Pawan Kalyan: ఒకే వేదికపై ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకున్న పవన్, మంచు విష్ణు.. ఫోటోలు వైరల్!
Pawan Kalyan: సినిమా ఇండస్ట్రీలో కొందరు హీరోలు మధ్య మనస్పర్ధలు రావడం సర్వసాధారణం. అయితే మనస్పర్ధలు వచ్చినప్పటికీ తిరిగి ఏదైనా సందర్భంలో వాళ్ళు కలిసినప్పుడు ఆ మనస్పర్ధలు పక్కనపెట్టి ఎంతో సరదాగా మాట్లాడుకోవడం ఎంతో ఆశ్చర్యకరంగా ఉంటుంది.ఈ విధంగా టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగా కుటుంబానికి మంచు కుటుంబానికి మధ్య మనస్పర్ధలు ఉన్న విషయం అందరికీ తెలిసిందే. నిత్యం ఈ రెండు కుటుంబాల మధ్య ఏదో ఒక విషయం గురించి కోల్డ్ వార్ జరుగుతుంది.
ఇకపోతే మా ఎన్నికల సమయంలో ఈ రెండు కుటుంబాల మధ్య దూరం మరికాస్త పెరిగిందనే చెప్పాలి. మా ఎన్నికల సమయంలో ఒకరిపై మరొకరు పెద్ద ఎత్తున మాటల యుద్ధం జరుపుకున్నారు. ఈ ఎన్నికల తర్వాత మంచు కుటుంబం మెగా కుటుంబం ఎక్కడ ఎదురు పడిన సందర్భాలు లేవు. తాజాగా సీనియర్ నటుడు అర్జున్ దర్శకత్వంలో ఆయన కూతురు ఐశ్వర్యను హీరోయిన్ గా పరిచయం చేస్తూ విశ్వక్సేన్ హీరోగా ఒక సినిమా చేయబోతున్నారని పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి.
ఈ సినిమా పూజా కార్యక్రమాలను హైదరాబాదులో ఎంతో ఘనంగా జరుపుకున్నారు. ఈ సినిమా పూజా కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పవన్ కళ్యాణ్ రాగా, మంచు విష్ణు సైతం ఈ కార్యక్రమంలో సందడి చేశారు. ఈ క్రమంలోనే వేదికపై కలుసుకున్న ఈ ఇద్దరు హీరోలు ఒకరినొకరు ఎంతో ఆప్యాయంగా పలకరించుకున్నారు. ఈ క్రమంలోనే వీరిద్దరి ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
ఇక అర్జున్ దర్శకత్వంలో విశ్వక్ ఐశ్వర్య జంటగా నటిస్తున్న ఈ సినిమా పూజా కార్యక్రమాలలో భాగంగా పవన్ కళ్యాణ్ హీరోహీరోయిన్లపై క్లాప్ కొట్టి సినిమా షూటింగ్ ప్రారంభించారు. ఈ సినిమాను శ్రీరామ్ ఫిల్మ్స్ ఇంటర్ నేషనల్ తెరకెక్కిస్తోంది. కేజీఎఫ్ చిత్రాల సంగీత దర్శకుడు రవి బస్రూర్ ఈ సినిమాకి సంగీతం అందించనున్నారు. ప్రస్తుతం పవన్ ,విష్ణు ఫోటోలు వైరల్ అవుతున్నాయి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…