Nayanathara: పసుపు తాడును సెంటిమెంట్ గా భావించిన నయనతార.. అందుకే తీయలేదా?
Nayanathara: సాధారణంగా వివాహ సమయంలో వరుడు వధువు మెడలో పసుపు తాడును కడతారు. ఇలా పసుపు తాడుతో మాంగల్య ధారణ చేసిన తర్వాత వధువు ఆ పసుపు తాడును 11 రోజులకు లేదా తొమ్మిది రోజులకు దానిని తొలగించి బంగారపు గొలుసులోకి మాంగల్యాన్ని వేసుకుంటారు. ఈ విధంగా ప్రతి ఒక్కరూ బంగారు చైన్ వేసుకోవడం మనం చూస్తున్నాము.
ఇకపోతే సెలబ్రిటీల విషయానికి వస్తే.. పెళ్లి తర్వాత అసలు మాంగళ్యం ధరించడమే మానేస్తారు.సినిమాలో పాత్రలకు అనుగుణంగా వీరు మెడలో ఉన్న మాంగల్యాన్ని కూడా తీసేయడం మనం చూస్తున్నాము. అయితే దక్షిణాది సినీ ఇండస్ట్రీలో లేడీస్ సూపర్ స్టార్ గా పేరు సంపాదించుకున్న నయనతార మాత్రం ఇండస్ట్రీలో సరికొత్త ట్రెండ్ క్రియేట్ చేశారు. ఈమె దర్శకుడు విగ్నేష్ శివన్ ను వివాహం చేసుకున్న సంగతి మనకు తెలిసిందే.
గత నెల 9వ తేదీన ఎంతో ఘనంగా వీరి వివాహం జరిగింది. ఇకపోతే వీరి వివాహం జరిగి దాదాపు నెల రోజులు కావస్తున్న ఇప్పటికి నయనతార మెడలో పసుపు తాడు అలాగే ఉంది. వీరి వివాహం తర్వాత హనీమూన్ వెళ్లిన సమయంలో కూడా నయనతార మెడలో పసుపు తాడు అలాగే ఉంది.ఇక వీరి హనీమూన్ పూర్తి చేసుకుని వచ్చిన తర్వాత ఈమె ప్రస్తుతం అట్లీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న జవాన్ సినిమా షూటింగ్లో పాల్గొన్నారు.
ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ముంబైలో జరుగుతోంది. ఇకపోతే నయనతార షూటింగ్ లొకేషన్లో ఉన్నటువంటి ఫోటోలు వైరల్ కాగా ఈమె మెడలో ఇప్పటికి పసుపు తాడు అలాగే ఉండడం చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఈ క్రమంలోనే తన భర్త కట్టిన ఈ పసుపు తాడును నయనతార ఎంతో సెంటిమెంట్ గా భావిస్తున్నారని అందుకే తాను స్టార్ సెలబ్రిటీ అయినప్పటికీ పసుపు తాడును మెడలో నుంచి తీయకుండా అలాగే వేసుకున్నారు అంటూ ఈమె పై ప్రశంసలు కురిపిస్తున్నారు.
నేటి వేగవంతమైన జీవనశైలిలో నడుము నొప్పి ఒక సాధారణ సమస్యగా మారుతోంది. ముఖ్యంగా రోజంతా కంప్యూటర్ ముందు కూర్చుని పనిచేసే…
నేటి పట్టణ జీవనశైలిలో డెంగీ ప్రమాదం కొత్త రూపం దాల్చుతోంది. ఒకప్పుడు మురుగు నీరు, చెత్త ప్రదేశాలు ప్రధాన కారణాలుగా…
సీనియర్ నటుడు రాజశేఖర్ తన సినీ ప్రయాణం, వ్యక్తిగత జీవితానికి సంబంధించిన అనేక ఆసక్తికర విషయాలను తాజాగా ఓ ఇంటర్వ్యూలో…
ఇంటి వంటల్లో రుచితో పాటు ఆరోగ్యం కూడా కలగాలంటే సీజనల్ కూరగాయలతో తయారయ్యే వంటకాలకు ప్రాధాన్యం ఇవ్వాలని పోషకాహార నిపుణులు…
ఇంద్రకీలాద్రిపై వెలసిన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి ఆలయంలో జగద్గురు ఆదిశంకరుల జయంతి ఉత్సవాలు మంగళవారం వైభవంగా నిర్వహించబడ్డాయి. వైశాఖ…
ప్రస్తుత జీవనశైలిలో ఆరోగ్య సమస్యలు పెరుగుతున్న నేపథ్యంలో సహజ పదార్థాలపై మళ్లీ దృష్టి పెడుతున్నారు చాలా మంది. మన వంటింట్లో…