Vijayendra Prasad: రాజ్యసభకు ఎంపికైన రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్.. ఇళయరాజాకు అరుదైన గౌరవం?
Vijayendra Prasad: భారత రాజ్యాంగం ప్రకారం గత కొన్ని సంవత్సరాలుగా ఎవరైతే వివిధ రంగాలలో సేవలు అందిస్తూ దేశ ప్రతిష్ఠను కాపాడుతారో అలాంటి వారికి రాజ్యాంగం ప్రకారం రాష్ట్రపతి కోటాలో వారిని రాజ్యసభ సభ్యుడిగా ఎంపిక చేయడం జరుగుతుంది. ఈ క్రమంలోనే రాష్ట్రపతి కోటాలో భాగంగా నలుగురిని రాజ్యసభకు ఎంపిక చేసినట్లు ప్రధానమంత్రి వెల్లడించారు.
ఈ విధంగా రాజ్యసభకు ఎంపిక చేసిన వారిలో నలుగురు కూడా సౌత్ కు చెందిన సెలబ్రిటీలు కావడం గమనార్హం. వీరిలో ప్రముఖ రైటర్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న విజయేంద్ర ప్రసాద్ ను రాజ్యసభ సభ్యునిగా ఎంపిక చేశారు. అలాగే ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా, క్రీడా రంగానికి చెందిన పి.టి.ఉష, ప్రముఖ ఫిలాంత్రాఫిస్ట్ అయిన ఇంద్ర వీర హెగ్డే ని కూడా రాజ్యసభకు నామినేట్ చేసినట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించారు.
ఇకపోతే సినిమా రంగంలో కొన్ని దశాబ్దాల నుంచి విజయేంద్ర ప్రసాద్ ప్రముఖ రైటర్ గా ఎంతో మంచి గుర్తింపు పొందారు. ఈయన రచించిన బాహుబలి, ఆర్ఆర్ఆర్ సినిమాలతో తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పారు. ఇది మాత్రమే కాకుండా ఆయన రచించిన బజరంగీ భాయిజాన్ సినిమాకి కూడా దేశవ్యాప్తంగా ఎంతో మంచి గుర్తింపు వచ్చింది.ఇకపోతే ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా విజయాల గురించి మనకు తెలిసిందే.
ఇళయరాజా సంగీతంలో వచ్చిన పాటలు ఇప్పటికీ శ్రోతలను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి.ఈయన కూడా గత కొన్ని దశాబ్దాల నుంచి సినీ ఇండస్ట్రీలో ఎన్నో సేవలు చేయడంతో ఇతనిని కూడా రాజ్యసభకు నామినేట్ చేశారు. ఈ విధంగా రాజ్యసభకు నామినేట్ అయిన వారికి స్వయంగా నరేంద్ర మోడీ ఫోన్ చేసి వారికి అభినందనలు తెలియజేశారు. ఇక సినీ పరిశ్రమకు చెందిన ఇద్దరికీ రాజ్యసభ సభ్యులుగా అవకాశం రావడంతో సినీ ప్రముఖులు వీరిద్దరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
కర్ణాటక రాష్ట్రంలోని బెళగావి జిల్లాలో చోటుచేసుకున్న ఒక దారుణ ఘటన కుటుంబాల్లో పెరుగుతున్న అసహనం ఎంత ప్రమాదకరంగా మారుతుందో మరోసారి…
సినీ దర్శకుడు పూరి జగన్నాథ్ తన కొత్త పాడ్కాస్ట్లో మరోసారి తనదైన స్టైల్లో ఆలోచింపజేసే విషయాలను ప్రస్తావించారు. ‘సైన్స్ అండ్…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన కెరీర్లోనే కాకుండా వ్యక్తిగత జీవితంలోనూ లగ్జరీకి ప్రాధాన్యత ఇస్తున్నట్లు మరోసారి రుజువైంది. ఇప్పటికే…
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర్ రావు కన్నుమూశారు. 90 ఏళ్ల వయసులో ఆయన బుధవారం ఉదయం తుదిశ్వాస…
తెలుగు సినీ పరిశ్రమపై ఎప్పుడూ ముక్కుసూటిగా మాట్లాడే నటుడు జేడీ చక్రవర్తి తాజాగా మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు.…
సినిమా రంగంలో నటీనటుల కష్టాలు, అంకితభావం గురించి తరచూ వినిపిస్తుంటుంది. అయితే కొంతమంది స్టార్ హీరోయిన్లు తమ పనిపై చూపించే…