NTR -Hrithik Roshan: యంగ్ టైగర్ ఎన్టీఆర్ రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన RRR సినిమా తర్వాత తన తదుపరి చిత్రాన్ని కొరటాల శివ దర్శకత్వంలో చేస్తున్న విషయం మనకు తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పనులను జరుపుకుంటుంది. ఇకపోతే RRR సినిమా ద్వారా గ్లోబల్ స్టార్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఎన్టీఆర్ బాలీవుడ్ సినిమాలలో కూడా నటించడానికి సిద్ధమయ్యారు.
ఈ క్రమంలోనే హృతిక్ రోషన్ నటిస్తున్నటువంటి సినిమాలో ఈయన ఆయనతో తలపడుతున్నట్లు సమాచారం. హృతిక్ రోషన్ హీరోగా టైగర్ ష్రాఫ్ లీడ్ రోల్ లో నటించిన చిత్రం వార్.ఈ సినిమా 2019 వ సంవత్సరంలో విడుదలై అద్భుతమైన విజయాన్ని సాధించింది. అయితే ఈ సినిమా విడుదల సమయంలోనే తప్పనిసరిగా ఈ సినిమాకు సీక్వెల్ ఉంటుందని నిర్మాణ సంస్థ యశ్ రాజ్ ఫిలింస్ తెలియజేసిన విషయం మనకు తెలిసిందే.
అయితే ఇప్పటికే షూటింగ్ ప్రారంభం కావాల్సి ఉండగా కొన్ని కారణాల వల్ల ఆలస్యం మొత్తం వస్తుంది.తాజాగా ఈ సినిమా సీక్వెల్ చిత్రానికి అడుగులు పడినట్టు తెలుస్తోంది.ఇక వార్ సినిమాకి సిద్ధార్థ ఆనంద్ దర్శకత్వం వహించక ఈ సినిమా సీక్వెల్ చిత్రం నికి మాత్రం అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించబోతున్నట్లు తెలుస్తోంది.
ఇక ఈ సినిమా సీక్వెల్ చిత్రంలో హృతిక్ రోషన్ తో కలిసి ఎన్టీఆర్ స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారని సమాచారం. ఇలా ఈ విషయం తెలియడంతో ఇటు నందమూరి అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇదే కదా అసలు సిసలైన వార్ అంటే అంటూ ఈ విషయంపై నందమూరి ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు.అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో వచ్చిన బ్రహ్మాస్త్ర సినిమా తెలుగు ప్రమోషన్ కార్యక్రమాలలో ఎన్టీఆర్ పాల్గొన్న విషయం మనకు తెలిసిందే అయితే ఆ సమయంలోనే ఎన్టీఆర్ వార్ 2 లో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలుస్తోంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…