దళిత బంధుకు ఆదిలోనే అడ్డంకి!

తెలంగాణ ప్రభుత్వం ప్రవేపెడుతున్న దళిత బంధుకు ఆదిలోనే నిరసన సెగ తాకింది. హుజరాబాద్ లో ప్రారంభం అవుతున్న ఈ ప్రాజెక్ట్ లో.. కరీంనగర్ జిల్లాలోని ఓ గ్రామంలో కొంత మందిని ఎంపిక చేయడంపై గ్రామస్తులు రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేశారు.

కాగా తెలంగాణ ప్రభుత్వం పైలెట్ ప్రాజెక్టుగా చేపట్టిన దళిత బంధు కోసం అన్ని గ్రామాల్లో జాబితాను రూపొందిస్తున్నారు. ఈ నేపథ్యంలో కందుకూరు గ్రామం నుంచి 8 మందిని ఎంపిక చేయడంపై గ్రామస్తులు జాతీయ రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు. దీంతో కొంత సేపు అక్కడ ట్రాఫిక్ జాం అయ్యింది.