Nayanthara: లేడీ సూపర్ స్టార్ నయనతార సాధారణంగా సినిమా ప్రమోషన్లకు హాజరుకారు అయితే ఈమె నిర్మాణంలో ఈమె హీరోయిన్గా నటించిన కనెక్ట్ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను మాత్రం భారీగా నిర్వహించారు.ఈ క్రమంలోనే కనెక్ట్ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా యాంకర్ సుమతో కలిసి తెలుగులో ఈమె ఒక ఇంటర్వ్యూలో హాజరయ్యారు.
ఈ క్రమంలోనే సుమ తెలుగులో నయనతార నటించిన హీరోల గురించి పలు ప్రశ్నలు అడిగారు. ఇక నయనతార ఎన్టీఆర్ తో కలిసి అదుర్స్ సినిమాలో నటించిన విషయం మనకు తెలిసిందే.ఈ క్రమంలోనే ఆదర్శ సినిమా షూటింగ్ సమయంలో ఎన్టీఆర్ అల్లరి గురించి ఆయన వ్యక్తిత్వం గురించి నయనతార ఈ సందర్భంగా తెలియజేశారు.
ఎన్టీఆర్ చాలా అల్లరోడని ఎప్పుడు ఏదో ఒక సెటైర్స్ వేస్తూ అందరిని నవ్విస్తూ ఉంటారని తెలిపారు. ఇక ఎన్టీఆర్ గొప్ప డాన్సర్ అని ఆయన ఎలాంటి రిహార్సల్స్ లేకుండా అప్పటికప్పుడు స్టెప్స్ చూసి టేక్ కి సిద్ధమవుతారు అంటూ ఆయన డాన్స్ గురించి నయనతార ప్రశంసల వర్షం కురిపించారు. ఎన్టీఆర్ లాంటి గొప్ప డాన్సర్ ను తాను ఇప్పటివరకు చూడలేదని నయనతార తెలియజేశారు.
ఇక అదుర్స్ సినిమా షూటింగ్ సమయంలో మేకప్ రూమ్ లో తాను మేకప్ వేసుకుంటూ ఉండగా ఎన్టీఆర్ వచ్చి అలాగే చూస్తూ ఉన్నారు. ఏంటి అని ప్రశ్నించడంతో ఎందుకు అలా మేకప్ అవుతున్నావు అని ప్రశ్నించారు. షార్ట్ ఉంది కదా అనడంతో ఎందుకు స్క్రీన్ పై నేను పక్కన ఉంటే నువ్వు కనపడవు కదా.. అందరూ నన్నే చూస్తారు కదా అంటూ సెటైర్లు వేసారని అప్పటి విషయాలను నయనతార ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు.ప్రస్తుతం ఎన్టీఆర్ గురించి నయనతార చేసినటువంటి ఈ కామెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
గుడికి వెళ్లి దైవదర్శనం చేసుకుని బయటకు వస్తే మనసు ప్రశాంతంగా ఉంటుంది. కానీ మెట్ల దగ్గర వదిలిన చెప్పులు కనిపించకపోతే…
దేశంలో కుంభమేళా అంటే వెంటనే గుర్తుకొచ్చేది ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్. అక్కడ జరిగే మహాకుంభమే ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక సమ్మేళనం. కానీ…
హైదరాబాద్ ఫిబ్రవరి 19: దైవబలం ఎలా ఉంటుందో మన కన్నుల ముందు ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్ జీవనంలోని పరీక్షలూ,…
2026లో తొలి చంద్రగ్రహణం త్వరలోనే సంభవించనుంది. ఈసారి హోలీ పండుగ రోజునే గ్రహణం పడనున్నట్లు ఖగోళ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. జ్యోతిష్య…
“మేడి పండు చూడు మేలిమైనుండు… పొట్ట విప్పి చూడు పురుగులండు” అనే పద్యం మనందరికీ చిన్నప్పటి నుంచే పరిచయం. బయటకు…
తెలంగాణ రాజకీయాల్లో కొత్త సమీకరణాలకు రంగం సిద్ధమవుతోంది. కల్వకుంట్ల కవిత తాజాగా చేసిన ప్రకటనలు రాష్ట్ర రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా…