Nandini Reddy: తెలుగు చలన చిత్ర పరిశ్రమలో మహిళా దర్శకురాలిగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సాంపాదించారు నందిని రెడ్డి. 11 ఏళ్ళ క్రితం తన సినీ ప్రయాణాన్ని మొదలు పెట్టిన నందిని రెడ్డి, తన మొదటి సినిమా అయిన అలా.. మొదలైంది తోనే విజయాన్ని సాధించిన హిట్ సినిమా దర్శకురాలిగా పేరు తెచ్చుకున్నారు. తరువాత కొన్ని సినిమాల తరువాత వచ్చిన సమంత తో తీసిన ఓ బేబీ సినిమాతో మరో విజయాన్ని సొంతం చేసుకున్నారు. మహిళా దర్శకురాలిగా మంచి పేరు సంపాదించుకున్న నందిని రెడ్డి కి కూడా ఇండస్ట్రీ లో చేదు అనుభవం ఎదురైనట్లు ఈ మధ్య ఓ ఇంటర్వ్యూలో తెలియజేశారు.
నన్ను అది, ఇది అంటూ మాట్లాడారు….
మహిళలంటే చాలా చోట్ల చిన్న చూపు చూపిస్తారు. ఆ విషయంలో నేను కూడా ఇబ్బందులు ఎదుర్కొన్నాను అని నందిని రెడ్డి తాజాగా ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. కల్యాణ వైభోగమే చిత్రం షూటింగ్ సమయంలో తాను మహిళ అనే చిన్నచూపుతో ఒక సీనియర్ ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ తనగురించి అసభ్యంగా మాట్లాడాడు అని తెలియజేసారు. ఒక సాంగ్ షూటింగ్ కి అవసరం అయిన కెమెరా లెన్స్ ని ఆయన రద్దు చేశారు. దీనితో అతడికి చెప్పకుండా నేను నిర్మాతని అడిగి వాటిని తెప్పించుకున్నా, కానీ అవి ప్రమాదవశాత్తు విరిగిపోయాయి. నాకు చెప్పకుండా చేస్తోంది అన్న ఫీలింగ్ తో నా అసిస్టెంట్ తో అతడు అసభ్యంగా మాట్లాడాడట.
ఏమనుకుంటోంది అది.. ఇది అని ఏకవచనంతో సంభోదిస్తూ నన్ను తిట్టాడట. ఆ విషయం నా దృష్టికి రాగ వెంటనే నిర్మాతని కలిసి అతడు సెట్స్ లో ఉంటే నేను సినిమా చేయలేను .. వెళ్ళిపోతాను అని నిర్మాతతో చెప్పేసాను. ఆయన సీనియర్.. అని నిర్మాత చెప్పినా నేను వినలేదు చేయను అని చెప్పేసాను.
దీనితో అతడిని మా సినిమా నుంచి తప్పించారు. కొన్ని రోజుల తర్వాత మళ్ళీసెట్స్ లో కనిపించాడు. నేనె వెళ్ళిపోతున్నట్లు నిర్మాతకు సమాచారం ఇవ్వండి అని అక్కడున్నవాళ్లకు చెప్పి, ఆ నా * సెట్స్ లో ఉంటే నేను రాను అని నిర్మాతకు కూడా చెప్పాను. నా నుంచి బూతు మాట రావడం అదే తొలిసారి. ఆయన సినిమా షూటింగ్ కోసం రాలేదు, ఏదో క్యాంపెనింగ్ కోసం వచ్చారు అని చెప్పగా దీనితో నేను తిరిగి షూటింగ్ లో పాల్గొనినట్లు నందిని రెడ్డి చెప్పారు. ఆ సంఘటన మినహా ఇండస్ట్రీలో తనకు ఎలాంటి చేదు అనుభవం జరగ లేదని నందిని రెడ్డి తెలియజేసారు. ప్రస్తుతం నందినీరెడ్డి నాగచైతన్య తో ఒక సినిమా చేయబోతున్నారు. స్వప్న దత్ ఈ సినిమాని స్వప్న సినిమా పతాకంపై కాకుండా వైజయంతి మూవీస్ పతాకంపై నిర్మిస్తున్నారు.
2026 ఏప్రిల్ 17న రానున్న వైశాఖ అమావాస్యకు జ్యోతిష్య, ఆధ్యాత్మిక పరంగా ప్రత్యేక ప్రాధాన్యం ఉందని పండితులు చెబుతున్నారు. ఈసారి…
తమిళనాడులో డీలిమిటేషన్ బిల్లుపై రాజకీయ ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదనపై తన నిరసనను…
ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో ఓ ఇంటర్ విద్యార్థి చేసిన ఫోన్ కాల్ ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఫలితాలు వెలువడక ముందే ఫెయిల్…
యాదాద్రి భువనగిరి జిల్లాలోని హనుమాపురం గ్రామంలో హృదయ విదారక ఘటన వెలుగులోకి వచ్చింది. కుటుంబ కలహాల మధ్య ఓ తండ్రి…
భారతదేశంలో ఆధ్యాత్మిక ప్రాధాన్యత కలిగిన క్షేత్రాల్లో కాశీ ప్రత్యేక స్థానం పొందింది. అదే కాశీలో అరుదుగా దర్శనమిచ్చే దేవగురువు బృహస్పతి…
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపుతున్న ప్రముఖ గాయని మంగ్లీకు సంబంధించిన మోసం ఆరోపణలు రోజురోజుకు కొత్త మలుపులు తిరుగుతున్నాయి. మైక్రో…