ఇప్పటి వరకూ మనం చూస్తున్న రాజకీయాలు వేరు.. ఇప్పుడు మనం చూస్తున్న రాజకీయాలు వేరు. అధికారంలోకి వచ్చిన వెంటనే అంతకు ముందు అధికారంలో ఉన్నవారిని గుత్తాగానో.. లేదంటే సింగిల్గానో మూసేయాలి.. విపక్షం అనేది లేకుండా చూసుకోవాలి. ప్రస్తుతం పాలిటిక్స్లో నడుస్తున్న ట్రెండ్ ఇదే. అయితే నేను ట్రెండ్ ఫాలో అవ్వను.. సెట్ చేస్తా అని ఏదో సినిమాలో పవన్ కల్యాణ్ చెప్పారు. ఇప్పుడు రాజకీయాల్లోనూ పవన్ ట్రెండ్ సెట్ చేస్తున్నారు. ఇంతకీ ఏంటా ట్రెండ్ అంటారా? కక్ష సాధింపులకు చెక్ పెట్టాలనేది. ఏ అధికార పార్టీ అయినా కక్ష సాధింపులకు పాల్పడటం సర్వసాధారణం. పవన్ మాత్రం వద్దు అంటున్నారు. పైగా తను తప్పు చేసినా కూడా చర్యలు తీసుకోండని అసెంబ్లీ సాక్షిగా చెప్పారు. వాస్తవానికి ఈ మాట చెప్పాలంటే గట్స్ ఉండాలి. అదేదో నోటి నుంచి వచ్చిన మాటలా అనిపించలేదు. హృదయాంతరాల నుంచి వచ్చిన మాట. ఒక స్ట్రాంగ్ స్టేట్మెంట్. నిశ్శబ్దాన్ని చీల్చే మాట. సంచలనానికి నాంది పలికిన మాట. వాస్తవానికి ఈ తరహా ప్రకటనలు అధికారంలో ఉన్న పార్టీల నేతల నుంచి ఏమాత్రం ఆశించలేము.
అవినీతి ఆస్కారం లేని పాలనను అందిద్దాం..
అధికారంలో ఉన్నవారు తప్పు చేసినా కూడా తాము తప్పు చేయలేదని గట్టిగా వాదిస్తుంటారు. అలాంటిది చేస్తే చర్య తీసుకోమన్నారు. పైగా తన పార్టీ నేతలను సైతం కక్షలు కార్పణ్యాల జోలికి వెళ్లవద్దని గట్టిగానే చెబుతున్నారు. అధికారంలోకి వచ్చిన నాటి నుంచి కూడా వపన్ విభిన్నమైన రాజకీయం చేస్తున్నారు. ఎవరినీ విమర్శించడం లేదు. ప్రజా సమస్యలు.. అధికారులతో సమీక్షలు తప్ప మరి వేటిని పట్టించుకోవడం లేదు. బాధ్యతగా ఉండాలని చెప్పడం కాదు.. తాను బాధ్యతగా ఉండి చూపిస్తున్నారు. డిప్యూటీ సీఎం పదవికి ఒక హూందాతనాన్ని తీసుకొచ్చారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే అంశంలో ఉప ముఖ్యమంత్రి హోదాలో పవన్ కళ్యాణ్ మాట్లాడిన తీరు ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటోంది. రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. శాంతి భద్రతల విషయంలో కూటమి ప్రభుత్వం గట్టిగా ఉంటుందని.. గత ప్రభుత్వం తప్పులు చేశారని మనమూ చేయనక్కరలేదని హితవు పలికారు. ప్రతి ఒక్కరూ రాజకీయ కక్షలు విరమించాలన్నారు. ఎవరైనా తప్పు చేస్తే.. చట్ట ప్రకారం వెళ్లాలి తప్ప వ్యక్తిగత దాడులకు దిగవద్దని సూచించారు. అవినీతి ఆస్కారం లేని పాలనను ప్రజలకు అందిద్దామని తెలిపారు.
జగన్ నానా రచ్చ చేస్తున్న తరుణంలో..
వాస్తవానికి ఇవన్నీ సినిమాల్లో మాత్రమే చూడగలం.. కానీ వాస్తవంలోనూ చూపిస్తూ పవన్ రీల్ హీరో మాత్రమే కాదు.. రియల్ హీరో అనిపించుకుంటున్నారు. తప్పు ఎవరు చేసినా.. చివరకు తానే చేసినా శిక్షకు సిద్ధమని పవన్ తెలిపారు. ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేయాలని పవన్ కోరారు. రాష్ట్రాన్ని పునర్మించుకునేందుకు అంతా కృషి చేయాలని పవన్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా తెలుగు నేలపై జన్మించిన మహానుభావులను పవన్ గుర్తు చేశారు. వారి స్ఫూర్తితో ముందుకు సాగాలన్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పవన్ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా ఇవాళ వైసీపీ అధినేత జగన్ ఏపీలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయని.. కక్ష సాధింపు రాజకీయాన్ని ఎన్డీఏ చేస్తోందంటూ నానా రచ్చ చేస్తున్న తరుణంలో పవన్ మాటలను జనసైనికులు పెద్ద ఎత్తున వైరల్ చేస్తున్నారు. నెట్టింట పవన్ వ్యాఖ్యలు హాట్ టాపిక్గా మారాయి.
ఇటీవలి కాలంలో బరువు తగ్గడం, షుగర్ నియంత్రణ కోసం వాడుతున్న GLP-1 తరహా మందులపై చర్చ పెరుగుతోంది. వైద్యుల సలహాతో…
ఉదయపు అల్పాహారంలో ఇడ్లీ, దోసె, ఉప్మా వంటి వంటకాలకు తోడు తప్పనిసరిగా కనిపించే వంటకం కొబ్బరి చట్నీ. సాధారణంగా రుచికోసం…
వేసవి మొదలవుతూనే ఆహారంలో మార్పులు చేసుకోవాలని నిపుణులు సూచిస్తుంటారు. శరీరాన్ని చల్లగా ఉంచుకోవడం, నీటి కొరత రాకుండా జాగ్రత్తపడటం ఈ…
కొబ్బరికాయ కొనడం చాలా సాధారణమైన పని అనిపించినా, చాలా సార్లు అది మనకు నిరాశ కలిగిస్తుంది. బయట నుంచి బాగానే…
ఆరోగ్యంపై అవగాహన పెరుగుతున్న కొద్దీ సహజమైన ఆహారాలపై ప్రజల దృష్టి మరింతగా పడుతోంది. అలాంటి వాటిలో “అల్ఫాల్ఫా” అనే మొక్క,…
ఇటీవలి కాలంలో ఆధ్యాత్మిక అంశాలపై ఆసక్తి పెరుగుతున్న కొద్దీ “స్పిరిట్ యానిమల్” అనే భావన కూడా సోషల్ మీడియాలో, యువతలో…