Natti Kumar : నీ వెధవ పనులను పవన్ సమర్థిస్తాడా… పృథ్వీ పై ఘాటు వాఖ్యలు చేసిన నట్టి కుమార్…!

Natti Kumar : గత కొన్నిరోజులుగా కమెడియన్ 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీ వైసీపీ పార్టీ మీద ఘాటు వాఖ్యలు చేస్తున్నారు. జనసేన లోకి జంప్ అవుతాడేమో అన్నట్లుగా కులాల గురించి మాట్లాడుతూ వైరల్ అవుతున్నారు. ఇక వైసీపీ లో సిగ్గు శరం ఉన్నవాడెవడు వైసీపీలో ఉండడు అంటూ కామెంట్స్ చేసారు. ఇక జగనే పిలిచినా దండం పెడతాను నేను ఇక పార్టీలోకి వెళ్ళను అన్నారు. ఇక మళ్ళీ ఇంకో ఇంటర్వ్యూలో ఉగ్రవాదులను తయారుచేసే పార్టీ వైసీపీ అంటూ మాట్లాడారు. ఇక దీనిపై వైసీపీ స్పందించింది.

నీ వెధవ పనులను పవన్ సమర్థిస్తారా…

ఇక కుల రాజకీయాల గురించి మాట్లాడుతూ హీట్ పెంచుతున్న థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ గురించి నట్టి కుమార్ ఘాటు వాఖ్యలు చేసారు. నట్టి కుమార్ పృథ్వీ గురించి మాట్లాడుతూ వెనకాల నుండి వాటేసుకొని అంటూ మాటాడితే జనసేన లో నిన్ను తీసుకుంటాడా పవన్ కళ్యాణ్. నీ వెధవ పనులను ఆయన సమర్థిస్తాడా అంటూ ప్రశ్నించారు. కాపులందరు జనసేనకు మద్దతిస్తారు అన్నట్టుగా మాట్లాడుతున్నారు.

అభిమానం వేరు రాజకీయం వేరు, నాకు మెగాస్టార్ అన్నా పవన కళ్యాణ్ అన్నా అభిమానమే సినిమాల పరంగా వాళ్లంటే ఇష్టమే కానీ రాజకీయంగా మాత్రం కాదు. రాజకీయాల్లో వైఎస్సార్ తో ఉన్నా ఆ తరువాత జగన్ తో ఉన్నా కానీ ఏనాడూ పదవులు ఆశించలేదు. ఏమి కష్టపడకపోయినా నీకు (పృథ్వీ) ఎస్విబిసి చైర్మన్ పదవి ఇస్తే వివాదాలు తెచ్చుకున్నావ్. కనీసం ఆరోపణలు వస్తే అవి నిజం కానపుడు వారిపై కేసు వేయాల్సింది. అలా చేయకుండా వైసీపీ నాయకులపై విరుచుకుపడుతూ కాపులకు అన్యాయం చేసారంటూ నిందారోపణలు చేయకూడదు అంటూ మాట్లాడారు.