సైరా నరసింహారెడ్డి, బిగిల్ వంటి బ్లాక్ బస్టర్ చిత్రాలు తన ఖాతాలో వేసుకున్న లేడీ సూపర్ స్టార్ నయనతారకు ఉన్న డిమాండ్ అంతా ఇంతా కాదు.. సీనియర్ హీరోల సరసన నటించడానికి పర్ఫెక్టుగా సరిపోయే నయనతార. సాధారణంగా 4 కోట్ల పారితోషకానికి కొంచెం కూడా తగ్గని నయనతార మొన్న సూపర్ స్టార్ రజనీకాంత్ సరసన దర్బార్ సినిమాకోసం ఏకంగా 5.5 కోట్ల పారితోషకం తీసుకుంది. ఈ చిత్రం క్రిస్మస్ కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ప్రస్తుతం ఈ అమ్మడు తన రెమ్యూనరేషన్ తగ్గించుకుందని వార్తలు కోలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది.
తమిళంలో ప్రముఖ నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ ప్రస్తుతం సూపర్ స్టార్ రజనీకాంత్ తో “అన్నాత్తే” అనే చిత్రాన్ని నిర్మిస్తున్నారు అయితే ఈ చిత్రం లో కథానాయికగా నయనతారను అనుకున్నారట. అందుకోసం ఆమెను సంప్రదించగా “దర్బార్” చిత్రానికి తీసుకున్నట్టుగా 5.5 కోట్లు అడిగిందట. దీనితో నయనతార పారితోషకాన్ని తాము తూగలేమని చేతులెత్తేసారు సన్ పిక్చర్స్ వారు.
దర్బార్ సినిమాను నిర్మించిన లైకా ప్రొడక్షన్స్ ఒక కార్పొరేట్ సంస్థ.. ప్రస్తుతం “అన్నాత్తే” నిర్మిస్తున్న సన్ పిక్చర్స్ తమిళనాడుకు చెందిన ప్రాంతీయ సంస్థ కావడంతో నయన్ అడిగిన పారితోషకాన్ని ఇవ్వలేమని చెప్పేశారట. దీంతో ఈ సినిమాను వదులుకోవడం ఇష్టంలేక ఆమె తక్కువ పారితోషకాన్ని ఒప్పుకుందని వినికిడి.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…