Featured

Rachana : చిరంజీవితో హీరోయిన్ గా చేసిన రచన కెరీర్ పై ఎందుకు దెబ్బ పడిందో తెలుసా…?

Rachana : బెంగాళికి చెందిన రచన, తన సినీ కెరీర్ ని కూడా మొదట బెంగాలి నుండే ప్రారంభించింది. 1990 లో మిస్ కలకత్త గా కూడా గెలుపొందారు. అంతేకాకుండా మిస్ ఇండియా కాంటెస్ట్ లో పోటీచేసిన రచన మిస్ బ్యూటిఫుల్ స్మైల్ ని గెలుపొందారు. బెంగాలిలో రచన 50 కి పైగా సినిమాలలో నటించింది అయితే అందులో దాదాపు 40 కి పైగా సినిమాలు సిద్ధాంత్ మహాపాత్ర తో కలసి నటించినవే అవ్వడం విశేషం. ఇక హిందీలో అమితాబ్ బచ్చన్ తో కూడా కలసి నటించింది. తెలుగులో ఇ వి వి సత్యనారాయణ దర్శకత్వంలో వచ్చిన ‘నేను ప్రేమిస్తున్నాను’ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం అయ్యింది. తెలుగు తో పాటు కన్నడ, తమిళ్ సినిమాలలో కూడా నటించింది రచన. అయితే తెలుగులో మాత్రం అంతగా పేరు సంపాదించుకోలేకపోయింది.

చిరంజీవితో కలసి నటించినా కలసిరాని కెరీర్…

ఒడియా, హిందీ వంటి బాషలలో మంచి పేరు సంపాదించుకున్నా కూడా తెలుగులో మాత్రం స్టార్ ఇమేజ్ సొంతం చేసుకోలేకపోయింది. తెలుగులో మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ, వంటి అగ్ర కాథానాయకుల తోనే కాకుండా మోహన్ బాబు, జగపతిబాబు లాంటి హీరోల సరసన సినిమాలు చేసింది రచన. కానీ అవేవీ రచనని స్టార్ హీరోయిన్‌ని చేయలేకపోయాయి. చిరంజీవి తో హీరోయిన్ గా చేస్తే స్టార్ హీరోయిన్ అవ్వడం ఖాయం అని అప్పట్లో అనుకునేవారు. చిరంజీవి సరసన చేసినా కూడా రచన కి అదృష్టం కలసి రాలేదు.

కాస్త గ్లామర్ గా కనిపించే పాత్రలు చేస్తే కలిసివస్తుంది అనుకుంటే అలా కూడా రచనకు కలసి రాలేదు. అగ్ర హీరోలతో సినిమాలు చేసినా అందులో రచన చేసిన పాత్రకు ప్రాధాన్యం లేకపోవడం కారణంగానే కెరీర్ అంతగా కలసిరాలేదు అంటారు. చిరంజీవి హీరోగా వచ్చిన ‘బావగారు బాగున్నారా’ సినిమాలో చేసినా అది సెకండ్ హీరోయిన్ పాత్ర అవ్వడం, అందులోను ఆ పాత్రకు పెద్దగా ప్రాధాన్యత లేకపోవడం తో మెగాస్టార్ తో చేసినా కలసిరాలేదు. అందులోను మెగాస్టార్ సినిమా అంటే హీరోయిన్ కాస్త గ్లామర్ గా, ఉంటుందని ఊహించడం వంటి కారణాలు రచన కెరీర్ మీద దెబ్బ పడిందని అనుకోవచ్చు.

Bhargavi

Recent Posts

కోటిన్నర రూపాయల ఇంజెక్షన్ కోసం పోరాటం.. స్పందించిన సీఎం..

తెలంగాణలోని నల్గొండ జిల్లాకు చెందిన ఏడాది వయసున్న చిన్నారి ఆర్యాన్ష్ ప్రస్తుతం అరుదైన జన్యుపరమైన వ్యాధితో పోరాడుతున్నాడు. చిన్న వయసులోనే…

16 hours ago

బెంగళూరులో చిన్నారి మృతి కేసులో షాకింగ్ ట్విస్ట్.. మూడు నెలల తర్వాత తల్లి అరెస్ట్..

బెంగళూరులో మూడు నెలల క్రితం చోటుచేసుకున్న ఆరేళ్ల చిన్నారి వెన్నెల మృతి కేసు తాజాగా సంచలన మలుపు తిరిగింది. మొదట…

17 hours ago

ఆరోగ్యంతో ఆటలాడుతున్న కల్తీ టమాటాలు.. గుర్తించే సింపుల్ టెస్టులు ఇవే..

ఇటీవలి కాలంలో ఆహార భద్రతపై ప్రజల్లో అవగాహన పెరుగుతోంది. ముఖ్యంగా కూరగాయలు, పండ్లలో రసాయనాల వినియోగంపై తరచూ వార్తలు వెలువడుతుండటంతో…

17 hours ago

మామిడి పండ్లు తిన్న తర్వాత అనారోగ్యం.. ఇద్దరు బాలికల మరణం కలకలం

హైదరాబాద్ నగరంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. నారాయణగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో నివసిస్తున్న ఇద్దరు అక్కాచెల్లెళ్లు అనారోగ్యానికి గురై చికిత్స…

17 hours ago

ప్రపంచానికి కొత్త వాతావరణ హెచ్చరిక.. ‘గాడ్జిలా ఎల్‌నినో’పై నిపుణుల ఆందోళన

ప్రపంచ వాతావరణ పరిస్థితులపై మరోసారి ఆందోళన వ్యక్తమవుతోంది. ఇప్పటికే పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, వాతావరణ మార్పులు, ప్రకృతి వైపరీత్యాలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న…

19 hours ago

నాన్న ఇప్పటికీ ఆటోనే నడుపుతున్నారు..స్టార్ కొరియోగ్రాఫర్ అయినా సొంత ఇల్లు లేదు..పండు మాస్టర్ ఎమోషనల్ స్టోరీ

తెలుగు బుల్లితెరపై ప్రసారమైన ప్రముఖ డ్యాన్స్ రియాలిటీ షో ‘ఢీ’ ద్వారా ప్రేక్షకులకు పరిచయమైన పండు మాస్టర్, తన డ్యాన్స్…

20 hours ago