సాధారణంగా ఆడపిల్ల పుడితే భారం అని భావించే వారు ఎంతోమంది ఆడపిల్లలు పుట్టగానే వారిని ముళ్ళ పొదలు, చెత్త కుండీలలో పడేయడం చూస్తుంటాను అదేవిధంగా మరికొందరు ఆడపిల్ల అని తెలియగానే కడుపులోని వారి ప్రాణాలను పైకి పంపిస్తున్నారు. కానీ ఉత్తర ప్రదేశ్ ఘాజీపూర్లో ఓ వింత ఘటన చోటు చేసుకుంది. గంగానదిలో ఓ చెక్కపెట్టె కొట్టుకు వచ్చింది.అది చూసిన ఓ వ్యక్తి ఆ పెట్టెను తెరచి చూడగా అందులో ఓ చంటి బిడ్డ ఉండడం చూసి ఎంతో ఆశ్చర్యపోయారు. ప్రస్తుతం ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. పూర్తి వివరాల్లోకి వెళితే…
ఘాజీపూర్లో సదర్ కొత్వాలి ప్రాంతంలోని దాద్రి ఘాట్ వద్ద గంగానదిలో చంటిబిడ్డ ఏడుపులు వినిపించడంతో పడవ నడుపుతున్న వ్యక్తి ఆ ఏడుపు ఎక్కడి నుంచి వస్తుందోనని గమనించాడు. అయితే ఆ ఏడుపు నదిలో కొట్టుకు వస్తున్న చెక్క పెట్టె నుంచి వినిపించడంతో ఆ వ్యక్తి ఆ బాక్స్ ను పట్టుకొని దానిని తెరిచి చూశాడు. అయితే అందులో ఒక ఆడ బిడ్డ అదేవిధంగా అమ్మవారి ఫోటో ఉండడం చూసి ఎంతో ఆశ్చర్యపోయాడు.
చెక్క పెట్టెలో ఒక ఎర్రటి వస్త్రంలో 21 రోజుల వయసున్న ఆడబిడ్డ ఉండడంతో పాటు ఆ బిడ్డ జాతకం ప్రకారం ఆ బిడ్డకు గంగా అని పేరు పెట్టినట్లు ఒక కాగితంలో రాసి ఉంది. అదేవిధంగా ఆ పెట్టెలో అమ్మవారి ఫోటో ఉండడంతో ఆ వ్యక్తి ఆ గంగమ్మ తల్లి ఈ బిడ్డను తనకు ప్రసాదించిందని భావించి, ఆ బిడ్డ దొరకడం తమ అదృష్టం అనుకొని బిడ్డను తీసుకుని ఇంటికి వెళ్ళాడు.
ఈ విషయం తెలుసుకున్న స్థానిక పోలీసులు బిడ్డను తన దగ్గర పెంచుకోవడానికి వీలులేదని ఆ చిన్నారిని తీసుకుని ఆశాజ్యోతి కేర్ సెంటర్ కు తరలించారు. అయితే ఈ బిడ్డను చెక్కపెట్టెలో ఎవరు నదిలో వదిలి ఉంటారు అనే కోణంలో దర్యాప్తు ప్రారంభించారు. ఏదిఏమైనా ఈ విధంగా చెక్కపెట్టెలో బిడ్డ కొట్టుకు రావడం రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది.
వంట చేయడం ఒక కళ. అందులో రుచి రావాలంటే ఉప్పు, కారం, మసాలాలు అన్నీ సరైన మోతాదులో ఉండాలి. అయితే…
ఒకప్పుడు వెన్నునొప్పి, మెడ నొప్పి, వెన్నెముక సమస్యలు అంటే 50 ఏళ్లు దాటిన వారిలోనే ఎక్కువగా కనిపించేవి. వయసు పెరగడం,…
వైద్య శాస్త్రం రోజురోజుకూ కొత్త మైలురాళ్లు చేరుకుంటోంది. ఒకప్పుడు నయం చేయలేని వ్యాధులకు మందులు కనుగొన్న శాస్త్రవేత్తలు ఇప్పుడు వ్యాధులు…
ఈ రోజుల్లో చిన్నవాళ్ల నుంచి పెద్దవాళ్ల వరకు చాలా మందిని వేధిస్తున్న సమస్యల్లో అధిక బరువు ఒకటి. పని ఒత్తిడి,…
సినిమా అంటే అంకితభావం. పాత్ర అంటే బాధ్యత. ప్రేక్షకుల ముందు కనిపించే ప్రతి సన్నివేశం పరిపూర్ణంగా ఉండాలనే తపన. ఇవన్నీ…
నేటి కాలంలో ఆరోగ్యంపై అవగాహన పెరిగిన కొద్దీ యోగా చేసే వారి సంఖ్య కూడా పెరుగుతోంది. శారీరక ఆరోగ్యంతో పాటు…