Vijayendra Prasad: రాజ్యసభకు ఎంపికైన రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్.. ఇళయరాజాకు అరుదైన గౌరవం?
Vijayendra Prasad: భారత రాజ్యాంగం ప్రకారం గత కొన్ని సంవత్సరాలుగా ఎవరైతే వివిధ రంగాలలో సేవలు అందిస్తూ దేశ ప్రతిష్ఠను కాపాడుతారో అలాంటి వారికి రాజ్యాంగం ప్రకారం రాష్ట్రపతి కోటాలో వారిని రాజ్యసభ సభ్యుడిగా ఎంపిక చేయడం జరుగుతుంది. ఈ క్రమంలోనే రాష్ట్రపతి కోటాలో భాగంగా నలుగురిని రాజ్యసభకు ఎంపిక చేసినట్లు ప్రధానమంత్రి వెల్లడించారు.
ఈ విధంగా రాజ్యసభకు ఎంపిక చేసిన వారిలో నలుగురు కూడా సౌత్ కు చెందిన సెలబ్రిటీలు కావడం గమనార్హం. వీరిలో ప్రముఖ రైటర్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న విజయేంద్ర ప్రసాద్ ను రాజ్యసభ సభ్యునిగా ఎంపిక చేశారు. అలాగే ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా, క్రీడా రంగానికి చెందిన పి.టి.ఉష, ప్రముఖ ఫిలాంత్రాఫిస్ట్ అయిన ఇంద్ర వీర హెగ్డే ని కూడా రాజ్యసభకు నామినేట్ చేసినట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించారు.
ఇకపోతే సినిమా రంగంలో కొన్ని దశాబ్దాల నుంచి విజయేంద్ర ప్రసాద్ ప్రముఖ రైటర్ గా ఎంతో మంచి గుర్తింపు పొందారు. ఈయన రచించిన బాహుబలి, ఆర్ఆర్ఆర్ సినిమాలతో తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పారు. ఇది మాత్రమే కాకుండా ఆయన రచించిన బజరంగీ భాయిజాన్ సినిమాకి కూడా దేశవ్యాప్తంగా ఎంతో మంచి గుర్తింపు వచ్చింది.ఇకపోతే ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా విజయాల గురించి మనకు తెలిసిందే.
ఇళయరాజా సంగీతంలో వచ్చిన పాటలు ఇప్పటికీ శ్రోతలను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి.ఈయన కూడా గత కొన్ని దశాబ్దాల నుంచి సినీ ఇండస్ట్రీలో ఎన్నో సేవలు చేయడంతో ఇతనిని కూడా రాజ్యసభకు నామినేట్ చేశారు. ఈ విధంగా రాజ్యసభకు నామినేట్ అయిన వారికి స్వయంగా నరేంద్ర మోడీ ఫోన్ చేసి వారికి అభినందనలు తెలియజేశారు. ఇక సినీ పరిశ్రమకు చెందిన ఇద్దరికీ రాజ్యసభ సభ్యులుగా అవకాశం రావడంతో సినీ ప్రముఖులు వీరిద్దరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…