Nookaraju & Asiya : ప్రేమ కోసం ఏదైనా చేస్తామని చెప్పడం వేరు చేయడం వేరు. కొంతమంది ప్రేమించిన వారి కోసం ప్రాణాలను సైతం లెక్కచేయరు. ప్రేమ కున్న గొప్పతనం అలాంటిది మరి. అంత వరకు తెలియని వ్యక్తిని ప్రాణం కన్నా ఎక్కువగా ఇష్టపడటం, వారికోసం జీవితం మొత్తం ఇచ్చేయడం ప్రేమ కున్న పవర్. అలా ప్రేమ కోసం జబర్దస్త్ నూకరాజు సాహసమే చేసాడు. పటాస్ సమయంలో పరిచయమైన ఆసియా, నూకరాజులు ప్రేమించుకుంటున్న విషయం ఈ మధ్యనే శ్రీ దేవి డ్రామా కంపెనీ షోలో బయటకు వచ్చింది. పటాస్ షో సమయంలో నూకరాజు,ఆసియా, ఫైమ, ప్రవీణ్ ల మధ్య ప్రేమ చిగురించింది. అయితే వీళ్ళ ప్రేమలు ఈవెంట్లలో అందరికీ తెలిసిపోయాయి. కానీ నూకరాజు, ఆసియా మాత్రం శ్రీ దేవి డ్రామా కంపెనీ ద్వారా ఓపెన్ అయ్యారు. నా ప్రాణం ఇస్తా అంటూ నూకరాజు, ఆసియా కాళ్ళు పట్టుకుని కష్టపెట్టినందుకు సారీ చెప్పి మరీ ఐ లవ్ యూ చెప్పాడు షోలో. ఇక ఇదంతా ఒకెత్తు అయితే ఇప్పుడు క్యాష్ షోలో తనకు ఎంత ప్రేముందో ఆసియా మీద నిరూపించుకున్నాడు.
చేతిలో కర్పూరం వెలిగించుకుని మరీ…
క్యాష్ షో.. సుమ యాంకర్ గా ప్రతి వారం కొత్త సెలబ్రిటీలతో వచ్చే క్యాష్ లో ఈ వారం ఆసియా, నూక రాజు వచ్చారు. షోలో భాగంగా సుమ వారి ప్రేమ గురించి అడుగుతూ నీది నిజమైన ప్రేమ అయితే చేతిలో కర్పూరం వెలిగించుకో అని అనగానే నూకర్శజు నిజంగానే చేతిలో కర్పూరం వెలిగించుకుని అది చివరవరకు మండే వరకు ఉన్నాడు. ఓ వైపు ఆసియా కన్నీళ్లతో వద్దు వద్దు అంటున్నా ఏ మాత్రం చేయి కాలుతుందని లెక్కచేయకుండా నూకరాజు ప్రేమ కోసం ఈ సాహసం చేసాడు. ఇక సుమ ఇప్పుడే ఆసియా ను పెళ్లి చేసుకుంటావా అని అడుగగా తాళి తీసి కట్టబోయాడు.
అక్కడితో ప్రోమో ఎండ్ అవుతుంది. ఇక ఈ ప్రోమో చూసిన చాలా మంది నెటిజన్స్ రెండు వర్గాలుగా చిలిపోయి కామెంట్స్ పెడుతున్నారు. కొంతమంది షో కోసం రేటింగ్స్ కోసం ఇవన్నీ చేస్తున్నారు. ఎక్కువయ్యాయి ఇలాంటివి అంటుంటే మరికొంతమంది నూకరాజు ది నిజమైన ప్రేమ అంటూ మెచ్చుకుంటున్నారు. మొత్తానికి ఈటీవీ వాళ్లకు మరో జంట దొరికింది లవ్ సింబల్స్ వేసి ఈవెంట్స్ లో చూపించడానికి.
నేటి వేగవంతమైన జీవనశైలిలో నడుము నొప్పి ఒక సాధారణ సమస్యగా మారుతోంది. ముఖ్యంగా రోజంతా కంప్యూటర్ ముందు కూర్చుని పనిచేసే…
నేటి పట్టణ జీవనశైలిలో డెంగీ ప్రమాదం కొత్త రూపం దాల్చుతోంది. ఒకప్పుడు మురుగు నీరు, చెత్త ప్రదేశాలు ప్రధాన కారణాలుగా…
సీనియర్ నటుడు రాజశేఖర్ తన సినీ ప్రయాణం, వ్యక్తిగత జీవితానికి సంబంధించిన అనేక ఆసక్తికర విషయాలను తాజాగా ఓ ఇంటర్వ్యూలో…
ఇంటి వంటల్లో రుచితో పాటు ఆరోగ్యం కూడా కలగాలంటే సీజనల్ కూరగాయలతో తయారయ్యే వంటకాలకు ప్రాధాన్యం ఇవ్వాలని పోషకాహార నిపుణులు…
ఇంద్రకీలాద్రిపై వెలసిన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి ఆలయంలో జగద్గురు ఆదిశంకరుల జయంతి ఉత్సవాలు మంగళవారం వైభవంగా నిర్వహించబడ్డాయి. వైశాఖ…
ప్రస్తుత జీవనశైలిలో ఆరోగ్య సమస్యలు పెరుగుతున్న నేపథ్యంలో సహజ పదార్థాలపై మళ్లీ దృష్టి పెడుతున్నారు చాలా మంది. మన వంటింట్లో…