Niharika: మెగా డాటర్ నిహారిక పరిచయం అవసరం లేని పేరు నాగబాబు కుమార్తెగా బుల్లితెర యాంకర్ గా ఇండస్ట్రీకి పరిచయమైన నిహారిక తన మాటతీరుతో బుల్లితెర ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్నారు. ఇలా బుల్లితెరపై యాంకర్ గా కొనసాగుతూనే ఈమె వెండితెరపై హీరోయిన్ గా సందడి చేశారు. నిహారిక పలు సినిమాలలో నటిస్తూ ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈమెకు పెద్దగా ఆదరణ రాలేదని చెప్పాలి.
నిహారిక ఇండస్ట్రీలో హీరోయిన్గా కొనసాగుతున్న ఈమెకు పెద్దగా సక్సెస్ కాకపోవడంతో ఈమె పెద్దలు చూసిన సంబంధాన్ని పెళ్లి చేసుకుని వైవాహిక జీవితంలో అడుగుపెట్టారు.ఇలా నిహారిక జొన్నలగడ్డ వెంకట చైతన్య అనే వ్యక్తిని పెళ్లి చేసుకుని కొత్త జీవితంలోకి అడుగు పెట్టారు. అయితే సినిమాలపై ఉన్న పిచ్చి తగ్గకపోవడంతో ఈమె హీరోయిన్గా కాకుండా నిర్మాతగా ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు.
ఈ విధంగా నిహారిక పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్ స్థాపించి పలు వెబ్ సిరీస్ లను నిర్మించారు.ఇలా నిర్మాతగా వెబ్ సిరీస్ లను నిర్మిస్తూ సక్సెస్ అయినటువంటి నిహారిక తాజాగా హైదరాబాద్లో ఒక ఆఫీస్ కూడా ఏర్పాటు చేశారు.ఇలా ఈమే నిర్మాతగా కొనసాగుతూ ఉండగా అసలు నిహారిక ఇండస్ట్రీలో యాంకర్ గా కొనసాగుతూ నిర్మాతగా స్థిరపడ్డారు. అయితే ఇండస్ట్రీలో కొనసాగుతూ ఈమె ఎంత మొత్తంలో డబ్బు సంపాదించారనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.
ఈ క్రమంలోనే నిహారిక ఇండస్ట్రీలో కొనసాగుతూ భారీగానే ఆస్తులు కూడబెట్టినట్టు తెలుస్తోంది. పలు నివేదికల ప్రకారం 2020 సంవత్సరం నాటికి సుమారుగా ఈమె 35 కోట్లకు పైగా ఆస్తులను కూడా పెట్టారని తెలుస్తోంది. ఇలా నిహారిక స్వతగహ సంపాదించిన ఆస్తులు విలువ తెలిసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఇక ఈమె పెళ్లి చేసుకున్న వెంకట చైతన్య కూడా భారీగానే ఆస్తులు ఉన్నాయని కొన్ని వేలకోట్లకు అధిపతి అని తెలుస్తుంది. అయితే నిహారిక వెంకట చైతన్య మధ్య గత కొంతకాలంగా మనస్పర్ధలు వచ్చాయని విడాకులు కూడా తీసుకోబోతున్నారని తెలుస్తోంది మరి ఇందులో ఎంతవరకు నిజముందో తెలియాల్సి ఉంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…