బుల్లితెరపై ప్రసారమయ్యే కార్తీకదీపం సీరియల్ లో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.కేవలం రెండు తెలుగు రాష్ట్రాలలోని తెలుగు వాళ్ళు మాత్రమే కాకుండా ఇతర దేశాల్లో ఉన్న తెలుగువారు సైతం ఈ సీరియల్ ను ఎంతగానో ఆదరిస్తున్నారు. ప్రస్తుతం ఎంతో రసవత్తరంగా మారడంతో కార్తీకదీపం సీరియల్స్ కి రేటింగ్ బాగా పెరిగిపోయింది. ఇక ఈ సీరియల్లో డాక్టర్ బాబు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తాజాగా డాక్టర్ బాబు అలియాస్ పరిటాల నిరుపమ్ అభిమానులతో ముచ్చటిస్తూ కార్తీకదీపం సీరియల్ దర్శకుడు గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలిపారు.
డాక్టర్ బాబు మాట్లాడుతూ… ఈ సీరియల్ లో నన్ను ఆయన నిరుపమ్ అని పిలవకుండా…డాక్టర్ బాబు అంటూ ఏదో ఇంట్లో మనిషిని పిలిచినట్లు పిలవడం తనకు ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు. అదేవిధంగా దర్శకుడు రాజేంద్రతో ఇది నా ఫస్ట్ సీరియల్ కాదు.ఇంతకుమునుపే చంద్రముఖి సెకండ్ షెడ్యూల్ నుంచి అతనితో నా ప్రయాణం కొనసాగుతోంది. అప్పుడే తనతో పని చేయడం ఎంతో సౌకర్యంగా అనిపించింది అని తెలిపారు.
ఇతర దర్శకులతో పోలిస్తే రాజేంద్రగారు ఎంతో భిన్నంగా ఉంటారు. ఏ దర్శకుడైన వారు చెప్పిన విధంగానే చేయాలి. కానీ రాజేంద్ర గారు మాత్రం ముందు మనం ఎలా చేస్తామో అలా చేయిస్తారు. అందులో ఏవైనా తప్పులు ఉంటే సరి చేస్తారు. అందుకోసమే ఇతని దగ్గర పనిచేయడం ఎంతో కంఫర్టబుల్ గా ఉంటుందని కార్తీక్ బాబు తెలిపారు. నాతో పని చేయడానికి అంటే ముందుగా అతనికి చాలా షార్ట్ టెంపర్ ఉంది. ఇప్పుడు మారారని చాలామంది చెబుతుంటారు.
ఇప్పటికే ఆయన అప్పుడప్పుడు కోప్పడుతూ ఉంటారని.. ఆ సమయంలో మనం అక్కడినుంచి సైడ్ అయిపోతామని తెలిపారు. అయితే రాజేంద్ర గారు ఆర్టిస్టులపై కాకుండా సెట్ గురించో, ప్రాపర్టీ గురించో.. డైరెక్టర్ డిపార్ట్మెంట్ వాళ్లు పొరపాటున ఏదైనా తప్పు చేస్తే వారిపై కొప్పడతారు అంటూ డైరెక్టర్ రాజేంద్ర గురించి డాక్టర్ బాబు తెలియజేశారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…