దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ కోరలు ఛాస్తున్న నేపథ్యంలో ఎవరినీ వదిలిపెట్టడం లేదు. చిన్నపిల్లల నుంచి పండు ముసలి వారి వరకు వ్యాపించి ఎంతోమంది ప్రాణాలను బలిగొంటోంది. ఈ క్రమంలోనే విశాఖ జిల్లాలో ఏడాది బిడ్డను కరోనా బలితీసుకుంది. కేవలం నాలుగు రోజుల వ్యవధిలోనే కన్నబిడ్డను కోల్పోవడంతో ఆ తల్లి ఎంతో విలపించింది.
అచ్యుతాపురం మండలం చౌడుపల్లికి చెందిన వీరబాబు సీఐఎస్ఎఫ్లో పని చేస్తున్నారు. ఏడాది వయసున్న కూతురు జ్ఞానితకు గత నాలుగు రోజుల క్రితం అధికంగా దగ్గు, జలుబు, జ్వరం రావడంతో సన్ రైస్ ఆసుపత్రిలో చేర్పించారు.దాదాపు లక్ష రూపాయల వరకు ఖర్చు చేసిన పాపకు నయం కాకపోవడంతో వైద్యులు కరోనా పరీక్షలు నిర్వహించగా పాజిటివ్ అని తేలింది. దీంతో మెరుగైన చికిత్స కోసం పాపని మరొక కార్పొరేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు.
అక్కడి వైద్యులు పాపను కేజీహెచ్కు ఆసుపత్రికి తీసుకెళ్లాలని చెప్పడంతో ప్రత్యేక అంబులెన్స్ లో జ్ఞానితను కేజీహెచ్కు తరలించారు. ఆస్పత్రికి చేరుకొని అడ్మిషన్ చేసే లోపు పాప మృత్యువాత పడింది.మూడు రోజుల పాటు చికిత్స అందిస్తూ చివరిక్షణంలో పాప ప్రాణాలను కోల్పోవడంతో ఆస్పత్రి ఆవరణంలో ఆతల్లి రోదన చూసిన కేజీహెచ్లో అందరూ కన్నీళ్లు పెట్టుకున్నారు.విశాఖలో కరోనాకు ఏడాది చిన్నారి మృతి..!
కర్ణాటక రాష్ట్రంలోని బెళగావి జిల్లాలో చోటుచేసుకున్న ఒక దారుణ ఘటన కుటుంబాల్లో పెరుగుతున్న అసహనం ఎంత ప్రమాదకరంగా మారుతుందో మరోసారి…
సినీ దర్శకుడు పూరి జగన్నాథ్ తన కొత్త పాడ్కాస్ట్లో మరోసారి తనదైన స్టైల్లో ఆలోచింపజేసే విషయాలను ప్రస్తావించారు. ‘సైన్స్ అండ్…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన కెరీర్లోనే కాకుండా వ్యక్తిగత జీవితంలోనూ లగ్జరీకి ప్రాధాన్యత ఇస్తున్నట్లు మరోసారి రుజువైంది. ఇప్పటికే…
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర్ రావు కన్నుమూశారు. 90 ఏళ్ల వయసులో ఆయన బుధవారం ఉదయం తుదిశ్వాస…
తెలుగు సినీ పరిశ్రమపై ఎప్పుడూ ముక్కుసూటిగా మాట్లాడే నటుడు జేడీ చక్రవర్తి తాజాగా మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు.…
సినిమా రంగంలో నటీనటుల కష్టాలు, అంకితభావం గురించి తరచూ వినిపిస్తుంటుంది. అయితే కొంతమంది స్టార్ హీరోయిన్లు తమ పనిపై చూపించే…