AP: ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సంగతి మనకు తెలిసిందే. అయితే కూటమి అధికారంలోకి రావడం కోసం ఎన్నికలకు ముందు పెద్ద ఎత్తున హామీలను ప్రకటించారు. ఇందులో భాగంగా తల్లికి వందనం కూడా ఒకటి. గత ప్రభుత్వం అమ్మఒడి పేరుతో ప్రతి ఇంట్లో ఒక విద్యార్థికి 15000 రూపాయలను అందజేశారు.
ఈ క్రమంలోనే కూటమి ప్రభుత్వం సైతం స్థానం అధికారంలోకి వస్తే ఇంట్లో ఎంతమంది చదువుకునే పిల్లలు ఉంటే వారందరికీ ఒక్కొక్కరికి 15వేల రూపాయలు చొప్పున అందజేస్తామని వెల్లడించారు. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన పిల్లలు పాఠశాలలకు కూడా వెళ్తున్న కానీ ఇప్పటివరకు ఈ పథకం గురించి ఎలాంటి అధికారక ప్రకటన లేదు.
తాజాగా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అమ్మకు వందనం గురించి మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన స్పందిస్తూ.. తల్లికి వందనం పథకాన్ని ఇంట్లో ఎంతమందికి ఉంటే అంతమందికి అందజేస్తామని తెలిపారు. ఇక ఈ పథకం ప్రభుత్వ పాఠశాలలో చదివే వారితో పాటు ప్రైవేట్ పాఠశాలలో చదివే విద్యార్థులకు కూడా వర్తిస్తుందని తెలిపారు.
ప్రవేట్ పాఠశాల విద్యార్థులకు..
అమ్మకు వందనం పథకానికి మార్గదర్శకాలు జారీ చేయడానికి మరికాస్త సమయం పడుతుందని తెలిపారు గత ప్రభుత్వం చేసిన తప్పులు మళ్లీ జరగకూడదు అనేది మా లక్ష్యం అని తెలిపారు. ఈ పథకానికి ఎంతమంది అర్హులు ఉన్న వారందరికీ ఒక్కొక్కరికి 15000 రూపాయలు తప్పనిసరిగా అందజేస్తామంటూ ఈ సందర్భంగా లోకేష్ తెలిపారు.. ఇప్పటికే పాఠశాలలో ప్రారంభమైనప్పటికీ ఈ పథకం అందకపోవడంతో పలువురు ఈ అమ్మకు వందనం పథకంపై విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…