Ooha : కన్నడ సినిమా ‘హృదయ సామ్రాజ్యం’ సినిమాతో పరిచయమైన ఊహ అసలు పేరు ఉమా మహేశ్వరి. సినిమాల్లోకి వచ్చాక శివరంజనిగా పేరు మార్చారు. ఇక తెలుగులో ఊహ గా పేరు మార్చుకుంది. 1994 లో వచ్చిన ‘ఆమె’ సినిమాతో తెలుగు సినిమాకు పరిచయమైన ఊహ అందులో నటించిన కో ఆర్టిస్ట్ హీరో శ్రీకాంత్ ను 1997 లో పెళ్లి చేసుకుని సినిమాలకు గుడ్ బై చెప్పేసింది. ఊహ మేన మామ అభ్యుదయ భావాల రచయిత పి ఎల్ నారాయణ గారు.
ఇక శ్రీకాంత్, ఊహ లకు ముగ్గురు పిల్లలు రోషన్, మేధా, రోహన్. ఇక రోషన్ కూడా హీరో గా ‘నిర్మల కాన్వెంట్’ సినిమా ద్వారా పరిచయమాయ్యడు. గ్యాప్ తరువాత పెళ్లి సందడి సినిమాతో గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక ఇపుడు అశ్వినీదత్ లాంటి పెద్ద ప్రొడ్యూసర్ సినిమాలో ఛాన్స్ కొట్టేసాడు. ఇక ఎప్పుడు మీడియాకు దూరంగా ఉండే ఊహ తాజాగా ఒక ఇంటర్వ్యూ లో పాల్గొన్నారు. ఈ ఇంటర్వ్యూలో తన రీ ఎంట్రీ గురించి మాట్లాడారు.
సినిమాల్లోకి మళ్ళీ రావాలని ఆసక్తి లేదు…..
ఇక ఊహ పెళ్లి తరువాత సినిమాలను వదులుకున్నారు. పూర్తిగా కుటుంబ భాద్యతలకు అంకితమయ్యారు. పిల్లలు పుట్టాక వారి బాధ్యతలతో ఇక సినిమాల గురించి ఆలోచించడం మానేసారు. చాలా మంది హీరోయిన్లు పెళ్ళై, పిల్లలు పుట్టాక మళ్ళీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇస్తుంటారు. తల్లి, అక్క పాత్రలతో మళ్ళీ నటిస్తారు. ఊహ కి కూడా ఇలాంటి ప్రశ్న ఎదురైంది.
ఇపుడు పిల్లలు పెద్దగా అయిపోయారు కాబట్టి మళ్ళీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇస్తారా అని అడిగితే ఆ ఆసక్తి లేదని క్లారిటీ గా చెప్పేసారు. పిల్లలు బాధ్యతలతో బిజీగా ఉన్నానని అసలు సినిమాల వైపు ఆసక్తి లేదని చెప్పారు. అయితే ఒక కోరిక మాత్రం ఉందని, ఒకవేళ రోషన్ హీరోగా నటించే సినిమాలో తల్లి పాత్ర అవకాశం వస్తే ఖచ్చితంగా చేస్తానని చెప్పారు. రోషన్ కి తల్లిదండ్రులుగా మేమిద్దరం నటించాలని ఉందని మనసులోని మాట చెప్పారు.
వేసవి కాలంలో బయట నిలిపిన బైక్పై కూర్చుంటే సీటు వేడి ఎక్కువగా ఉండటం సాధారణమే. కానీ ఈ వేడి కేవలం…
ఎండబెట్టిన చేపలు, అంటే డ్రై ఫిష్, సాధారణంగా రుచికరమైన వంటకంగా మాత్రమే భావిస్తారు. కానీ పోషకాహార నిపుణుల ప్రకారం ఇవి…
ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లాలో ప్రసిద్ధి చెందిన మురాది ఆంజనేయస్వామి ఆలయంలో హుండీ లెక్కింపు కార్యక్రమం తాజాగా నిర్వహించారు. ఈ సందర్భంగా…
భారత ఉపరాష్ట్రపతి జగదీప్ ధనఖడ్ ఆంధ్రప్రదేశ్ పర్యటనలో భాగంగా శ్రీకాకుళం జిల్లాలోని ప్రసిద్ధ దేవాలయాలను సందర్శించారు. ఈ సందర్భంగా జిల్లా…
తెలంగాణలోని సిద్దిపేట పట్టణం ఆదివారం రాత్రి భక్తి వాతావరణంలో తేలియాడింది. శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి అమ్మవారు రథోత్సవం ఘనంగా నిర్వహించబడగా,…
వైశాఖ మాసంలోని శుక్ల పక్షంలో వచ్చే మోహిని ఏకాదశి హిందూ సంప్రదాయంలో అత్యంత పవిత్రమైన వ్రతాలలో ఒకటిగా భావించబడుతుంది. ఈ…