Nandamuri Tarakaratna: నందమూరి తారకరత్న ఇటీవల గుండెపోటుతో అనారోగ్యం పాలైన సంగతి అందరికీ తెలిసిందే. గత నాలుగు రోజులుగా తారకరత్న ఆరోగ్యానికి సంబంధించిన వార్తలు ఎప్పటికప్పుడు వైరల్ అవుతూనే ఉన్నాయి. ఇటీవల నారా లోకేష్ ప్రారంభించిన యువగలం పాదయాత్రలో పాల్గొన్న తారకరత్న అకస్మాత్తుగా గుండెపోటు రావడం వల్ల అనారోగ్యం పాలయ్యాడు. దీంతో వెంటనే స్థానిక ఆసుపత్రికి తీసుకెళ్లి ప్రతిమ చికిత్స చేయించిన తర్వాత మెరుగైన వైద్యం కోసం బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆసుపత్రికి తరలించారు.
ప్రస్తుతం తారకరత్న ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని నందమూరి కుటుంబ సభ్యులు వెల్లడించారు. ఇదిలా ఉండగా నందమూరి తారకరత్న మహిళా అనారోగ్యం పాలవటంతో ప్రస్తుతం ఆయన కుటుంబానికి సంబంధించిన విషయాల గురించి తెలుసుకోవటానికి ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. నందమూరి తారక రామారావు కుమారుడైన నందమూరి మోహనకృష్ణ కుమారుడే ఈ నందమూరి తారకరత్న.
తారకరత్న 2012లో అలేఖ్య రెడ్డి అనే యువతని వివాహం చేసుకున్నాడు. అలేఖ్య రెడ్డి మరెవరో కాదు ఎంపీ విజయసాయిరెడ్డి మరదలి కూతురే ఈ అలేఖ్య రెడ్డి. స్నేహితుల ద్వారా ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడి ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. అయితే వీరి పెళ్లికి ఇర కుటుంబ సభ్యులు నిరాకరించటంతో పెద్దలను ఎదిరించి వివాహం చేసుకున్నారు. విజయసాయిరెడ్డి వీరి వివాహానికి మద్దతుగా నిలిచాడని గతంలో ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న అలేఖ్య రెడ్డి వెల్లడించింది.
వీరి వివాహం తర్వాత ఇటు నందమూరి కుటుంబ సభ్యులకు కూడా కొంతకాలం తారకరత్నని దూరం పెట్టారు. ఎందుకంటే తారకరత్న వివాహం చేసుకున్న అలేఖ్య రెడ్డికి గతంలోనే ఒకసారి వివాహం జరిగి విడాకులు తీసుకుంది. అందువల్ల నందమూరి కుటుంబ సభ్యులు వీరి వివాహాన్ని అంగీకరించకపోగా.. కొంతకాలం తారకరత్నను దూరంగా ఉంచారు. ఇక నాలుగు సంవత్సరాల క్రితం తారకరత్న పుట్టినరోజు సందర్భంగా అందరూ కలిసిపోయారు.
భారతీయ సంప్రదాయ వైద్యంలో వేప చెట్టుకు ప్రత్యేక స్థానం ఉంది. తరతరాలుగా వేప ఆకులు, పువ్వులు, బెరడు, గింజలను అనేక…
దేశవ్యాప్తంగా ఇటీవల సిజేరియన్ ప్రసవాలకు సంబంధించిన కొన్ని ఘటనలు చర్చనీయాంశంగా మారాయి. రాజస్థాన్లోని కొన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవం అనంతరం…
జూన్ నెలలో గ్రహాల సంచారాలు జ్యోతిష్య పరంగా ప్రత్యేక ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ముఖ్యంగా జూన్ 17న చంద్రుడు కర్కాటక రాశిలోకి…
తమిళ సినీ దిగ్గజ దర్శకుడు భారతీరాజా మరణంతో ఆయన సినీ ప్రయాణానికి సంబంధించిన అనేక ఆసక్తికర అంశాలు మరోసారి వెలుగులోకి…
పుదుచ్చేరిలోని ఒక ప్రముఖ హోటల్లో జరిగిన సంఘటన వినియోగదారుల హక్కులపై మరోసారి చర్చకు దారి తీసింది. చికెన్ బిర్యానీ ఆర్డర్…
హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ మరోసారి భారీ చర్చకు దారి తీస్తోంది. ఇటీవల రాయదుర్గంలో ప్రభుత్వ భూములకు ఎకరాకు రికార్డు…