Pawan Kalyan: ఒకే వేదికపై ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకున్న పవన్, మంచు విష్ణు.. ఫోటోలు వైరల్!
Pawan Kalyan: సినిమా ఇండస్ట్రీలో కొందరు హీరోలు మధ్య మనస్పర్ధలు రావడం సర్వసాధారణం. అయితే మనస్పర్ధలు వచ్చినప్పటికీ తిరిగి ఏదైనా సందర్భంలో వాళ్ళు కలిసినప్పుడు ఆ మనస్పర్ధలు పక్కనపెట్టి ఎంతో సరదాగా మాట్లాడుకోవడం ఎంతో ఆశ్చర్యకరంగా ఉంటుంది.ఈ విధంగా టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగా కుటుంబానికి మంచు కుటుంబానికి మధ్య మనస్పర్ధలు ఉన్న విషయం అందరికీ తెలిసిందే. నిత్యం ఈ రెండు కుటుంబాల మధ్య ఏదో ఒక విషయం గురించి కోల్డ్ వార్ జరుగుతుంది.
ఇకపోతే మా ఎన్నికల సమయంలో ఈ రెండు కుటుంబాల మధ్య దూరం మరికాస్త పెరిగిందనే చెప్పాలి. మా ఎన్నికల సమయంలో ఒకరిపై మరొకరు పెద్ద ఎత్తున మాటల యుద్ధం జరుపుకున్నారు. ఈ ఎన్నికల తర్వాత మంచు కుటుంబం మెగా కుటుంబం ఎక్కడ ఎదురు పడిన సందర్భాలు లేవు. తాజాగా సీనియర్ నటుడు అర్జున్ దర్శకత్వంలో ఆయన కూతురు ఐశ్వర్యను హీరోయిన్ గా పరిచయం చేస్తూ విశ్వక్సేన్ హీరోగా ఒక సినిమా చేయబోతున్నారని పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి.
ఈ సినిమా పూజా కార్యక్రమాలను హైదరాబాదులో ఎంతో ఘనంగా జరుపుకున్నారు. ఈ సినిమా పూజా కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పవన్ కళ్యాణ్ రాగా, మంచు విష్ణు సైతం ఈ కార్యక్రమంలో సందడి చేశారు. ఈ క్రమంలోనే వేదికపై కలుసుకున్న ఈ ఇద్దరు హీరోలు ఒకరినొకరు ఎంతో ఆప్యాయంగా పలకరించుకున్నారు. ఈ క్రమంలోనే వీరిద్దరి ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
ఇక అర్జున్ దర్శకత్వంలో విశ్వక్ ఐశ్వర్య జంటగా నటిస్తున్న ఈ సినిమా పూజా కార్యక్రమాలలో భాగంగా పవన్ కళ్యాణ్ హీరోహీరోయిన్లపై క్లాప్ కొట్టి సినిమా షూటింగ్ ప్రారంభించారు. ఈ సినిమాను శ్రీరామ్ ఫిల్మ్స్ ఇంటర్ నేషనల్ తెరకెక్కిస్తోంది. కేజీఎఫ్ చిత్రాల సంగీత దర్శకుడు రవి బస్రూర్ ఈ సినిమాకి సంగీతం అందించనున్నారు. ప్రస్తుతం పవన్ ,విష్ణు ఫోటోలు వైరల్ అవుతున్నాయి.
తెలుగు ఇంటి వంటల్లో ఊరగాయకు ఉన్న స్థానం ప్రత్యేకం. వేడివేడి అన్నంలో ఒక ముద్ద పచ్చడి ఉంటే చాలు, భోజనానికి…
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పర్యాటకం, ఉద్యోగాలు, వ్యాపార ప్రయాణాలు విపరీతంగా పెరిగిపోయాయి. ఒక నగరం నుంచి మరో నగరానికి, ఒక దేశం…
ప్రస్తుతం ప్రభుత్వ రంగ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా…
తెలంగాణలో క్రికెట్కు మరింత ప్రోత్సాహం అందించే లక్ష్యంతో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న టీజీ20 లీగ్ ప్రారంభానికి సర్వం…
తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్గా, నటిగా సుపరిచితమైన విష్ణుప్రియ భీమినేని మరోసారి వార్తల్లో నిలిచారు. టెలివిజన్ షోలు, రియాలిటీ కార్యక్రమాలు,…
వ్యవసాయం అనేది దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక. రైతు సంతోషంగా ఉంటేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. అయితే…