Nayanatara Wedding: దక్షిణాది సినీ ఇండస్ట్రీలో లేడీ సూపర్ స్టార్ గా కొనసాగుతున్నటువంటి నయనతార ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ భారీ మొత్తంలో రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తూ అగ్రతారగా కొనసాగుతున్నారు. ఇలా దక్షిణాది సినీ ఇండస్ట్రీలో అగ్రతారగా ఉన్నటువంటి నయనతార ఇప్పటికే పలువురుతో ప్రేమలో పడి వారి ప్రేమకు బ్రేకప్ చెప్పుకున్న సంగతి తెలిసిందే. ఇకపోతే ప్రస్తుతం ఈమె దర్శకుడు విగ్నేష్ శివన్ తో ప్రేమలో ఉన్న విషయం మనకు తెలిసిందే.
గత కొంత కాలం నుంచి అతనితో ప్రేమలో ఉన్న నయనతార ప్రస్తుతం అతనితో కలిసి ఒకే ఫ్లాట్ లో నివసిస్తున్నారు. ఇలా ప్రేమలో ఉన్న ఈ జంట ఎవరికి తెలియకుండా రహస్యంగా నిశ్చితార్థం జరుపుకున్నారు.ఈ క్రమంలోనే ఎంతో అంగరంగ వైభవంగా వీరి వివాహం చేసుకోవాలని పెద్ద ఎత్తున ప్లాన్ చేసినట్లు సమాచారం. ఈ నెల 9వ తేదీన ఈ ప్రేమ పక్షులు పెళ్లి బంధంతో ఒక్కటి కానున్నారు. అయితే వీరి వివాహం ఎంతో అంగరంగ వైభవంగా చేసుకోబోతున్నట్లు సమాచారం.
ఇకపోతే ఈ మధ్య కాలంలో ప్రముఖ సెలబ్రెటీ అందరూ వారి వివాహానికి సంబంధించిన వేడుకను ప్రముఖ సంస్థలకు భారీ మొత్తానికి అమ్ముతున్నారు. ఈ క్రమంలోనే నయనతార విగ్నేష్ కూడా వీరి పెళ్లి వేడుకను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్ లో ప్రసారం చేయనున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయం గురించి అధికారిక ప్రకటన లేకపోయినా ఈ విషయం తెలిసిన పలువురు కేవలం డబ్బు కోసమే నయనతార ఇలా తన పెళ్లి వేడుకను నెట్ ఫ్లిక్ కి అమ్మారని భావిస్తున్నారు. ఇక వీరి పెళ్లి వేడుకను ప్రముఖ దర్శకుడు గౌతమ్ మీనన్ దర్శకత్వంలో ప్రసారం కానున్నట్లు సమాచారం.
ఇక నయనతార పెళ్లిని ఎంతో అంగరంగ వైభవంగా జరుపుకోనుంది. వీరి వివాహానికి సినీ ప్రముఖుల నుంచి రాజకీయ ప్రముఖుల వరుకు హాజరు కానున్నట్లు సమాచారం.ఇకపోతే తాజాగా ఈ జంట తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ లో కలిసి తమ వివాహానికి ఆహ్వానించిన సంగతి మనకు తెలిసిందే. ఇక సినీ ఇండస్ట్రీకి చెందిన పలువురు సెలబ్రిటీలు సైతం వీరి వివాహానికి పెద్ద ఎత్తున హాజరు కానున్నారు. అదేవిధంగా నయనతార మాజీ ప్రియులు కూడా ఈ వివాహానికి వస్తున్నట్లు సమాచారం.
ఉదయం వాకింగ్ చేయడం ఆరోగ్యానికి ఎంతో మంచిదని వైద్యులు చెబుతుంటారు. బరువు నియంత్రణ నుంచి గుండె ఆరో్యం వరకు ఎన్నో…
వేసవి కాలంలో ఎండలు పెరిగిపోవడంతో చాలామంది చల్లటి నీళ్లకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తుంటారు. బయట నుంచి ఇంటికి వచ్చిన వెంటనే…
వేసవి కాలంలో మామిడిపండ్లు అంటే చాలా మందికి ప్రత్యేకమైన ఇష్టం. రోజూ మామిడి తినకుండా ఉండలేని వారూ ఉంటారు. అయితే…
వేసవి వచ్చిందంటే పిల్లలకు సెలవులు, ఆటలు, సరదాలు మొదలవుతాయి. ఈ సమయంలో చాలా మంది తల్లిదండ్రులు పిల్లలను స్విమ్మింగ్ క్లాసులకు…
వేసవి కాలం వచ్చిందంటే శరీరంలో నీటి శాతం తగ్గిపోవడం, అలసట, డీహైడ్రేషన్ వంటి సమస్యలు ఎక్కువగా కనిపిస్తాయి. ఇలాంటి సమయంలో…
హిందువుల అత్యంత పవిత్ర తీర్థయాత్రల్లో ఒకటిగా భావించే కైలాస మానస సరోవర యాత్రకు సంబంధించిన కీలక ప్రకటన వెలువడింది. 2026…