టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతో క్రేజ్ సంపాదించుకున్న హీరోలలో మెగా హీరోలు ముందుంటారు. మెగా హీరోలకు ఏ విధమైన ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం ఇండస్ట్రీలో మెగా హీరోలు పలు సినిమాలు చేస్తూ సందడి చేస్తున్నారు. ఇకపోతే మెగా కాంపౌండ్ నుంచి ఓ లేటెస్ట్ సమాచారం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
గతంలో మెగా హీరో నటించిన స్నేహం కోసం, అందరివాడు, బందిపోటు,బిల్లా రంగా వంటి సినిమాలలో తండ్రీ కొడుకుల పాత్రల్లో చిరంజీవి ద్విపాత్రాభినయంలో ఎంతో అద్భుతంగా నటించారు. అయితే ప్రస్తుతం చిరంజీవి బాటలోనే తమ్ముడు పవన్ కళ్యాణ్, కొడుకు రామ్ చరణ్ చేయనున్నట్లు సమాచారం.
ప్రస్తుతం చేతినిండా సినిమాలతో ఎంత బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్ హరీష్ శంకర్ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నట్లు మనకు తెలిసిందే. పవన్ కెరీర్ లో హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కే సినిమాలో మొట్టమొదటి సారిగా ద్విపాత్రాభినయంలో తండ్రీకొడుకుల పాత్ర చేయనున్నట్లు తెలుస్తోంది.
ఇకపోతే రామ్ చరణ్ తమిళ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో పాన్ ఇండియా తరహాలో ఓ చిత్రాన్ని చేయనున్నారు. ఈ చిత్రంలో చరణ్ ద్విపాత్రాభినయం చేయనున్నట్లు తెలుస్తోంది. తండ్రీకొడుకుల పాత్రల్లో రామ్ చరణ్ నటిస్తున్నట్లు మనకు తెలిసిందే. అయితే మొట్టమొదటిసారిగా పవన్ కళ్యాణ్ ,రామ్ చరణ్ చిరు బాటలో ద్విపాత్రాభినయంలో చేయనున్నారని తెలియడంతో మెగా అభిమానులు మాత్రం తెగ సంబర పడిపోతున్నారు
మెగాస్టార్ చిరంజీవి కెరీర్లో ఎన్నో బ్లాక్బస్టర్ చిత్రాలు వచ్చినా, ప్రేక్షకుల మదిలో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న సినిమాల్లో ‘పసివాడి ప్రాణం’…
చూపు లేకపోయినా సంగీతంతో కోట్ల హృదయాలను గెలుచుకున్న గాయని వైకమ్ విజయలక్ష్మి జీవితం నిజంగా ఎంతో మందికి స్ఫూర్తిదాయకం. చిన్నప్పటి…
మహాభారతం భారతీయ ఇతిహాసాల్లో అత్యంత ప్రాముఖ్యత కలిగిన మహాగ్రంథంగా గుర్తింపు పొందింది. ధర్మం, అధర్మం మధ్య జరిగిన కురుక్షేత్ర యుద్ధం…
భారతీయ సంప్రదాయంలో రత్నాలకు ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. అందులోనూ ముత్యాలు ఎప్పటినుంచో పవిత్రత, ప్రశాంతత, శుభానికి ప్రతీకగా భావించబడుతున్నాయి. తెల్లని…
వివాహం అనేది ఇద్దరి మనుషుల మధ్య బంధమే కాదు, వారి ఆలోచనలు, స్వభావాలు, జీవన విధానాల కలయిక కూడా. వేద…
హిందూ సాంప్రదాయంలో కొన్ని మొక్కలకు ప్రత్యేకమైన ఆధ్యాత్మిక ప్రాధాన్యం ఉంటుంది. వాటిలో పారిజాతం మొక్కకు ఎంతో విశిష్ట స్థానం ఉంది.…