Barrelakka: బిగ్ బాస్ కార్యక్రమం ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ ఒకరు. ఒక కామన్ మాన్ గా హౌస్ లోకి అడుగుపెట్టి సెలెబ్రెటీ హోదా సొంతం చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో విజేతగా నిలిచినటువంటి ఈయనకు విపరీతమైనటువంటి ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోయింది.
ఇటీవల కాలంలో అదే స్థాయిలో పాపులారిటీ సొంతం చేసుకున్నటువంటి వారిలో బర్రెలు అక్క అలియాస్ శిరీష ఒకరు. ఈమె నిరుద్యోగ ఒక యూట్యూబ్ ఛానల్ ప్రారంభించి ఎన్నో రకాల వీడియోలు చేసేవారు. అనంతరం తెలంగాణ ఎన్నికలలో ఇండిపెండెంట్ అభ్యర్థిగా ఎమ్మెల్యే ఎలక్షన్లలో పోటీ చేసి అందరి దృష్టిని ఆకర్షించారు.
ఈమె ఎన్నికలలో గెలవలేకపోయినా అందరి దృష్టిని ఆకర్షించి సెలబ్రిటీ హోదాని సొంతం చేసుకున్నారు. అయితే తాజాగా వీరిద్దరికీ సంబంధించి ఒక రూమర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వీరిద్దరూ రహస్యంగా పెళ్లి చేసుకున్నారు అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నటువంటి తరుణంలో శిరీష ఈ వార్తలపై స్పందించి క్లారిటీ ఇచ్చారు.
అన్నను ఎక్కడైనా పెళ్లి చేసుకుంటారా..
తాను ఒక రైతు బిడ్డ అలాగే బిగ్ బాస్ కార్యక్రమంలోకి వచ్చిన పల్లవి ప్రశాంత్ అన్న కూడా రైతుబిడ్డ కావడంతో తనని గెలిపించాలని తనకు మద్దతుగా కొన్ని వీడియోలు చేశాను ఈ వీడియోలన్నింటిలో కూడా నేను తనని అన్నా అంటూ సంభోదించాను కానీ కొన్ని యూట్యూబ్ ఛానల్స్ మాత్రం తమ స్వార్థం కోసం మా ఇద్దరికీ పెళ్లి అయినట్టు వార్తలను సృష్టించారు. ఇలాంటి తప్పుడు వార్తలను సృష్టిస్తే అసలు సహించనని ఎక్కడైనా అన్నను పెళ్లి చేసుకుంటారా ఇదే మన సంస్కృతినా అంటూ ఈమె తన స్టైల్ లో వార్నింగ్ ఇస్తూ ఈ వార్తలను పూర్తిగా ఖండించారు.
తెలుగు బుల్లితెరపై ప్రసారమైన ప్రముఖ డ్యాన్స్ రియాలిటీ షో ‘ఢీ’ ద్వారా ప్రేక్షకులకు పరిచయమైన పండు మాస్టర్, తన డ్యాన్స్…
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం ‘మా ఇంటి బంగారం’ విడుదలకు సిద్ధమైంది. గత…
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా బ్యూటీ రంగంలో అత్యంత ఎక్కువగా వినిపిస్తున్న పదాల్లో "కొరియన్ స్కిన్కేర్" ఒకటి. ముఖ్యంగా సోషల్ మీడియా వేదికలపై…
తమిళ సినీ పరిశ్రమలో నటుడు, దర్శకుడు, కొరియోగ్రాఫర్గా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న రాఘవ లారెన్స్ ఇప్పుడు రాజకీయాల్లోకి అడుగుపెట్టనున్నట్లు ప్రకటించడం…
హైదరాబాద్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు మరోసారి పెరగడంతో కొనుగోలుదారులు ఆందోళన చెందుతున్నారు. గత కొద్ది రోజులుగా తగ్గుదల దిశగా…
కాకినాడ జిల్లాలోని తుని మండలం సీహెచ్ అగ్రహారంలో అదృశ్యమైన రెండేళ్ల చిన్నారి జ్ఞానేశ్వరి కేసు రోజురోజుకూ మరింత ఉత్కంఠ రేపుతోంది.…