మన దేశంలో గత ఏడాది డిసెంబర్లో లాంచ్ అయినఒప్పో ఏ53 5జీకి స్మార్ట్ ఫోన్ తర్వాతి వెర్షన్గా ఒప్పో ఏ53ఎస్ 5జీ స్మార్ట్ ఫోన్ లాంచ్ అయ్యింది. కొత్తగా లాంచ్ అయిన ఈ వెర్షన్ మే 2వ తేదీ నుంచి ఫ్లిప్కార్ట్ సెల్ ద్వారా కొనుగోలు చేయవచ్చు.ఫోన్ వెనకవైపు మూడు కెమెరాలు ఉన్నాయి. మీడియాటెక్ డైమెన్సిటీ 700 ప్రాసెసర్పై ఈ ఫోన్ పనిచేయనుంది.
ప్రస్తుతం మన దేశంలో లాంచ్ అయినా ఒప్పో ఏ53ఎస్ 5జీ స్మార్ట్ ఫోన్లలో రెండు వేరియంట్లలో అందుబాటులో ఉన్నాయి. ఇందులో ఒకటి 6 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధరను రూ.14,990గా నిర్ణయించగా, మరొక వేరియంట్ 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.16,990గా నిర్ణయించారు. ఈ స్మార్ట్ ఫోన్ లో ప్రస్తుతం క్రిస్టల్ బ్లూ, ఇంక్ బ్లాక్ రంగులు అందుబాటులో ఉన్నాయి.హెచ్డీఎఫ్సీ బ్యాంకు క్రెడిట్ కార్డులు, ఈఎంఐ ద్వారా కొనుగోలు చేస్తే రూ.1,250 డిస్కౌంట్ పొందవచ్చు.
ఈ వెర్షన్ ఫోన్ 6.52 అంగుళాల ఫుల్ హెచ్డీ+ డిస్ ప్లేను అందించారు. దీని స్క్రీన్ టు బాడీ రేషియో 88.7 శాతంగా ఉంది. ఆక్టాకోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 700 ప్రాసెసర్పై పని చేయనుంది. ఇందులో మూడు కెమెరాలు ఉండగా ప్రధాన కెమెరా 13 మెగాపిక్సల్ సెన్సార్ ను అందించారు. 2 మెగాపిక్సెల్ డెప్త్ లెన్స్, 5 మెగాపిక్సెల్ మాక్రో సెన్సార్ కూడా ఇందులో ఉన్నాయి. ఇక సెల్ఫీ కెమెరా 8 మెగా పిక్సెల్ సామర్థ్యం కలిగి ఉంది.
దీని బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్గా ఉంది.
తెలుగు సినీ పరిశ్రమలో కొత్త తరం నటీమణుల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సాధిస్తున్న శివాత్మిక తాజాగా చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా…
ఐపీఎల్ 2026 సీజన్లో గాయాల సమస్యలు జట్లకు తలనొప్పిగా మారుతున్నాయి. ముఖ్యంగా చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు ఇది పెద్ద…
తెలుగు సినీ పరిశ్రమలో తన సహజ నటనతో ప్రత్యేక గుర్తింపు పొందిన ప్రగతి తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన కెరీర్లో…
తెలుగు సినీ పరిశ్రమలో నాలుగు దశాబ్దాలకు పైగా తన నటనతో ప్రత్యేక గుర్తింపు పొందిన జయసుధ, ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో…
తెలుగు ప్రేక్షకులకు తన అందమైన నటనతో, మృదువైన వ్యక్తిత్వంతో దగ్గరైన నటి నాదియా తాజాగా తన సినీ ప్రయాణం, వ్యక్తిగత…
ఐపీఎల్ 2026 సీజన్లో యువ ఆటగాళ్ల ప్రదర్శనలు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడుతున్న వైభవ్ సూర్యవంశీ…