AP: ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సంగతి మనకు తెలిసిందే. అయితే కూటమి అధికారంలోకి రావడం కోసం ఎన్నికలకు ముందు పెద్ద ఎత్తున హామీలను ప్రకటించారు. ఇందులో భాగంగా తల్లికి వందనం కూడా ఒకటి. గత ప్రభుత్వం అమ్మఒడి పేరుతో ప్రతి ఇంట్లో ఒక విద్యార్థికి 15000 రూపాయలను అందజేశారు.

ఈ క్రమంలోనే కూటమి ప్రభుత్వం సైతం స్థానం అధికారంలోకి వస్తే ఇంట్లో ఎంతమంది చదువుకునే పిల్లలు ఉంటే వారందరికీ ఒక్కొక్కరికి 15వేల రూపాయలు చొప్పున అందజేస్తామని వెల్లడించారు. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన పిల్లలు పాఠశాలలకు కూడా వెళ్తున్న కానీ ఇప్పటివరకు ఈ పథకం గురించి ఎలాంటి అధికారక ప్రకటన లేదు.
తాజాగా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అమ్మకు వందనం గురించి మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన స్పందిస్తూ.. తల్లికి వందనం పథకాన్ని ఇంట్లో ఎంతమందికి ఉంటే అంతమందికి అందజేస్తామని తెలిపారు. ఇక ఈ పథకం ప్రభుత్వ పాఠశాలలో చదివే వారితో పాటు ప్రైవేట్ పాఠశాలలో చదివే విద్యార్థులకు కూడా వర్తిస్తుందని తెలిపారు.
ప్రవేట్ పాఠశాల విద్యార్థులకు..
అమ్మకు వందనం పథకానికి మార్గదర్శకాలు జారీ చేయడానికి మరికాస్త సమయం పడుతుందని తెలిపారు గత ప్రభుత్వం చేసిన తప్పులు మళ్లీ జరగకూడదు అనేది మా లక్ష్యం అని తెలిపారు. ఈ పథకానికి ఎంతమంది అర్హులు ఉన్న వారందరికీ ఒక్కొక్కరికి 15000 రూపాయలు తప్పనిసరిగా అందజేస్తామంటూ ఈ సందర్భంగా లోకేష్ తెలిపారు.. ఇప్పటికే పాఠశాలలో ప్రారంభమైనప్పటికీ ఈ పథకం అందకపోవడంతో పలువురు ఈ అమ్మకు వందనం పథకంపై విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే.































