Naresh: సీనియర్ నటుడు నరేష్ ఇదివరికి మూడు పెళ్లిళ్లు చేసుకుని తన ముగ్గురు భార్యలకు విడాకులు ఇచ్చిన విషయం మనకు తెలిసిందే. ఇలా మూడు పెళ్లిళ్ల తర్వాత ఆ మూడు పెళ్లిళ్లు పెటాకులు కావడంతో ఈయన తిరిగి నటి పవిత్ర లోకేష్ తో రిలేషన్ లో ఉంటున్నారు.త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నారంటూ గతంలో పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి..
ఈ క్రమంలోనే వీరిద్దరూ కలిసి మళ్ళీ పెళ్లి అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు తాజాగా ఈ సినిమా నుంచి ట్రైలర్ విడుదల చేయగా ఈ ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో నరేష్ పెళ్లిల గురించి చేసినటువంటి కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ఇక వీళ్ళిద్దరూ సహజీవనంలో ఉండగా చాలామందికి వీరిద్దరు నిజంగానే సహజీవనంలో ఉన్నారా లేక పెళ్లి కూడా చేసుకున్నారా అనే సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి.
ఈ క్రమంలోనే నరేష్ ఈ ప్రశ్నకు సమాధానం చెబుతూ… ప్రస్తుత కాలంలో వైవాహిక వ్యవస్థ కూలిపోతుందని తెలిపారు. ఇన్ని ఫ్యామిలీలు కోర్టుకు వచ్చాయి అంటే దాని అర్థం అదేనని నరేష్ తెలిపారు. కానీ మళ్లీ పెళ్లి అనే సినిమా ద్వారా వివాహ వ్యవస్థను గౌరవిస్తూ ఈ సినిమా చేశామని తెలియజేశారు.మనం పెళ్లి ఏ సాంప్రదాయ పద్ధతిలో చేసుకున్నప్పటికీ పెళ్లి అనేది కేవలం రెండు మనసుల కలయిక మాత్రమేనని తెలిపారు.
ఇలా రెండు మనసులు కలిస్తే దాదాపు పెళ్లి అయిపోయినట్టేనని ఈ సందర్భంగా నరేష్ తెలియజేశారు. ఇక పవిత్ర లోకేష్ ఇద్దరు కూడా దాదాపు పెళ్లి చేసుకున్నట్టేనని అర్థం వచ్చే విధంగా నరేష్ మాట్లాడగా పక్కనే ఉన్నటువంటి పవిత్ర లోకేష్ సైతం అవును అనేలాగే తల ఊపడంతో వీరిద్దరూ పెళ్లి చేసుకున్నారనీ అర్థమవుతుంది.ఇక వీరిద్దరూ మళ్లీ పెళ్లి అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు ఈ సినిమా నరేష్ వ్యక్తిగత జీవిత కథ ఆధారంగా తెరకెక్కినట్టు తెలుస్తుంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…