Nayanatara Wedding: దక్షిణాది సినీ ఇండస్ట్రీలో లేడీ సూపర్ స్టార్ గా కొనసాగుతున్నటువంటి నయనతార ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ భారీ మొత్తంలో రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తూ అగ్రతారగా కొనసాగుతున్నారు. ఇలా దక్షిణాది సినీ ఇండస్ట్రీలో అగ్రతారగా ఉన్నటువంటి నయనతార ఇప్పటికే పలువురుతో ప్రేమలో పడి వారి ప్రేమకు బ్రేకప్ చెప్పుకున్న సంగతి తెలిసిందే. ఇకపోతే ప్రస్తుతం ఈమె దర్శకుడు విగ్నేష్ శివన్ తో ప్రేమలో ఉన్న విషయం మనకు తెలిసిందే.
గత కొంత కాలం నుంచి అతనితో ప్రేమలో ఉన్న నయనతార ప్రస్తుతం అతనితో కలిసి ఒకే ఫ్లాట్ లో నివసిస్తున్నారు. ఇలా ప్రేమలో ఉన్న ఈ జంట ఎవరికి తెలియకుండా రహస్యంగా నిశ్చితార్థం జరుపుకున్నారు.ఈ క్రమంలోనే ఎంతో అంగరంగ వైభవంగా వీరి వివాహం చేసుకోవాలని పెద్ద ఎత్తున ప్లాన్ చేసినట్లు సమాచారం. ఈ నెల 9వ తేదీన ఈ ప్రేమ పక్షులు పెళ్లి బంధంతో ఒక్కటి కానున్నారు. అయితే వీరి వివాహం ఎంతో అంగరంగ వైభవంగా చేసుకోబోతున్నట్లు సమాచారం.
ఇకపోతే ఈ మధ్య కాలంలో ప్రముఖ సెలబ్రెటీ అందరూ వారి వివాహానికి సంబంధించిన వేడుకను ప్రముఖ సంస్థలకు భారీ మొత్తానికి అమ్ముతున్నారు. ఈ క్రమంలోనే నయనతార విగ్నేష్ కూడా వీరి పెళ్లి వేడుకను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్ లో ప్రసారం చేయనున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయం గురించి అధికారిక ప్రకటన లేకపోయినా ఈ విషయం తెలిసిన పలువురు కేవలం డబ్బు కోసమే నయనతార ఇలా తన పెళ్లి వేడుకను నెట్ ఫ్లిక్ కి అమ్మారని భావిస్తున్నారు. ఇక వీరి పెళ్లి వేడుకను ప్రముఖ దర్శకుడు గౌతమ్ మీనన్ దర్శకత్వంలో ప్రసారం కానున్నట్లు సమాచారం.
ఇక నయనతార పెళ్లిని ఎంతో అంగరంగ వైభవంగా జరుపుకోనుంది. వీరి వివాహానికి సినీ ప్రముఖుల నుంచి రాజకీయ ప్రముఖుల వరుకు హాజరు కానున్నట్లు సమాచారం.ఇకపోతే తాజాగా ఈ జంట తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ లో కలిసి తమ వివాహానికి ఆహ్వానించిన సంగతి మనకు తెలిసిందే. ఇక సినీ ఇండస్ట్రీకి చెందిన పలువురు సెలబ్రిటీలు సైతం వీరి వివాహానికి పెద్ద ఎత్తున హాజరు కానున్నారు. అదేవిధంగా నయనతార మాజీ ప్రియులు కూడా ఈ వివాహానికి వస్తున్నట్లు సమాచారం.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…