Pawan Kalyan: ఏపీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తాజాగా అదానీ జగన్ ముడుపుల వ్యవహారం గురించి చేసిన వ్యాఖ్యలు సంచలనగా మారాయి. ఏపీలో విద్యుత్ ఒప్పందాల కోసం జగన్మోహన్ రెడ్డి ఏకంగా 1750 కోట్ల రూపాయలు తీసుకున్నట్టు వార్తలు వచ్చాయి. ప్రస్తుతం అదానీ పై అమెరికాలో కూడా కేసులు నమోదు కావడంతో ఈ విషయం రెండు తెలుగు రాష్ట్రాలలో కూడా సంచలనగా మారింది.
మరోవైపు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా సిల్క్ యూనివర్సిటీ కోసం 100 కోట్ల రూపాయలు విరాళంగా అందుకున్నారు. అయితే అదానీ పట్ల కేసులో నమోదు కావడంతో ఆయన తీసుకున్నటువంటి ఆ వంద కోట్ల రూపాయలను కూడా తిరిగి వెనక్కి ఇచ్చేస్తున్నట్లు రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఇక తాజాగా జగన్ అదానీ ముడుపుల వ్యవహారం పట్ల ఏపీ డిప్యూటీ సీఎం స్పందించారు.
గత ప్రభుత్వం ఏపీలో చేసిన తప్పులు రాష్ట్రానికి శాపంగా మారాయని పవన్ కళ్యాణ్ తెలిపారు. ప్రస్తుతం మేము వాటిని సరిదిద్దాల్సిన అవసరం వచ్చిందని తెలిపారు. ఇక జగన్ అదానీ విషయం గురించి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో సుదీర్ఘంగా చర్చలు జరిపి సరైన నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. గత ప్రభుత్వం బాధ్యత లేకుండా వ్యవహరించిందని కేవలం సమోసాల కోసమే 9 కోట్ల వరకు ఖర్చు చేసింది అంటూ ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు సంచలనగా మారాయి.
ఇక వైకాపా నాయకులు మాత్రం అదానీ వ్యవహారం గురించి మాట్లాడుతూ గతంలో చంద్రబాబు నాయుడు విద్యుత్ ఒప్పందంపై చేసుకున్న దాని కంటే చాలా తక్కువ ధరతో మేము విద్యుత్ ఒప్పందాలు చేసుకున్నామని, ఒకవేళ అక్రమంగానే జగన్ ముడుపులు తీసుకొని ఉంటే ఎందుకు ఇప్పటివరకు సిబిఐ ఎంక్వయిరీకి ఆదేశించలేదని ప్రశ్నిస్తున్నారు ఇందులో జగన్ చేసిన తప్పులేదు కనకే కూటమి నేతలు మౌనంగా ఉన్నారని కౌంటర్ ఇస్తున్నారు.
ఇటీవల భారతీయ వీధి ఆహారాల్లో మోమోస్ ట్రెండ్ వేగంగా పెరుగుతోంది. చిన్న పెద్ద అనే తేడా లేకుండా చాలామంది ఈ…
యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో పవిత్రతకు విరుద్ధంగా జరుగుతున్న చర్యలు భక్తుల్లో ఆందోళన కలిగిస్తున్నాయి. ఇటీవల ఆలయ సరుకుల దుర్వినియోగంపై…
వేసవి ఉష్ణోగ్రతలు రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు చల్లదనం కోసం సహజ పానీయాల వైపు మొగ్గు చూపుతున్నారు. ముఖ్యంగా కూరగాయల…
బాలీవుడ్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న అలియా భట్ మళ్లీ తెలుగు ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నట్లు ఫిల్మ్ నగర్లో జోరుగా…
ఉత్తరప్రదేశ్లోని ఆగ్రాలో జరిగిన ఒక విచిత్ర ఘటన తాజాగా సంచలనం సృష్టిస్తోంది. పెళ్లి బంధం మొదలైన తొలి రాత్రే భారీ…
కలియుగ వైకుంఠంగా పేరుగాంచిన తిరుమలలో శ్రీ వేంకటేశ్వర స్వామికు భక్తులు పెద్దఎత్తున విరాళాలు సమర్పిస్తున్నారు. ఈ క్రమంలో హైదరాబాద్కు చెందిన…