Naresh: ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా ఎవరైనా ఉన్నారు అంటే అది కేవలం పవిత్ర లోకేష్ నరేష్ అనే చెప్పాలి. వీరిద్దరూ విజయకృష్ణ మూవీస్ బ్యానర్ ద్వారా మళ్ళీ పెళ్లి అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ సినిమా మే 26వ తేదీ విడుదల కానున్న నేపథ్యంలో వారి ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.
ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ప్రీరిలీజ్ వేడుకను కూడా ఎంతో ఘనంగా నిర్వహించారు. అయితే ఈ కార్యక్రమంలో భాగంగా నరేష్ తన తల్లి విజయనిర్మలను గుర్తు చేసుకొని ఎమోషనల్ కామెంట్ చేశారు. ఈ సందర్భంగా నరేష్ మాట్లాడుతూ 19 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు తన తల్లి ఎవరికో మంచి చేయడానికి నన్ను పెళ్లి చేసుకోమని చెప్పారు. అయితే పెళ్లి వల్ల ఎవరికి మంచి జరగలేదు.
మరోసారి నా జీవితంలో మంచి చేయాలని నిర్ణయం తీసుకుంటే ఆ కోరిక కూడా తీరలేదని తెలిపారు. మరోసారి మంచి చేయాలని అమ్మ భావించగా మంచి కన్నా చెడే ఎక్కువగా జరిగిందని నరేష్ తెలిపారు. మా అమ్మ చివరిగా నాతో మాట్లాడుతూ నిన్ను రాజును చేశాను కానీ నీకు మంచి జీవితం ఇవ్వలేకపోయాను అంటూ తన తల్లి ఎంతో బాధపడిందని నరేష్ తెలిపారు. నా రీల్ జీవితం చాలా బాగా కొనసాగింది కానీ రియల్ జీవితం ఏమాత్రం సంతోషంగా సాగలేదని తెలిపారు.
ఇక అమ్మ నా గురించి మాట్లాడుతూ ఉండగా నువ్వేం బాధపడకమ్మా అమ్మ తర్వాత నాకు మరో అమ్మ లాంటి అమ్మాయి దొరికింది అంటూ ఈయన పవిత్ర లోకేషన్ చూపిస్తూ చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. పవిత్రతో నా పరిచయం ఏర్పడిన తర్వాత నా జీవితం చివరి గమ్యానికి చేరుకున్నాను అన్న నమ్మకం ఎక్కువైంది అంటూ ఈ సందర్భంగా ఈయన ఎమోషనల్ అవుతూ చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
జామపండు అంటే చాలా మందికి ఇష్టమైన పండు. తక్కువ ధరలో లభించే ఈ పండులో ఆరోగ్యానికి అవసరమైన ఎన్నో పోషకాలు…
తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్గా, నటిగా ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న శ్రీముఖి మరోసారి వార్తల్లో నిలిచింది. తన చురుకైన యాంకరింగ్,…
దేశవ్యాప్తంగా మెడికల్ షాపుల్లో దగ్గు సిరప్ల విక్రయాలపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై దగ్గు మందులు లేదా…
దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తును నిర్ణయించే నీట్ (NEET) పరీక్ష చుట్టూ గత కొంతకాలంగా వివాదాలు, పేపర్ లీక్…
ప్రతిరోజూ ఉదయం చాలా మంది తమ రాశిఫలాన్ని చూసి రోజు ఎలా ఉండబోతుందో తెలుసుకోవాలని ఆసక్తి చూపుతుంటారు. గ్రహాల సంచారం,…
తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ప్రభుత్వం కీలక హెచ్చరిక జారీ చేసింది. రానున్న వారం రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా భారీ నుంచి…