే నీళ్లు తాగుతున్నారా..? ఈ అలవాటు మానండి.. లేకపోతే పళ్ల సమస్యలు తప్పవు!

మన దైనందిన జీవితంలో టీకి ప్రత్యేక స్థానం ఉంది. ఉదయం లేవగానే ఒక కప్పు వేడి టీ తాగడం చాలా…

2 hours ago

లేడీ యాంకర్ వల్లే కష్టాలు.. యాంకర్ రవి సంచలన వ్యాఖ్యలు

తెలుగు బుల్లితెరలో తన ప్రత్యేక శైలితో గుర్తింపు సంపాదించుకున్న యాంకర్ Anchor Ravi తాజాగా చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.…

2 hours ago